*📰 సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి ఆరోపణలు* *📰 బాధితులు, మహిళలపై దురుసు వ్యవహారం.. వీడియోలు వైరల్* *📰 సీఐ తీరుపై విమర్శలు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్* *కోదాడ | ప్రజా న్యూస్ నెట్వర్క్ | ఆగష్టు 28* కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమాచారం లేకుండా డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజా న్యూస్ నెట్వర్క్ సమాచారం ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శివశంకర్ ఆందోళనకారుడు మందల ఉపేందర్పై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను కూడా తోసివేసినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. 30 ఏళ్లుగా డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి ఆరోపణలు* బాధితులు, మహిళలపై దురుసు వ్యవహారం.. వీడియోలు వైరల్* సీఐ తీరుపై విమర్శలు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్* *కోదాడ | ప్రజా న్యూస్ నెట్వర్క్ | ఆగష్టు 28* కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమాచారం లేకుండా డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజా న్యూస్ నెట్వర్క్ సమాచారం ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శివశంకర్ ఆందోళనకారుడు మందల ఉపేందర్పై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను కూడా తోసివేసినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. 30 ఏళ్లుగా డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
*📰 సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి ఆరోపణలు* *📰 బాధితులు, మహిళలపై దురుసు వ్యవహారం.. వీడియోలు వైరల్* *📰 సీఐ తీరుపై విమర్శలు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్* *కోదాడ | ప్రజా న్యూస్ నెట్వర్క్ | ఆగష్టు 28* కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమాచారం లేకుండా డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజా న్యూస్ నెట్వర్క్ సమాచారం ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శివశంకర్ ఆందోళనకారుడు మందల ఉపేందర్పై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను కూడా తోసివేసినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. 30 ఏళ్లుగా డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి ఆరోపణలు* బాధితులు, మహిళలపై దురుసు వ్యవహారం.. వీడియోలు వైరల్* సీఐ తీరుపై విమర్శలు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్* *కోదాడ | ప్రజా న్యూస్ నెట్వర్క్ | ఆగష్టు 28* కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమాచారం లేకుండా డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజా న్యూస్ నెట్వర్క్ సమాచారం ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శివశంకర్ ఆందోళనకారుడు మందల ఉపేందర్పై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను కూడా తోసివేసినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. 30 ఏళ్లుగా డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
- *ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా కౌశిక హరి - లత దంపతుల ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత ఆప్యాయంగా జరిగాయి. వారి ముద్దుల కూతురు తన చిన్నారి తమ్ముడికి, ప్రేమానురాగాలతో తన డాడీకి రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంది. కుటుంబ బంధాల తీపిని తెలిపే ఈ మధుర క్షణాలు మీకోసం!* రక్షాబంధన్ సందర్భంగా కౌశిక హరి - లత దంపతుల ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత ఆప్యాయంగా జరిగాయి. వారి ముద్దుల కూతురు తన చిన్నారి తమ్ముడికి, ప్రేమానురాగాలతో తన డాడీకి రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంది. కుటుంబ బంధాల తీపిని తెలిపే ఈ మధుర క్షణాలు మీకోసం!* 💖✨ 🏵️1
- వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.1
- ఆలేరులో బీసీల...........................................1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గురువారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.7,63,530, కార్ పార్కింగ్ రూ.3,50,000, VIP దర్శనాలతో రూ.2,26,950, బ్రేక్ దర్శనాలతో రూ.1,28,400, ప్రధాన బుకింగ్ రూ.1,24,350 ,వ్రతాలతో రూ.1,43,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.20,27,130 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.1
- అక్క కోసం 10అడుగుల రాఖీ చిత్రించి అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజు అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.3
- అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షణే SIR-2 లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బోనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో SIR-2 వార్డు సభ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నేలపై కూర్చొని సభ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై SIR-2 కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి అర్హుడి ఓటు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భువనగిరి సర్ కోఆర్డినేటర్ ఇ.వి. శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ , వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవెస్ చిస్తి PACS చైర్మన్ కొండల్ రెడ్డి ,RDO కృష్ణారెడ్డి గ, MRO జగన్ , పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ , కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు BLA లు పాల్గొన్నారు... ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన ఓటరు జాబితా – ప్రజాస్వామ్య పరిరక్షణే మనందరి లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.4
- వరదలో ఒంటరి చిన్నారి.. కాపాడేవారు లేక.. చూస్తూ వీడియోలు తీస్తున్న జనం! టిబెట్–నేపాల్ ప్రాంతంలో వరద ఉధృతిలో ఓ చిన్నారి ప్రాణాల కోసం ఒంటరిగా పోరాడుతున్న దృశ్యం కలచివేస్తోంది. చుట్టూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరద నీరు.. ఆ చిన్నారి మాత్రం ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలని పోరాడుతున్నాడు. అంతటి ప్రమాదంలోనూ.. చుట్టూ ఉన్నవారు వీడియోలు తీస్తున్నారు.. కానీ ఆ చిన్నారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదన్న దృశ్యం మరింత బాధ కలిగిస్తోంది. మొబైల్ కెమెరా ఆన్ చేయడానికి చేతులు ముందుకొచ్చాయి.. కానీ ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు అదే చేతులు ఎందుకు ముందుకు రాలేదు? విపత్తు సమయంలో మనిషిలోని మానవత్వమే అసలైన పరీక్ష. ఒక వీడియో మనకు జ్ఞాపకంగా మిగలొచ్చు.. కానీ ఒక ప్రాణాన్ని కాపాడితే.. అది ఒక జీవితాన్నే నిలబెడుతుంది... వరదలో ఒంటరి చిన్నారి.. కాపాడేవారు లేక.. చూస్తూ వీడియోలు తీస్తున్న జనం! టిబెట్–నేపాల్ ప్రాంతంలో వరద ఉధృతిలో ఓ చిన్నారి ప్రాణాల కోసం ఒంటరిగా పోరాడుతున్న దృశ్యం కలచివేస్తోంది. చుట్టూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరద నీరు.. ఆ చిన్నారి మాత్రం ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలని పోరాడుతున్నాడు. అంతటి ప్రమాదంలోనూ.. చుట్టూ ఉన్నవారు వీడియోలు తీస్తున్నారు.. కానీ ఆ చిన్నారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదన్న దృశ్యం మరింత బాధ కలిగిస్తోంది. మొబైల్ కెమెరా ఆన్ చేయడానికి చేతులు ముందుకొచ్చాయి.. కానీ ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు అదే చేతులు ఎందుకు ముందుకు రాలేదు? విపత్తు సమయంలో మనిషిలోని మానవత్వమే అసలైన పరీక్ష. ఒక వీడియో మనకు జ్ఞాపకంగా మిగలొచ్చు.. కానీ ఒక ప్రాణాన్ని కాపాడితే.. అది ఒక జీవితాన్నే నిలబెడుతుంది.1