మల్కాజిగిరి జోనల్ కమిషనర్ తో టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు మల్కాజిగిరి, జనవరి 08 గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ ఎంసీ విస్తరణలో బాగంగా మల్కాజిగిరి జోనల్ కార్యాలయం ఏర్పడింది. జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్ పదవి బాధ్యతల్లో నియమితులైన సందర్బంగా బుధవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో వారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. శాలువా కప్పి, పూల మొక్కను అందించారు. ఈ సందర్బంగా ఫెడరేషన్ నాయకులు కమిషనర్ కు వినతి పత్రం అందజేస్తూ వారి పరిధిలోని విషయాలను దృష్టికి తెచ్చారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యలు గుమ్మడి హరి ప్రసాద్, జిల్లా అద్యక్ష్యులు మల్లేష్ గౌడ్, కార్యదర్శి బనావత్ రవి , ఉపాధ్యక్షులు గుమ్మడి రోజారాణి, కోశాధికారి మధు యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సబ్బ రాజేందర్, ఆర్ బాల నరసింహ, జిల్లా కమిటి సభ్యులు దుర్గాప్రసాద్, కె మహేందర్, కె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి జోనల్ కమిషనర్ తో టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు మల్కాజిగిరి, జనవరి 08 గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ ఎంసీ విస్తరణలో బాగంగా మల్కాజిగిరి జోనల్ కార్యాలయం ఏర్పడింది. జోనల్ కమిషనర్ గా సంచిత్ గంగ్వార్ పదవి బాధ్యతల్లో నియమితులైన సందర్బంగా బుధవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో వారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. శాలువా కప్పి, పూల మొక్కను అందించారు. ఈ సందర్బంగా ఫెడరేషన్ నాయకులు కమిషనర్ కు వినతి పత్రం
అందజేస్తూ వారి పరిధిలోని విషయాలను దృష్టికి తెచ్చారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యలు గుమ్మడి హరి ప్రసాద్, జిల్లా అద్యక్ష్యులు మల్లేష్ గౌడ్, కార్యదర్శి బనావత్ రవి , ఉపాధ్యక్షులు గుమ్మడి రోజారాణి, కోశాధికారి మధు యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సబ్బ రాజేందర్, ఆర్ బాల నరసింహ, జిల్లా కమిటి సభ్యులు దుర్గాప్రసాద్, కె మహేందర్, కె బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అభినందనలు అందుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు. ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.2
- భారత్ మాత కి జై 🇮🇳1
- 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 9 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు దేవీ రవీందర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గజ్వేల్ మున్సిపల్ వార్డులను పెంచాలని కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి రాజేష్ గారికి వార్డులను పెంచాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- సంగారెడ్డి పట్టణంలో శిశు గృహ, సఖి కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య1
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1
- జనగామ జిల్లా చిల్పూర్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.1
- భారత్ మాత కి జై 🇮🇳2