logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జూదం గుట్టురట్టు.. గణేష్‌నగర్‌లో టాస్క్‌ఫోర్స్ దాడి.. ఏడుగురు అరెస్ట్.. రూ.1.32 లక్షల నగదు స్వాధీనం వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేష్‌నగర్ కాలనీలో జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో రూ.1,32,090 నగదు, ప్లేయింగ్ కార్డులు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఏసీపీ ఏ.మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి.బాబులాల్, ఎస్సై కె.సుధాకర్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

3 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
3 hrs ago

జూదం గుట్టురట్టు.. గణేష్‌నగర్‌లో టాస్క్‌ఫోర్స్ దాడి.. ఏడుగురు అరెస్ట్.. రూ.1.32 లక్షల నగదు స్వాధీనం వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేష్‌నగర్ కాలనీలో జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో రూ.1,32,090 నగదు, ప్లేయింగ్ కార్డులు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఏసీపీ ఏ.మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ జి.బాబులాల్, ఎస్సై కె.సుధాకర్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హైదరాబాద్ లో యువకుడు హత్య...పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో శవం...11 రోజుల తర్వాత దొరికిన ఆచూకీ, మహిళతో సహా ముగ్గురు అరెస్టు. ప్రేమ యవ్వారం వేధింపులు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమించిన యువతి దక్కకపోవడంతో ఫోన్ లో వేధిస్తు ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళడంతో పక్క ప్లాన్ తో. హైదరాబాద్ లో హత్య చేసి మంథని అటవీ ప్రాంతంలో శవాన్ని పడేశారు. 11 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవం లభించడంతో పోలీసులు హత్య కేసును చేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ దారుణ హత్యకు గురయ్యారు. పది రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో అతని శవం లభించింది. హైదరాబాదులో హత్యకు గురైతే శవం మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులోని గాడిదలగండి వద్ద లోయలో లభించింది. ప్రేమ యవ్వారం, వేధింపులే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. గోదావరిఖని ఏ సి పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వంశీ కి అదే గ్రామానికి చెందిన అలేఖ్యతో టెన్త్ క్లాస్ లో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమాయణం సాగించారు. కానీ అలేఖ్య మరో యువకుడు నీలం నవీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల టెన్త్ క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ లో కలిసిన వంశీ, అలేఖ్య ఫోన్ నెంబర్ తీసుకొని నిత్యం ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులతోపాటు ఏకంగా వారి ఇంటికే వెళ్ళి గొడవపడ్డాడు. విసిగిపోయిన అలేఖ్య తన భర్తకు విషయం చెప్పడంతో పక్కా ప్లాన్ తో అతన్ని అంతమొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అలేఖ్యకు వంశీ ఫోన్ చేయగానే హైదరాబాదులో తన ప్లాట్ కు రమ్మంది. వెంటనే వంశీ ఏప్రిల్ 30న హైదరాబాద్ కు వెళ్లాడు. అలేఖ్య ప్లాట్ కు వెళ్ళిన వంశీని నవీన్ భాస్కర్ కారులో తీసుకుని భాస్కర్ రూమ్ కి వెళ్లారు. డ్యూటీ ఉందని నవీన్ బయటికి వెళ్లి పోగా వంశీ, భాస్కర్ మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం తాగిన అనంతరం కత్తి తీసుకుని వంశీని హత్య చేసి చాపలో చుట్టి కార్ లో భాస్కర్ ఒక్కరే మంథని కి తరలించి గాడుదులగండి వద్ద లోయలో పడేశారు. 29న ఇంటి నుంచి వెళ్లిన వంశీ తిరిగి రాకపోవడంతో తల్లి శంకరమ్మ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీ కాల్ డాటా సేకరించగా అలేఖ్య నవీన్ భాస్కర్ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా మృతదేహాన్ని మంథని వద్ద గాడుదలగండి లోయలో పడేసినట్టు తెలుపడంతో ఆదివారం పోలీసులు శవాన్ని వెలికి తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువుల ఆందోళనకు దిగారు. బంధువుల డిమాండ్ మేరకు పోలీసులు హత్య కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు ఏసిపి రమేష్ తెలిపారు.
    3
    హైదరాబాద్ లో యువకుడు హత్య...పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో శవం...11 రోజుల తర్వాత దొరికిన ఆచూకీ, మహిళతో సహా ముగ్గురు అరెస్టు.
ప్రేమ యవ్వారం వేధింపులు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమించిన యువతి దక్కకపోవడంతో ఫోన్ లో వేధిస్తు ఏకంగా ఆమె ఇంటికే వెళ్ళడంతో పక్క ప్లాన్ తో. హైదరాబాద్ లో హత్య చేసి మంథని అటవీ ప్రాంతంలో శవాన్ని పడేశారు. 11 రోజుల తర్వాత కుళ్ళిపోయిన శవం లభించడంతో పోలీసులు హత్య కేసును చేదించి ముగ్గురిని అరెస్టు చేశారు. మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల వంశీ దారుణ హత్యకు గురయ్యారు. పది రోజుల తర్వాత కుళ్ళిపోయిన స్థితిలో అతని శవం లభించింది. హైదరాబాదులో హత్యకు గురైతే శవం మంథని మండలం ఎక్లాస్పూర్ శివారులోని గాడిదలగండి వద్ద లోయలో లభించింది. ప్రేమ యవ్వారం, వేధింపులే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. గోదావరిఖని ఏ సి పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వంశీ కి అదే గ్రామానికి చెందిన అలేఖ్యతో టెన్త్ క్లాస్ లో పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమాయణం సాగించారు. కానీ అలేఖ్య మరో యువకుడు నీలం నవీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల టెన్త్ క్లాస్ బ్యాచ్ గెట్ టుగెదర్ లో  కలిసిన వంశీ, అలేఖ్య ఫోన్ నెంబర్ తీసుకొని నిత్యం ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులతోపాటు ఏకంగా వారి ఇంటికే వెళ్ళి గొడవపడ్డాడు. విసిగిపోయిన అలేఖ్య తన భర్తకు విషయం చెప్పడంతో పక్కా ప్లాన్ తో అతన్ని అంతమొందించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అలేఖ్యకు వంశీ ఫోన్ చేయగానే హైదరాబాదులో   తన ప్లాట్ కు రమ్మంది. వెంటనే వంశీ ఏప్రిల్ 30న హైదరాబాద్ కు వెళ్లాడు. అలేఖ్య ప్లాట్ కు వెళ్ళిన వంశీని నవీన్ భాస్కర్ కారులో తీసుకుని భాస్కర్ రూమ్ కి వెళ్లారు. డ్యూటీ ఉందని నవీన్ బయటికి వెళ్లి పోగా వంశీ, భాస్కర్ మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం తాగిన అనంతరం కత్తి తీసుకుని వంశీని హత్య చేసి చాపలో చుట్టి కార్ లో భాస్కర్ ఒక్కరే మంథని కి తరలించి గాడుదులగండి వద్ద లోయలో పడేశారు. 29న ఇంటి నుంచి వెళ్లిన వంశీ తిరిగి రాకపోవడంతో తల్లి శంకరమ్మ గోదావరిఖని టూ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీ కాల్ డాటా సేకరించగా అలేఖ్య నవీన్ భాస్కర్ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా మృతదేహాన్ని మంథని వద్ద గాడుదలగండి లోయలో పడేసినట్టు తెలుపడంతో ఆదివారం పోలీసులు శవాన్ని వెలికి తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బంధువుల ఆందోళనకు దిగారు. బంధువుల డిమాండ్ మేరకు పోలీసులు హత్య కేసుతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు ఏసిపి రమేష్ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    45 min ago
  • ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    1
    ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు
MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వేసవి ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసంతో పాటు పలు అంశాల్లో శిక్షణ అందిస్తారు. మే 11 నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ విద్యార్థులకు సూచించారు.
    4
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వేసవి ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసంతో పాటు పలు అంశాల్లో శిక్షణ అందిస్తారు. మే 11 నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్ విద్యార్థులకు సూచించారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    20 hrs ago
  • తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    22 hrs ago
  • చుక్కల పల్లె గ్రామానికి తరలిస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం... గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామం నుంచి చొక్కాలపల్లి గ్రామానికి ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డైరీ ఫామ్ చెందిన గడ్డి కట్టలు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న సమయంలో రహదారిపై ఉన్న లూజ్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌లో ఉన్న గడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి కట్టలు కాలిబూడిదైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనతో రైతు రాజేశంకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. లూజ్ విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    చుక్కల పల్లె గ్రామానికి తరలిస్తుండగా షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం...
గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామం నుంచి చొక్కాలపల్లి గ్రామానికి ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలు తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  డైరీ ఫామ్  చెందిన గడ్డి కట్టలు ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్న సమయంలో రహదారిపై ఉన్న లూజ్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌లో ఉన్న గడ్డి కట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు 150 గడ్డి కట్టలు కాలిబూడిదైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అప్పటికే భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనతో రైతు రాజేశంకు  నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. లూజ్ విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    16 min ago
  • వరి ధాన్యం కొనుగోళ్లపై జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. సీపీఎం ధర్నాతో తోపులాట జనగామ జిల్లాలో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
    1
    వరి ధాన్యం కొనుగోళ్లపై జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. సీపీఎం ధర్నాతో తోపులాట
జనగామ జిల్లాలో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పొక్సో కేసు రాజకీయ దుమారం...బిఆర్ఎస్ ఆందోళన...సిట్ వేసి విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ పై ఫోక్సో కేసు నమోదు కావడం, ప్రతిగా తనను ఓ యువతి పేరెంట్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భగీరథ ఫిర్యాదుతో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా దుమారం రేపుతుంది. బండి భగీరథ పై ఫోక్సోకేసు నమోదు కావడం పట్ల వెంటనే అతని అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్లో టిఆర్ఎస్వి మహిళా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పలుచోట్ల పోలీస్ స్టేషన్ నందు నిరసన తెలిపారు. అమ్మవార్లను నమ్మే బండి సంజయ్ తన కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలడా అని సవాల్ విసిరారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు ఆరోపించారు. కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. వెంటనే పొక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
    1
    కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పొక్సో కేసు రాజకీయ దుమారం...బిఆర్ఎస్ ఆందోళన...సిట్ వేసి విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ పై ఫోక్సో కేసు నమోదు కావడం, ప్రతిగా తనను ఓ యువతి పేరెంట్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భగీరథ ఫిర్యాదుతో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేయడం రాజకీయంగా దుమారం రేపుతుంది. బండి భగీరథ పై ఫోక్సోకేసు నమోదు కావడం పట్ల వెంటనే అతని అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్లో టిఆర్ఎస్వి మహిళా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పలుచోట్ల పోలీస్ స్టేషన్ నందు నిరసన తెలిపారు.   అమ్మవార్లను నమ్మే బండి సంజయ్ తన కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలడా అని సవాల్ విసిరారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు ఆరోపించారు. కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. వెంటనే పొక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
    1
    కొణిజర్ల లో జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ఎన్యూమరేట్లకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలి : జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    27 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.