logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ రాజకీయం కేటీఆర్ రాకతో మారిందని, బోథ్ మండలంలోని అందుర్ గ్రామ ఉప సర్పంచ్ శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన ఉప సర్పంచ్‌కు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పని ఖతమైందని, కేటీఆర్ రాకతో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని స్పష్టం చేశారు.

8 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter బోథ్, ఆదిలాబాద్, తెలంగాణ•
8 hrs ago
66285805-0277-42a8-ab9e-a25d99370b6a

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ రాజకీయం కేటీఆర్ రాకతో మారిందని, బోథ్ మండలంలోని అందుర్ గ్రామ ఉప సర్పంచ్ శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన ఉప సర్పంచ్‌కు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పని ఖతమైందని, కేటీఆర్ రాకతో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో, తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జులై 5వ తేదీన నిర్వహించనున్న "రాజ్యాధికార సమరభేరి" సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా నాయకుడు మహేష్ వర్మ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భీమారం మండల కేంద్రంలో టీఆర్పీ మండల నాయకుడు దెబ్బెట శంకర్ అధ్యక్షతన, తగరం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై, టీఆర్పీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ వర్మ మాట్లాడుతూ, అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే నినాదంతో, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో పార్టీ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. బహుజనుల బ్రతుకులు మారాలన్నా, వారికి రావాల్సిన వాటా దక్కాలన్నా అధికారంలోకి రావాలని, అప్పుడే ప్రతి ఒక్కరికీ వారి వాటా లభిస్తుందని పేర్కొన్నారు. జులై 5వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని, బహుజనుల ఐక్యతకు, సామాజిక తెలంగాణ నిర్మాణానికి ఆ రోజు పునాది పడుతుందని మహేష్ వర్మ ఉద్ఘాటించారు. ఇప్పటికే బహుజనులంతా ఒక్కటయ్యారని, ఇక అధికారం సాధించడమే మిగిలిందని ఆయన తెలిపారు. ఇతర పార్టీల జెండాలను పక్కన పెట్టి, ఆత్మగౌరవ పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను చేతపట్టాలని మహేష్ వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి వచ్చి మార్పుకు పునాది వేయాలని, యువత ద్వారానే నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరగా, జిల్లా నాయకుడు మహేష్ వర్మ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి మహమ్మద్ లతీఫ్, జిల్లా నాయకులు పడాల శివతేజ, బూర రవీందర్, బొంగోని విద్యాసాగర్, భీమిని రమేష్, ఆసంపెల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని మహేష్ వర్మ పునరుద్ఘాటించారు.
    1
    తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో, తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జులై 5వ తేదీన నిర్వహించనున్న "రాజ్యాధికార సమరభేరి" సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా నాయకుడు మహేష్ వర్మ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భీమారం మండల కేంద్రంలో టీఆర్పీ మండల నాయకుడు దెబ్బెట శంకర్ అధ్యక్షతన, తగరం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై, టీఆర్పీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహేష్ వర్మ మాట్లాడుతూ, అధికారం, ఆత్మగౌరవం, వాటా అనే నినాదంతో, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా తీన్మార్ మల్లన్న నాయకత్వంలో పార్టీ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. బహుజనుల బ్రతుకులు మారాలన్నా, వారికి రావాల్సిన వాటా దక్కాలన్నా అధికారంలోకి రావాలని, అప్పుడే ప్రతి ఒక్కరికీ వారి వాటా లభిస్తుందని పేర్కొన్నారు. జులై 5వ తేదీ చరిత్రలో నిలిచిపోతుందని, బహుజనుల ఐక్యతకు, సామాజిక తెలంగాణ నిర్మాణానికి ఆ రోజు పునాది పడుతుందని మహేష్ వర్మ ఉద్ఘాటించారు. ఇప్పటికే బహుజనులంతా ఒక్కటయ్యారని, ఇక అధికారం సాధించడమే మిగిలిందని ఆయన తెలిపారు.

ఇతర పార్టీల జెండాలను పక్కన పెట్టి, ఆత్మగౌరవ పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను చేతపట్టాలని మహేష్ వర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి వచ్చి మార్పుకు పునాది వేయాలని, యువత ద్వారానే నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్పీలో చేరగా, జిల్లా నాయకుడు మహేష్ వర్మ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి మహమ్మద్ లతీఫ్, జిల్లా నాయకులు పడాల శివతేజ, బూర రవీందర్, బొంగోని విద్యాసాగర్, భీమిని రమేష్, ఆసంపెల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణం తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే సాధ్యమని మహేష్ వర్మ పునరుద్ఘాటించారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter బోథ్, ఆదిలాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌లో జరిగిన పశ్చిమబెంగాల్ దివస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతులకు పీఎం-కిసాన్ ప్రయోజనాలు బదిలీ అయిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా, పశ్చిమ బెంగాల్‌లో పీఎం ఫసల్ బీమా యోజనను అమలులోకి తీసుకురావాలని, అలాగే రాష్ట్రాన్ని డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో చేర్చాలని ఆయన ప్రకటించారు.
    1
    పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్‌లో జరిగిన పశ్చిమబెంగాల్ దివస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతులకు పీఎం-కిసాన్ ప్రయోజనాలు బదిలీ అయిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా, పశ్చిమ బెంగాల్‌లో పీఎం ఫసల్ బీమా యోజనను అమలులోకి తీసుకురావాలని, అలాగే రాష్ట్రాన్ని డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో చేర్చాలని ఆయన ప్రకటించారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    7 hrs ago
  • బీజేపీ మండలాధ్యక్షుడు రాథోడ్ భిక్కు శనివారం నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే వాటన్నింటికీ రైతు భరోసా నిధులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు నిధులు ఇవ్వకుండా, త్వరలో విడుదల చేస్తామని తేదీలు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
    1
    బీజేపీ మండలాధ్యక్షుడు రాథోడ్ భిక్కు శనివారం నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే వాటన్నింటికీ రైతు భరోసా నిధులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు బంధు నిధులు ఇవ్వకుండా, త్వరలో విడుదల చేస్తామని తేదీలు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
    user_Maithreya
    Maithreya
    నార్నూర్, ఆదిలాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వానరాల సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణం, ప్రత్యేక అక్షరాభ్యాస మండపం, క్యూ లైన్లలో వానరాలు యథేచ్ఛగా తిరుగుతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇవి భక్తుల చేతుల్లోని ప్రసాదాలతో పాటు ఇతర వస్తువులను లాక్కెళ్తున్నాయి, దీంతో భక్తులు నిత్యం భయాందోళనతో గడుపుతున్నారు. వానరాల స్వైర విహారం వల్ల ముఖ్యంగా చిన్నారులు, మహిళా భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలోనూ వానరాల దాడిలో పలువురు భక్తులు, చిన్నారులు ఆసుపత్రి పాలైన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భక్తులు ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ప్రాణాలు పోయేవరకు స్పందించరా?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆలయ అధికారులు వెంటనే స్పందించి, వానరాలను బోన్లలో బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని భక్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
    1
    నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వానరాల సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణం, ప్రత్యేక అక్షరాభ్యాస మండపం, క్యూ లైన్లలో వానరాలు యథేచ్ఛగా తిరుగుతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇవి భక్తుల చేతుల్లోని ప్రసాదాలతో పాటు ఇతర వస్తువులను లాక్కెళ్తున్నాయి, దీంతో భక్తులు నిత్యం భయాందోళనతో గడుపుతున్నారు.

వానరాల స్వైర విహారం వల్ల ముఖ్యంగా చిన్నారులు, మహిళా భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలోనూ వానరాల దాడిలో పలువురు భక్తులు, చిన్నారులు ఆసుపత్రి పాలైన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, భక్తులు ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ప్రాణాలు పోయేవరకు స్పందించరా?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆలయ అధికారులు వెంటనే స్పందించి, వానరాలను బోన్లలో బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించాలని భక్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
  • జన్నారం మండలంలోని తపాలాపూర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పరిస్థితిని పట్టించుకోకపోవడంతో స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తామే స్వచ్ఛందంగా రంగంలోకి దిగి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం ద్వారా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు, ప్రయాణం నరకప్రాయంగా మారి నడుములు విరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే గర్భిణులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, "గుంతల రోడ్డుపై ప్రయాణించడం వల్ల గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఆటోలు ఎక్కి దిగే లోపే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది" అని తమ ఆవేదనను తెలియజేశారు. రోడ్డు పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా మారుతుండటంతో పాటు, గుంతల వల్ల ఆటోలు పాడవుతుండటంతో ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారుల కోసం ఎదురుచూడడం వ్యర్థమని భావించిన డ్రైవర్లు, తమ సొంత డబ్బులతో ట్రాక్టర్ల ద్వారా 'మొరం' తెప్పించి, రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పెద్ద పెద్ద గుంతలను స్వయంగా పూడ్చి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. అయితే, మొరంతో గుంతలు పూడ్చడం కేవలం తాత్కాలికమేనని, వర్షం పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, కేవలం తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టకుండా, తపాలాపూర్ రోడ్డుకు శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
    1
    జన్నారం మండలంలోని తపాలాపూర్ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పరిస్థితిని పట్టించుకోకపోవడంతో స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులు తీవ్ర అసంతృప్తి చెందారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా, తామే స్వచ్ఛందంగా రంగంలోకి దిగి రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం ద్వారా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.

ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు, ప్రయాణం నరకప్రాయంగా మారి నడుములు విరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే గర్భిణులు ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, "గుంతల రోడ్డుపై ప్రయాణించడం వల్ల గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఆటోలు ఎక్కి దిగే లోపే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోంది" అని తమ ఆవేదనను తెలియజేశారు. రోడ్డు పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా మారుతుండటంతో పాటు, గుంతల వల్ల ఆటోలు పాడవుతుండటంతో ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులందరూ ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

అధికారుల కోసం ఎదురుచూడడం వ్యర్థమని భావించిన డ్రైవర్లు, తమ సొంత డబ్బులతో ట్రాక్టర్ల ద్వారా 'మొరం' తెప్పించి, రోడ్డుపై ప్రమాదకరంగా మారిన పెద్ద పెద్ద గుంతలను స్వయంగా పూడ్చి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. అయితే, మొరంతో గుంతలు పూడ్చడం కేవలం తాత్కాలికమేనని, వర్షం పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, కేవలం తాత్కాలిక ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టకుండా, తపాలాపూర్ రోడ్డుకు శాశ్వత ప్రాతిపదికన పూర్తిగా మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • సిరికొండ మండలంలో జూన్ 20న ప్రత్యేక విస్తృత సవరణ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా, తహసీల్దార్ ఆధ్వర్యంలో రైతు వేదికలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధులు, బాధ్యతలపై అధికారులకు ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ ఈ సందర్భంగా సూచించారు.
    1
    సిరికొండ మండలంలో జూన్ 20న ప్రత్యేక విస్తృత సవరణ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా, తహసీల్దార్ ఆధ్వర్యంలో రైతు వేదికలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధులు, బాధ్యతలపై అధికారులకు ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ ఈ సందర్భంగా సూచించారు.
    user_RC REDDY
    RC REDDY
    Nizamabad Rural, Telangana•
    18 hrs ago
  • రిపబ్లిక్ భారతదేశ దౌత్యం, వాణిజ్యం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసి, ప్రపంచ వేదికపై భారతదేశ పాత్రను పటిష్టం చేసింది. ఈ పరిణామాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫ్రాన్స్ మరియు స్లోవాక్‌లో చేసిన పర్యటనలోని ముఖ్యమైన ముఖ్యాంశాలు ఉన్నాయి.
    1
    రిపబ్లిక్ భారతదేశ దౌత్యం, వాణిజ్యం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేసి, ప్రపంచ వేదికపై భారతదేశ పాత్రను పటిష్టం చేసింది. ఈ పరిణామాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫ్రాన్స్ మరియు స్లోవాక్‌లో చేసిన పర్యటనలోని ముఖ్యమైన ముఖ్యాంశాలు ఉన్నాయి.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    7 hrs ago
  • నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో BDSF విద్యార్థి సంఘంలో పలువురు విద్యార్థులు చేరారు. మహనీయుల ఆశయాల సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఈ విద్యార్థులు, BDSF ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చక్కటి ఆనంద్ కుమార్ సమక్షంలో సంఘంలో ప్రవేశించారు.
    1
    నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో BDSF విద్యార్థి సంఘంలో పలువురు విద్యార్థులు చేరారు. మహనీయుల ఆశయాల సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఈ విద్యార్థులు, BDSF ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ చక్కటి ఆనంద్ కుమార్ సమక్షంలో సంఘంలో ప్రవేశించారు.
    user_చక్కటి ఆనంద్ కుమార్
    చక్కటి ఆనంద్ కుమార్
    భైంసా, నిర్మల్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.