ముస్లిం మత పెద్దలతో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సమావేశం గణపతి శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి నిర్మల్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో మరియు సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ప్రజల మధ్య ఉన్న సోదరభావం, పరస్పర సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. ముస్లిం మత పెద్దలు తమ చిన్ననాటి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు. గతంలో గణేష్ ఉత్సవాల సమయంలో హిందూ సోదరులతో కలిసి పాల్గొన్న సందర్భాలను గుర్తుచేసుకుంటూ, నిర్మల్లో ప్రజల మధ్య ఉన్న స్నేహభావం, సోదరభావం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు, తమకు ఉన్న సూచనలు మరియు సమస్యలను మత పెద్దలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వారి సూచనలు, అభ్యర్థనలను జిల్లా ఎస్పీ సానుకూలంగా విని, ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ తనకు సమానమేనని, ఎవరికైనా ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే తనను సంప్రదించవచ్చని, వారి సమస్యలను విని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఉత్సవాలు, శోభాయాత్ర మరియు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రజలందరి సహకారంతో నిర్మల్ జిల్లాలో శాంతి, సోదరభావం మరియు పరస్పర గౌరవంతో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSతో పాటు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, ప్రవీణ్, సమ్మయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ముస్లిం మత పెద్దలతో నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సమావేశం గణపతి శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి నిర్మల్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో మరియు సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ప్రజల మధ్య ఉన్న సోదరభావం, పరస్పర సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. ముస్లిం మత పెద్దలు తమ చిన్ననాటి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు. గతంలో గణేష్ ఉత్సవాల సమయంలో హిందూ సోదరులతో కలిసి పాల్గొన్న సందర్భాలను గుర్తుచేసుకుంటూ, నిర్మల్లో ప్రజల మధ్య ఉన్న స్నేహభావం, సోదరభావం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు, తమకు ఉన్న సూచనలు మరియు సమస్యలను మత పెద్దలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వారి సూచనలు, అభ్యర్థనలను జిల్లా ఎస్పీ సానుకూలంగా విని, ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసు శాఖ అందుబాటులో ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ తనకు సమానమేనని, ఎవరికైనా ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే తనను సంప్రదించవచ్చని, వారి సమస్యలను విని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఉత్సవాలు, శోభాయాత్ర మరియు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రజలందరి సహకారంతో నిర్మల్ జిల్లాలో శాంతి, సోదరభావం మరియు పరస్పర గౌరవంతో గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPSతో పాటు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు కృష్ణ, ప్రవీణ్, సమ్మయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- శ్రీగిరి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామికి పాల కావడి సమర్పించిన భక్తులు.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, పాల కావడి సేవ, పల్లకి సేవ, హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నయ్య గురుస్వామి మాట్లాడుతూ.. పాల కావడి స్వామివారికి సమర్పించడంతో ఆరోగ్యం బాగుంటుందని అదేవిధంగా వివాహలు, సంతానం లేని వారికి వారి కోరికలు నెరవేరుతాయని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.1
- నిర్మల్ జిల్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా: *విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బందికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటల మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని తరగతులకు సంబంధించిన సిలబస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం వారిని సిద్ధం చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, రోజువారిగా అందిస్తున్న భోజనం, వసతి, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి పలు లెక్కలను బోర్డుపై విద్యార్థులతో చేయించి, లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, పెన్నులను బహుమతులుగా ఇచ్చారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. ఏ సబ్జెక్టులో అయినా ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమీపంలో నిర్మాణం చివరి దశకు చేరుకున్న పాఠశాల భవంతిని కలెక్టర్ పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి భవనాన్ని వినియోగానికి తేవాలని తెలిపారు. ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.2
- భైంసా : ఘనంగా ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయకుల నిమజ్జనం... నిర్మల్ జిల్లా భైంసాలో సోమవారం ఇళ్లలో ప్రతిష్టించుకున్న వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు.తమ ఇళ్లలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించుకున్న భక్తులు మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో రోజు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భైంసాలోని స్థానిక గడ్డెన్న వాగు ప్రాజెక్టులో భక్తులు తమ తమ ఇంట్లో నుండి వినాయక ప్రతిమలను తీసుకోని గణపతి బప్పా మోరియా అంటూ జలాశయం వద్దకు తీసుకవెళ్లి అక్కడ ఆ గణేశునికి హారతులు నిర్వహించి నిమజ్జనం చేశారు.దీంతో గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ వద్ద సందడి నెలకొంది.1
- నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్.... బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.1
- సీసీఐపై ఎమ్మెల్యే,ఎంపీ స్పందించాలి : టీఏజిఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ ఆదిలాబాద్: సీసీఐ సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. పరిశ్రమ పునరుద్ధరణపై ఎమ్మెల్యే, ఎంపీ వెంటనే స్పందించి అసెంబ్లీ, పార్లమెంట్లో చర్చించాలని కోరారు. సీసీఐ సాధన రిలే దీక్షలు మంగళవారం 38వ రోజుకు చేరగా TAGS జిల్లా కమిటీ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి ఆదిలాబాద్ అభివృద్ధికి చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో TAGS జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, కొట్నాక్ సక్కు, పెందూర్ గోవింద్, మెస్రం నగేష్, కుంర దివంజి, కుంరం భీంరావు తదితరులు పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 15 :– *పూజల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు – నకిలీ బాబా అరెస్టు* *బ్లాక్ మ్యాజిక్ పేరుతో కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ భయపెట్టిన నిందితులు* *పత్రికా ప్రకటన* *పూజా సామగ్రి పేరుతో బాధితుడి నుంచి డబ్బులు వసూలు* *భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు* *ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి* ఆదిలాబాద్ మావాల పోలీస్ స్టేషన్ పరిధిలో పూజలు చేస్తే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మించి, బ్లాక్ మ్యాజిక్ తొలగించకపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోతారని భయపెట్టి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలను అరెస్టు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. *వివరాలలో* నిందితుడు సలీం సయ్యద్ పూజల ద్వారా కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానని బాధితుడిని నమ్మించి ఇంటి వద్ద పూజలు నిర్వహించాడు. అనంతరం బంగారం, వెండి కొనుగోలు చేయించి, మరిన్ని పూజా సామగ్రి అవసరమని చెప్పి యవత్మాల్కు తీసుకెళ్లాడు. అక్కడ భస్మం తదితర పూజా సామగ్రి పేరుతో రూ.81,600 చెల్లింపజేశాడు. అనంతరం మరో రూ.1.32 లక్షలు అవసరమని, పూజలు చేయకపోతే కుటుంబ సభ్యుడి ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని భయపెట్టాడు. నిందితుల మాటలపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సూచించారు. *నిందితుల వివరాలు:* A1) సలీం సయ్యద్ @ సలీం బషీర్ సయ్యద్, ( 40) s/o బషీర్, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర. A2) సయ్యద్ షమా, ( 46) w/o సలీం, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర. ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించవద్దని ఆదిలాబాద్ డిఎస్పి సూచించారు. ఈ కార్యక్రమంలో మావలా సీఐ బి డి ప్రేమ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- Post by Shaikshada1
- వాడవాడలా కొలువు తీరిన గణనాథులు.. భక్తుల ప్రత్యేక పూజలు.. నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. వాడవాడలా చిన్న పెద్ద అంతా కలిసి భారీ గణనాథులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మండపాలను విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. అనంతరం భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.1