దసరా కు పెద్దపల్లి బస్ డిపో ప్రారంభం... పెద్దపల్లి -చొప్పదండి ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు సౌకర్యం ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగా వచ్చే దసరా నాటికి పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభం అవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటలో పెద్దపల్లి నుండి చొప్పదండి వరకు వెళ్ళే నూతన బస్సును విజయ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి బస్సులో జూలపల్లి వరకు ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథక కింద ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని తద్వారా ఆర్టీసీ ఆదరణ పెరిగిందని తెలిపారు. వచ్చే దసరా వరకు పెద్దపల్లి ఆర్టీసీ డిపో ప్రారంభించడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏనాడు ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఆర్టీసీ సేవలను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయనున్నట్లు చెప్పారు. కొత్త బస్ డిపో వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, రాజధాని హైదరాబాద్ కు, పెద్దపల్లి లోని గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానం చేయిస్తానని చెప్పారు. వర్షాలు కురవడం వల్ల రైతులకు సమృద్ధిగా పంటలు పండుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దసరా కు పెద్దపల్లి బస్ డిపో ప్రారంభం... పెద్దపల్లి -చొప్పదండి ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలంగాణలోని ప్రతి గ్రామానికి ఆర్టీసి బస్సు సౌకర్యం ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగా వచ్చే దసరా నాటికి పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభం అవుతుందని
పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటలో పెద్దపల్లి నుండి చొప్పదండి వరకు వెళ్ళే నూతన బస్సును విజయ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి బస్సులో జూలపల్లి వరకు ప్రయాణించారు. కాంగ్రెస్
ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథక కింద ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని తద్వారా ఆర్టీసీ ఆదరణ పెరిగిందని తెలిపారు. వచ్చే దసరా వరకు పెద్దపల్లి ఆర్టీసీ డిపో ప్రారంభించడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏనాడు ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఆర్టీసీ సేవలను
గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేయనున్నట్లు చెప్పారు. కొత్త బస్ డిపో వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, రాజధాని హైదరాబాద్ కు, పెద్దపల్లి లోని గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానం చేయిస్తానని చెప్పారు. వర్షాలు కురవడం వల్ల రైతులకు సమృద్ధిగా పంటలు పండుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
- హుస్నాబాద్ లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఆందోళన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పూర్తి స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నిరుద్యోగ యువత వాపోయారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ లో కట్టించిన నూతన గ్రంథాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్ లో శాశ్వత గ్రంథాలయం అత్య అవసరం ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.2
- ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.1
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటనికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ యస్ పార్టీ నాయకులు *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- కరీంనగర్ జిల్లాలో ఆలయాల్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు ఎంఏ హర్షద్ అరెస్ట్...ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా ఛేజింగ్ చేసి పట్టుకున్న రామడుగు పోలీసులు కరీంనగర్ జిల్లాలో పలు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడ్డ నిందితుడిని రామడుగు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి మూడు వెండి కిరీటాలు, 4 వెండి జంజీరాలు, 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, 9500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ రూరల్ ఏ సి పి కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ ఏసీపీ విజయ్ కుమార్ సమక్షంలో అరెస్టు అయిన నిందితుడిని చూపించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పోలాస కు చెందిన ఎం.ఏ. అర్షద్ ఖాన్ కరీంనగర్లో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పగలంతా కూలి పని చేస్తూ రాత్రిపూట ఆలయాలు, తాళం వేసిన ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. వెదిర గ్రామంలోని ఆలయంలో చోరీకి పాల్పడి పారిపోతుండగా పోలీసులు చేజింగ్ చేసి పట్టుకున్నారని తెలిపారు. ఏడాది కాలంలో నిందితుడు చొప్పదండి రామడుగు గంగాధర, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో 12 ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు చెప్పారు. చోరీ చేసిన సొత్తును కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో విక్రయించేవాడని కరీంనగర్ లో మల్లికార్జున జువెలరీ షాపులో విక్రయించిన వెండి కిరీటం, వెండి చంద్రవంక, 2.5 గ్రాముల జత బంగారు పుస్తెలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన షాపు యాజమానులపై సైతం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిసిపి చెప్పారు. చాకచక్యంగా వరుస చోరీలకు పాల్పడే నిందితుడిని పట్టుకున్న రామడుగు పోలీసులను అభినందిస్తూ క్యాష్ అవార్డు అందజేశారు.4