ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ** ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు స్పష్టం చేశారు. సోమవారం దివాన్ చెరువు సచివాలయం-1 లో దివాన్ చెరువు, శ్రీరాంపురం, రఘునాథపురం, రూపనగర్ గ్రామాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలపై అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామాల్లో పారిశుధ్యంపై రాజీ పడకూడదని, చెత్త తరలింపులో జాప్యం జరగకుండా దివాన్ చెరువు పంచాయతీకి అదనంగా ట్రాక్టర్లను సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పాడైన బోర్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట కొత్త బోర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాత్రి వేళల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అన్ని వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, ప్రజల చెంతకే పాలనను తీసుకువెళ్లేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ భరోసా ఇచ్చారుఈ సమీక్షా సమావేశంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ** ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు స్పష్టం చేశారు. సోమవారం దివాన్ చెరువు సచివాలయం-1 లో దివాన్ చెరువు, శ్రీరాంపురం, రఘునాథపురం, రూపనగర్ గ్రామాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలపై అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామాల్లో పారిశుధ్యంపై రాజీ పడకూడదని, చెత్త తరలింపులో జాప్యం జరగకుండా దివాన్ చెరువు పంచాయతీకి అదనంగా ట్రాక్టర్లను సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పాడైన బోర్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట కొత్త బోర్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాత్రి వేళల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అన్ని వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, ప్రజల చెంతకే పాలనను తీసుకువెళ్లేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ భరోసా ఇచ్చారుఈ సమీక్షా సమావేశంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లలో ఆర్సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.1
- పల్నాడు జిల్లా :- నరసరావుపేటలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కంచర్ల సుజాత అనే మహిళ... నరసరావుపేట. సమైక్య లీడర్ మల్లెల అనిల నాకు తెలియకుండా నా పేరు మీద నాలుగు దొంగ డ్వాక్రా గ్రూపులు చేసి 10లక్షలు నగదు తీసుకుందని బాధితురాలు సుజాత ఆరోపణ... బ్యాంకు వాళ్లు నోటీసులు ఇవ్వగా నాకు నా పేరు మీద లోను ఉందని నాకు విషయం తెలిసింది... సమైక్య లీడర్ అనిల అని నేను తీసుకున్న లోను నేను క్లియర్ చేస్తాను అంటూ రెండు సంవత్సరాలు నుంచి కాలం గడుపుకుంటూ వచ్చిందని బాధితురాలు సుజాత ఆవేదన... ఇప్పుడు లీడర్ అనిల ని లోను కట్టమని అడిగితే నన్ను ఎలా పడితే అలా అసభ్య పదజాలతో మాట్లాడుతుందని సుజాత ఆరోపణ... సమైక్య లీడర్ అనిల మీద తగు చర్యలు తీసుకొని,నాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కృష్ణారావుని వేడుకున్న బాధితురాలు సుజాత.1
- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎర్రవరం జలపాతం ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడికి చేరుకుంటున్న ప్రజలు, సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నారు.1
- ఖమ్మం లో మైనర్ బాలికపైన అత్యాచారానికి పాల్పడిన బండి సాయి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి : ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ1
- గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించడంతో పాటు, నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ చేసిన ఈ పనికి ఫిర్యాదుదారులు ఆయనను మెచ్చుకుంటున్నారు.1
- అమరేశ్వరాలయంలో రుద్ర హోమం నిర్వహించిన ఆంజనేయస్వామి భక్తులు పంచారామ క్షేత్రమైన బాల చాముండికా సమేత అమరేశ్వరంలో ఈరోజు ఉదయం అత్యంత ఘనంగా ఆలయ అర్చకులుమహా రుద్ర హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భక్తులు భక్తి పూజల నిర్వహించారు తదనంతరం ఆలయ సహాయకమిషనర్ కే రేఖ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూశారు తదనంతరం కేంద్ర ప్రసాదాలు పెంచిపెట్టారు1
- Palnadu జిల్లాలోని సత్తెనపల్లిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు, ఇద్దరు బాల నేరస్తులను అరెస్ట్ చేసి, రూ.1.33 లక్షల విలువైన బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఈ నేరస్థులను పట్టుకున్నారు.1
- ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు1
- గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ విజ్ఞాపనలను నేరుగా కలెక్టర్కు అందజేసి, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు.1