logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. మృతుడు, క్షతగాత్రులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన వలస కూలీలు. వీరు కూలీ పని కోసం వలస వచ్చి బోయినపల్లి మండలం కొదురుపాకలో నివసిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో వరినాట్లు వేసిన తర్వాత సాయంత్రం కొదురుపాకకు టాటా ఏస్ వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టాటా ఏస్ వాహనంలో మొత్తం 23 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 19 మంది క్షతగాత్రులు వేములవాడ, సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి. గీతే ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. మృతుడు, క్షతగాత్రులు మహారాష్ట్రలోని చంద్రాపూర్

జిల్లాకు చెందిన వలస కూలీలు. వీరు కూలీ పని కోసం వలస వచ్చి బోయినపల్లి మండలం కొదురుపాకలో నివసిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో వరినాట్లు వేసిన తర్వాత సాయంత్రం కొదురుపాకకు టాటా ఏస్ వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టాటా ఏస్ వాహనంలో

మొత్తం 23 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 19 మంది క్షతగాత్రులు వేములవాడ, సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది

శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి. గీతే ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం, ఐపీఎస్, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ హుజురాబాద్ డివిజన్ పరిధిలో 21 నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్, సైబర్ గేమింగ్ అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు, అలాగే రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి 'రహవీర్' పథకం ద్వారా రూ.25 వేల బహుమతిని ప్రకటించారు. గురువారం నాడు సైదాబాద్ గ్రామంలో 16 సీసీ కెమెరాలను, కొరపల్లి గ్రామంలో 5 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. అనంతరం జమ్మికుంట పట్టణ మరియు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జమ్మికుంటలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రజలతో ఏర్పాటు చేసిన విస్తృత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి గ్రామం, పట్టణం, మరియు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూలను సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని సీపీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో మరో 700 కొత్త కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సదస్సులో సీపీ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా, చిన్న పిల్లలు మరియు యువత ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనాలకు గురై డబ్బులు నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కరీంనగర్ జిల్లాలోనూ వెలుగుచూస్తున్నాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. అలాగే, యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 'డయల్ 100' కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. యువత మత్తుకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని నొక్కిచెప్పారు. రోడ్డు భద్రత విషయంలో, వాహనదారులు, ప్రయాణికులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం ‘రహవీర్ పథకం’ కింద రూ. 25,000 నగదు పురస్కారం అందిస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సైదాబాద్ సర్పంచ్ రాజారామ్, కొరపల్లి సర్పంచ్ మధుసూదన్, స్థానిక ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు సీపీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతిలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ కమిషనరేట్ శాంతిభద్రతల పరిరక్షణకు ‘సీసీ కెమెరాల’ నిఘా అత్యంత కీలకమని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పునరుద్ఘాటించారు.
    2
    కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం, ఐపీఎస్, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ హుజురాబాద్ డివిజన్ పరిధిలో 21 నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్, సైబర్ గేమింగ్ అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు, అలాగే రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి 'రహవీర్' పథకం ద్వారా రూ.25 వేల బహుమతిని ప్రకటించారు.

గురువారం నాడు సైదాబాద్ గ్రామంలో 16 సీసీ కెమెరాలను, కొరపల్లి గ్రామంలో 5 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. అనంతరం జమ్మికుంట పట్టణ మరియు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జమ్మికుంటలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రజలతో ఏర్పాటు చేసిన విస్తృత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి గ్రామం, పట్టణం, మరియు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూలను సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని సీపీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో మరో 700 కొత్త కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఈ సదస్సులో సీపీ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా, చిన్న పిల్లలు మరియు యువత ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనాలకు గురై డబ్బులు నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కరీంనగర్ జిల్లాలోనూ వెలుగుచూస్తున్నాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. అలాగే, యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 'డయల్ 100' కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. యువత మత్తుకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని నొక్కిచెప్పారు. రోడ్డు భద్రత విషయంలో, వాహనదారులు, ప్రయాణికులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం ‘రహవీర్ పథకం’ కింద రూ. 25,000 నగదు పురస్కారం అందిస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సైదాబాద్ సర్పంచ్ రాజారామ్, కొరపల్లి సర్పంచ్ మధుసూదన్, స్థానిక ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు సీపీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతిలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ కమిషనరేట్ శాంతిభద్రతల పరిరక్షణకు ‘సీసీ కెమెరాల’ నిఘా అత్యంత కీలకమని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పునరుద్ఘాటించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, వాహనాల షోరూమ్‌లను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అరీఫ్ షోరూమ్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించగా, పలు లోపాలను గుర్తించారు. ఈ లోపాలపై షోరూమ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన నిర్వాహకులు కూడా నిబంధనలకు అనుగుణంగా షోరూమ్‌లను నిర్వహించాలని ఆయన సూచించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల ఆధారంగా ఎలక్ట్రిక్ వాహన షోరూమ్‌లపై, అలాగే ట్రాక్టర్ షోరూమ్‌లపై కూడా తనిఖీలు నిర్వహించబడతాయని జిల్లా రవాణా శాఖ అధికారి వెల్లడించారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, వాహనాల షోరూమ్‌లను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అరీఫ్ షోరూమ్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించగా, పలు లోపాలను గుర్తించారు. ఈ లోపాలపై షోరూమ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన నిర్వాహకులు కూడా నిబంధనలకు అనుగుణంగా షోరూమ్‌లను నిర్వహించాలని ఆయన సూచించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల ఆధారంగా ఎలక్ట్రిక్ వాహన షోరూమ్‌లపై, అలాగే ట్రాక్టర్ షోరూమ్‌లపై కూడా తనిఖీలు నిర్వహించబడతాయని జిల్లా రవాణా శాఖ అధికారి వెల్లడించారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    48 min ago
  • మంత్రి కొండ సురేఖ కడియం శ్రీహరి రాజకీయ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు, తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి గనుక నిజంగా విలువలు తెలిసిన వ్యక్తి అయితే, తన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవైపు తన కుమారుడిని కాంగ్రెస్ కండువా కప్పించి కాంగ్రెస్ ఎంపీగా గెలిపించుకుంటూ, తాను మాత్రం బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగడం రాజకీయ విలువలు లేకపోవడాన్ని సూచిస్తుందని కొండ సురేఖ మండిపడ్డారు. ఎదురుదాడి చేయడం కాదని, రాజకీయాలలో విలువలు అత్యంత ముఖ్యమని ఆమె పునరుద్ఘాటించారు.
    1
    మంత్రి కొండ సురేఖ కడియం శ్రీహరి రాజకీయ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు, తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి గనుక నిజంగా విలువలు తెలిసిన వ్యక్తి అయితే, తన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవైపు తన కుమారుడిని కాంగ్రెస్ కండువా కప్పించి కాంగ్రెస్ ఎంపీగా గెలిపించుకుంటూ, తాను మాత్రం బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగడం రాజకీయ విలువలు లేకపోవడాన్ని సూచిస్తుందని కొండ సురేఖ మండిపడ్డారు. ఎదురుదాడి చేయడం కాదని, రాజకీయాలలో విలువలు అత్యంత ముఖ్యమని ఆమె పునరుద్ఘాటించారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    2 hrs ago
  • రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ తాము విలువలతో కూడిన రాజకీయాలను చేస్తామని స్పష్టం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ, జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విలువలు తెలిసిన వారైతే తన పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచి చూపించాలని సూచించారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని తన కుమార్తెను కాంగ్రెస్ ఎంపీగా గెలిపించుకున్న తర్వాత, కడియం శ్రీహరి ఇప్పుడు తాను బిఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడంపై మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎదురుదాడి చేయడం కాదని, రాజకీయాలలో విలువలు ఉండాలని ఆమె అన్నారు. కడియం శ్రీహరి తీరును ఖండిస్తూ, తన భర్త కొండా మురళి గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తీరును ఈ సందర్భంగా మంత్రి సురేఖ వివరించారు. తాము విలువలతో కూడిన రాజకీయాలనే అనుసరిస్తామని ఆమె పునరుద్ఘాటించారు.
    1
    రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ తాము విలువలతో కూడిన రాజకీయాలను చేస్తామని స్పష్టం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ, జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విలువలు తెలిసిన వారైతే తన పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచి చూపించాలని సూచించారు.

కాంగ్రెస్ కండువా కప్పుకొని తన కుమార్తెను కాంగ్రెస్ ఎంపీగా గెలిపించుకున్న తర్వాత, కడియం శ్రీహరి ఇప్పుడు తాను బిఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకోవడంపై మంత్రి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఎదురుదాడి చేయడం కాదని, రాజకీయాలలో విలువలు ఉండాలని ఆమె అన్నారు. కడియం శ్రీహరి తీరును ఖండిస్తూ, తన భర్త కొండా మురళి గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తీరును ఈ సందర్భంగా మంత్రి సురేఖ వివరించారు. తాము విలువలతో కూడిన రాజకీయాలనే అనుసరిస్తామని ఆమె పునరుద్ఘాటించారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter Jangoan, Telangana•
    1 hr ago
  • జనగామ పట్టణంలోని 5వ వార్డులో ఉన్న ZPHS ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఈరోజు సందర్శించారు. ఈ పర్యటనలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎం.డి. యాకుబ్ పాషా (బాబులు) గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి గారు పాల్గొన్నారు. వారు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వాష్‌రూమ్‌లు, డైనింగ్ హాల్ వంటి మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, విద్యార్థినులకు తగిన భద్రతతో కూడిన మరుగుదొడ్లు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన డైనింగ్ హాల్, టాయిలెట్ నిర్మాణ పనులు బేస్‌మెంట్ దశలోనే నిలిచిపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, పాఠశాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్మన్ గారు కూడా పాల్గొని పాఠశాల సమస్యలను పరిశీలించారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజల పక్షాన అండగా ఉంటుందని నాయకులు పునరుద్ఘాటించారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని వారు స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    1
    జనగామ పట్టణంలోని 5వ వార్డులో ఉన్న ZPHS ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఈరోజు సందర్శించారు. ఈ పర్యటనలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎం.డి. యాకుబ్ పాషా (బాబులు) గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి గారు పాల్గొన్నారు. వారు విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, వాష్‌రూమ్‌లు, డైనింగ్ హాల్ వంటి మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, విద్యార్థినులకు తగిన భద్రతతో కూడిన మరుగుదొడ్లు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన డైనింగ్ హాల్, టాయిలెట్ నిర్మాణ పనులు బేస్‌మెంట్ దశలోనే నిలిచిపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి, పాఠశాలలో అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్మన్ గారు కూడా పాల్గొని పాఠశాల సమస్యలను పరిశీలించారు.

సమస్య ఎక్కడ ఉంటే అక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజల పక్షాన అండగా ఉంటుందని నాయకులు పునరుద్ఘాటించారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని వారు స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత జూలై 9న కొత్తగూడెంలోని పీవీకే-5 బొగ్గు గనిలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె స్వయంగా గనిలోకి దిగి, కార్మికులతో నేరుగా మాట్లాడారు. వారి పని పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమం మరియు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆమె సూచిస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విధంగా, కల్వకుంట్ల కవిత పీవీకే-5 గనిలోని కార్మికులతో మమేకమయ్యారు.
    1
    తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత జూలై 9న కొత్తగూడెంలోని పీవీకే-5 బొగ్గు గనిలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆమె స్వయంగా గనిలోకి దిగి, కార్మికులతో నేరుగా మాట్లాడారు. వారి పని పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమం మరియు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆమె సూచిస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విధంగా, కల్వకుంట్ల కవిత పీవీకే-5 గనిలోని కార్మికులతో మమేకమయ్యారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్‌లో గురువారం గంగాధర డివిజన్ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పైడి సతీష్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక బాధితుడి నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటుండగా అధికారులు నిఘా ఉంచి పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, లంచం సొమ్ముతో సహా ఏఈని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కరీంనగర్‌లో గురువారం గంగాధర డివిజన్ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పైడి సతీష్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక బాధితుడి నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటుండగా అధికారులు నిఘా ఉంచి పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, లంచం సొమ్ముతో సహా ఏఈని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేయడంతో పాటు, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం, ఆది శ్రీనివాస్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన వైద్య అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వ్యవసాయ కూలీలు తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ ప్రాంతంలో నాట్లు వేసే పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. అనుపురం వద్ద స్పీడ్ బ్రేకర్ సమీపంలో నెమ్మదిగా వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులకు చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్ర తల గాయాలు ఉన్న నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు వారిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. సంబంధిత వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌లతో మాట్లాడి బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సిరిసిల్ల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులందరికీ ప్రభుత్వం తరఫున నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, వాహన భద్రతా లోపమా లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే అంశాలను పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పొట్టకూటి కోసం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన పేద కార్మికులు ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆది శ్రీనివాస్, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే మరింత మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేయడంతో పాటు, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అనంతరం, ఆది శ్రీనివాస్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన వైద్య అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వ్యవసాయ కూలీలు తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ ప్రాంతంలో నాట్లు వేసే పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు.

అనుపురం వద్ద స్పీడ్ బ్రేకర్ సమీపంలో నెమ్మదిగా వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులకు చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు.

గాయపడిన వారిలో ఇద్దరికి తీవ్ర తల గాయాలు ఉన్న నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు వారిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. సంబంధిత వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌లతో మాట్లాడి బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సిరిసిల్ల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులందరికీ ప్రభుత్వం తరఫున నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, వాహన భద్రతా లోపమా లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే అంశాలను పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పొట్టకూటి కోసం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన పేద కార్మికులు ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆది శ్రీనివాస్, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే మరింత మెరుగైన చికిత్స కోసం ఇతర ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. మృతుడు, క్షతగాత్రులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన వలస కూలీలు. వీరు కూలీ పని కోసం వలస వచ్చి బోయినపల్లి మండలం కొదురుపాకలో నివసిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో వరినాట్లు వేసిన తర్వాత సాయంత్రం కొదురుపాకకు టాటా ఏస్ వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టాటా ఏస్ వాహనంలో మొత్తం 23 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 19 మంది క్షతగాత్రులు వేములవాడ, సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి. గీతే ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. మృతుడు, క్షతగాత్రులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన వలస కూలీలు. వీరు కూలీ పని కోసం వలస వచ్చి బోయినపల్లి మండలం కొదురుపాకలో నివసిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో వరినాట్లు వేసిన తర్వాత సాయంత్రం కొదురుపాకకు టాటా ఏస్ వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టాటా ఏస్ వాహనంలో మొత్తం 23 మంది కూలీలు ఉన్నట్లు గుర్తించారు.

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 19 మంది క్షతగాత్రులు వేములవాడ, సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్ బి. గీతే ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీసి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.