logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సీఎంఈ విజయవంతం – వైద్యుల సహకారానికి ఐఎంఏ కృతజ్ఞతలు తిరుపతి, మార్చి 29: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ వారు నిర్వహించిన సీఎంఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తైన సందర్భంగా పాల్గొన్న వైద్యులందరికీ ఐఎంఏ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి తిరుపతి నగరంలోని వైద్యులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయడం ఆనందదాయకమని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి తెలిపారు. కోశాధికారి డాక్టర్ పి. రెడ్డప్ప కూడా వైద్యుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.వైద్య రంగ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవడం, ప్రభుత్వం–వైద్యుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అలాగే వైద్య సేవల అభివృద్ధి, నాణ్యమైన సేవల అందింపు, వైద్య వృత్తిలోని సవాళ్లు–అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరి రావు, డాక్టర్ సునంద కుమార్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినందుకు ఐఎంఏ అధ్యక్షుడు ఆర్ ఆర్ రెడ్డిని కోశాధికారీ డాక్టర్ రెడ్డప్పను అభినందించారు.

11 hrs ago
user_RAVI KUMAR
RAVI KUMAR
Tirupati (Rural), Andhra Pradesh•
11 hrs ago
0712c998-0d8c-419b-b89f-96beb6d082c6

సీఎంఈ విజయవంతం – వైద్యుల సహకారానికి ఐఎంఏ కృతజ్ఞతలు తిరుపతి, మార్చి 29: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్ వారు నిర్వహించిన సీఎంఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తైన సందర్భంగా పాల్గొన్న వైద్యులందరికీ ఐఎంఏ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి తిరుపతి నగరంలోని వైద్యులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయడం ఆనందదాయకమని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఆర్. రెడ్డి తెలిపారు. కోశాధికారి డాక్టర్ పి. రెడ్డప్ప కూడా వైద్యుల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.వైద్య రంగ అభివృద్ధి,

6c73f83f-5a51-425f-915f-57ba549a720d

ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవడం, ప్రభుత్వం–వైద్యుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అలాగే వైద్య సేవల అభివృద్ధి, నాణ్యమైన సేవల అందింపు, వైద్య వృత్తిలోని సవాళ్లు–అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరి రావు, డాక్టర్ సునంద కుమార్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినందుకు ఐఎంఏ అధ్యక్షుడు ఆర్ ఆర్ రెడ్డిని కోశాధికారీ డాక్టర్ రెడ్డప్పను అభినందించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • నిత్య చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ నెల్లూరులో గొప్ప ప్రారంభం నెల్లూరు నగరం లోని దర్గా మిట్ట సమీపంలో గల రాజరాజేశ్వరి దేవస్థానం కళ్యాణ మండపం నందు నిత్య చేనేత హస్త కళా మేళా ప్రదర్శన అమ్మ కాల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు. చేనేత హస్త కళా మేల నందు చేనేత వస్త్రములు ముత్యాల హారాలు పోచంపల్లి బెడ్ షీట్స్ కలంకారి ప్రెస్ మెటీరియల్స్ శారీస్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేత వస్త్రాలు వరంగల్ టవల్స్ లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు గద్వాల్ చీరలు జైపూర్ టాప్స్ లెగ్గిన్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ హైదరాబాద్ మంచి ముత్యాలు లెదర్ బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ డ్రై ఫ్రూట్ తినుబండారాలు జైపూర్ బ్యాంగిల్స్ తదితర ఐటమ్స్ స్టాల్స్ ను ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అదే క్రమంలో ప్రత్యేక డిస్కౌంట్ లో కలవని మార్చి 23వ తారీకు నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ప్రవేశ రుసుము పార్కింగ్ రుసుము ఉండదని నిర్వాహకులు నిత్య మరియు శ్రీను మీడియాతో తెలియజేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.
    3
    నిత్య చేనేత హస్తకళ  ఎగ్జిబిషన్ నెల్లూరులో గొప్ప ప్రారంభం
నెల్లూరు నగరం లోని  దర్గా మిట్ట సమీపంలో గల రాజరాజేశ్వరి దేవస్థానం కళ్యాణ మండపం నందు నిత్య చేనేత హస్త కళా మేళా ప్రదర్శన అమ్మ కాల ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు.  చేనేత హస్త కళా మేల నందు చేనేత వస్త్రములు ముత్యాల హారాలు పోచంపల్లి బెడ్ షీట్స్ కలంకారి ప్రెస్ మెటీరియల్స్ శారీస్ ఖాదీ వస్త్రములు మంగళగిరి చేనేత వస్త్రాలు వరంగల్ టవల్స్ లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు గద్వాల్ చీరలు జైపూర్ టాప్స్ లెగ్గిన్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ హైదరాబాద్ మంచి ముత్యాలు లెదర్ బ్యాగ్స్ జ్యూట్ బ్యాగ్స్ డ్రై ఫ్రూట్ తినుబండారాలు జైపూర్ బ్యాంగిల్స్ తదితర ఐటమ్స్ స్టాల్స్ ను ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అదే క్రమంలో ప్రత్యేక డిస్కౌంట్ లో కలవని మార్చి 23వ తారీకు నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు ఉదయం 10 నుండి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి ప్రవేశ రుసుము పార్కింగ్ రుసుము ఉండదని నిర్వాహకులు నిత్య  మరియు శ్రీను మీడియాతో తెలియజేయడం జరిగింది. కావున ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేర్కొన్నారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    1
    బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు.
కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది  బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు.
జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్.
2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543).
3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు.
4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి,
అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి,  జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్  అభినిందించారు.
పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • *జాతీయ రహదారి 40(కర్నూల్ - కడప) రోడ్డు లో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి మనిషి చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు* *మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ వేసి కోర్టు ముందు హాజరు పరచడం అయినది* ముద్దాయి పేరు: షేక్ మస్తాన్, వయసు: 58 సం’’రాలు తండ్రి: లేట్ మౌలాలి, వృత్తి: కూలి, కులం: ముస్లిం, D.No.01/15, అద్దంకి రోడ్డు, St కాలనీ, దర్శి టౌన్ & మండలం, ప్రకాశం జిల్లా. నేరము జరిగిన తేది సమయము మరియు స్థలము: 25.03.2026 వ తేదీన మద్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో కడప జిల్లా, మైదుకూరు టౌన్, ప్రొద్దుటూరు రోడ్డులో జాతీయ రహదారి- 40 (కర్నూల్ - కడప రోడ్డు)లో నుండి సర్వీసు రోడ్డు కలిసే ప్రదేశం అరెస్ట్ జరిగిన తేది మరియు సమయము: On 30.03.2026 at 11.30 AM కడప - కర్నూల్ రోడ్డులోని శ్రీనగరము గ్రామము దగ్గర. Seizure:- AP39 VE 0499 పాల ట్యాంకర్. Brief facts of the case: పైన తెలిపిన ముద్దాయి AP 39 VE 0499 పాల ట్యాంకర్ లో ధర్మవరము నుండి మైదుకూరు లోని అమృత మిల్క్ డైరీకి పాలు తోలుతూ ఉన్న క్రమములో 25.03.2026 వ తేదిన పాలు అమృత మిల్క్ డైరి నందు దించి మరలా ధర్మవరానికి వెళ్తున్న క్రమములో సుమారు 02.30 PM గంటల సమయములో పైన తెలిపిన ముద్దాయి, పైన తెలిపిన స్థలం వద్దకు పాల ట్యాంకర్ ను నడుపుతూ ఆపోసిట్/ రాంగు రోడ్డులో వెళితే ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఆపోసిట్/ రాంగు రోడ్డులో ట్యాంకర్ ను నిర్లక్షంగా నడిపి మోటర్ సైకిల్ పైన వస్తున్న వారికి తగిలించి దువ్వూరు కు చెందిన భాను ప్రకాష్ చనిపోడానికి, గంగా ప్రసాద్ గాయపడటానికి కారణము అయినాడు కాబట్టి అతనిని మైదుకూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. రమణారెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడమైనది. జాతీయ రహదారి మరియు ఇతర రోడ్డులలో వ్యతిరేక దిశలో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అయితే వారిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ను పెట్టి, అరెస్టు చేసి, ప్రమాదాలకు కారణం అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కె.రమణా రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మైదుకూరు అర్బన్ పీఎస్.
    1
    *జాతీయ రహదారి 40(కర్నూల్ - కడప)  రోడ్డు లో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి మనిషి చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు*
*మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ వేసి కోర్టు ముందు హాజరు పరచడం అయినది*
ముద్దాయి పేరు: 
షేక్ మస్తాన్, వయసు: 58 సం’’రాలు తండ్రి: లేట్ మౌలాలి, వృత్తి: కూలి, కులం: ముస్లిం, D.No.01/15, అద్దంకి రోడ్డు, St కాలనీ, దర్శి టౌన్ & మండలం, ప్రకాశం జిల్లా.
నేరము జరిగిన తేది సమయము మరియు స్థలము: 
25.03.2026 వ తేదీన మద్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో  కడప జిల్లా, మైదుకూరు టౌన్, ప్రొద్దుటూరు రోడ్డులో  జాతీయ రహదారి- 40 (కర్నూల్ -  కడప రోడ్డు)లో నుండి సర్వీసు రోడ్డు కలిసే ప్రదేశం
అరెస్ట్ జరిగిన తేది మరియు సమయము:
On 30.03.2026 at 11.30 AM కడప - కర్నూల్ రోడ్డులోని శ్రీనగరము గ్రామము దగ్గర.
Seizure:- 
AP39 VE 0499 పాల ట్యాంకర్.
Brief facts of the case: పైన తెలిపిన ముద్దాయి AP 39 VE 0499 పాల ట్యాంకర్ లో ధర్మవరము నుండి మైదుకూరు లోని అమృత మిల్క్ డైరీకి పాలు తోలుతూ ఉన్న క్రమములో 25.03.2026 వ తేదిన పాలు అమృత మిల్క్ డైరి నందు దించి మరలా ధర్మవరానికి వెళ్తున్న క్రమములో సుమారు 02.30 PM గంటల సమయములో పైన తెలిపిన ముద్దాయి, పైన తెలిపిన స్థలం వద్దకు పాల ట్యాంకర్ ను నడుపుతూ ఆపోసిట్/ రాంగు రోడ్డులో వెళితే ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఆపోసిట్/ రాంగు రోడ్డులో ట్యాంకర్ ను నిర్లక్షంగా నడిపి మోటర్ సైకిల్ పైన వస్తున్న వారికి తగిలించి దువ్వూరు కు చెందిన భాను ప్రకాష్ చనిపోడానికి, గంగా ప్రసాద్ గాయపడటానికి  కారణము అయినాడు కాబట్టి అతనిని మైదుకూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. రమణారెడ్డి  అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడమైనది.
జాతీయ రహదారి మరియు ఇతర రోడ్డులలో వ్యతిరేక దిశలో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అయితే  వారిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ను పెట్టి,  అరెస్టు చేసి, ప్రమాదాలకు కారణం అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది.
కె.రమణా రెడ్డి 
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 
మైదుకూరు అర్బన్ పీఎస్.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలo కటారుపల్లి గ్రామంలో యోగువేమన ఉత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం చాందిని బండ్లు పానక పన్నీరు తోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యోగివేమన భక్తాదులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి తెలిపారు.
    1
    సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలo కటారుపల్లి గ్రామంలో యోగువేమన ఉత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం చాందిని బండ్లు పానక పన్నీరు తోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యోగివేమన భక్తాదులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి తెలిపారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    4 hrs ago
  • వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు.. అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    1
    వచ్చేనెల 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల స రేష్ పేర్కొన్నారు. ఉదయగిరిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేసి లబ్దిదారులతో ముచ్చటిస్తారన్నారు..
అనంతరం వింజమూరు చెరువుకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా ప్రజావేదిక కార్యక్రమాన్ని చేరుకొంటారన్నారు. ప్రజావేదిక అనంతరం భోజనం తర్వాత కార్యకర్తలతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పర్యటను విజయవంతానికి నియోజకవర్గంలో 13 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 20 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చడంతోపాటు ఉ పాధి అవకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని కోరనున్నట్లు తెలిపారు. ఆయన పర్యటనతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం హామీ ఇవ్వన ఉన్నట్లు తెలిపారు. కావున నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని సీఎం పర్యటను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    user_Shaik
    Shaik
    ఉదయగిరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు ప్రిన్సిపాల్ దాష్టికం విద్యార్థినులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్ నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎక్కువ అన్నం ఎక్కువ కూరలు పెట్టలేమని.. విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతని బెదిరింపులు విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ ను డిస్మిస్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
    1
    అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు ప్రిన్సిపాల్ దాష్టికం
విద్యార్థినులను మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్
నల్గొండ జిల్లా దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినిలు అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టమన్నందుకు రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పైశాచికంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్
ఎక్కువ అన్నం ఎక్కువ కూరలు పెట్టలేమని.. విద్యార్థులు ఎవరైనా అన్నం సరిపోలేదు మళ్లీ పెట్టండి అంటే అందరికీ ఇదే గతని బెదిరింపులు
విద్యార్థినులను చిత్రహింసలకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ ను డిస్మిస్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బద్వేలు :నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తొలుత స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రితేష్ రెడ్డి పార్టీ పసుపు జెండాను గర్వంగా ఆవిష్కరించారు. అనంతరం బద్వేల్-నెల్లూరు రోడ్డులోని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను రితేష్ రెడ్డి మరియు విజయమ్మ ఘనంగా సన్మానించారు. 44 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ, సీనియర్ నాయకుల సేవలను తమ కుటుంబం ఎప్పటికీ మరువదని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రితేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా భావోద్వేగంగా పేర్కొన్నారు. చివరగా, విచ్చేసిన సీనియర్ నాయకులందరితో కలిసి తమ నివాసంలో మధ్యాహ్న భోజనం చేసి ఈ వేడుకలను దిగ్విజయంగా ముగించారు.
    2
    బద్వేలు :నియోజకవర్గ ఇన్‌చార్జ్  కే. రితేష్ రెడ్డి  ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తొలుత స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ  మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రితేష్ రెడ్డి  పార్టీ పసుపు జెండాను గర్వంగా ఆవిష్కరించారు. 
అనంతరం బద్వేల్-నెల్లూరు రోడ్డులోని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను రితేష్ రెడ్డి మరియు విజయమ్మ  ఘనంగా సన్మానించారు. 
44 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ, సీనియర్ నాయకుల సేవలను తమ కుటుంబం ఎప్పటికీ మరువదని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రితేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా భావోద్వేగంగా పేర్కొన్నారు. చివరగా, విచ్చేసిన సీనియర్ నాయకులందరితో కలిసి తమ నివాసంలో మధ్యాహ్న భోజనం చేసి ఈ వేడుకలను దిగ్విజయంగా ముగించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.