logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భవిత కేంద్రాలను సందర్శించిన కలెక్టర్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న భవిత సెంటర్ ను సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.

7 hrs ago
user_Sri
Sri
Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
7 hrs ago

భవిత కేంద్రాలను సందర్శించిన కలెక్టర్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న భవిత సెంటర్ ను సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    1
    నగరంలో సాధన సంస్థ నెల రోజులపాటు నిర్వహించనున్న బాల్యవివాహల నిరోధక ప్రచార రథాన్ని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ  జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలల శరీర ఆకృతి పెరిగే వయసులో, మేధస్సు కూడా పెరుగుతుందన్నారు. పెరిగే క్రమంలో విరిగే పనులు చేయరాదని, ఎదగనిద్దామని ఆమె పేర్కొన్నారు. బాలల భవిష్యత్ భద్రతకు బాల్య వివాహలు గొడ్డలి పెట్టులాంటివని తెలిపారు. బాల్యవివాహలు చేసిన వారు, ప్రోత్సహించిన వారు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులేనని అన్నారు. బాల్యవివాహలను చట్టం ద్వారా నిషేదించడం జరిగిందని జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ అన్నారు. బాలల చదువుకే ప్రాధాన్యతనివ్వాలని, చదువు వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని తెలిపారు. ఎదిగి ఎదగని వయసులో బాల్య వివాహలు చేయడం అంటే చిగురించే మొక్కలను చిదిమివేయడమేనని ఆమె అన్నారు.
చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ సాధన సంస్థ ఒక మంచి ప్రచారశైలికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పద్మ, చైతన్య, సాధన, సిబ్బంది మధుసూదన్, వినీష్, నిరీక్ష,  జిల్లా న్యాయసేవ అధికార సంస్థ పర్యవేక్షకురాలు శైలజ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • బాన్సువాడ లో పట్ట పగలే భారీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే తాడ్కోల్ ప్రధాన రహదారిపై నిలిపిన కారు నుంచి పట్టపగలే 8 లక్షల రూపాయల నగదుదొంగతనం జరగడం బాన్సువాడ లో కలకలం రేపింది. మొదటినుంచి మన దినపత్రిక బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ వరుస కథనాలు ప్రచరించినప్పటికీ, ఇటు పోలీస్ యంత్రాంగం, అటు వ్యాపారస్తులు స్పందించకపోవడం వల్ల బాన్సువాడ పోలీస్ డివిజన్ పరిధిలో దొంగతనాలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తాజాగా బాన్స్వాడ పట్టణంలోని తాడ్కోలు చౌరస్తా వద్ద నిలిపిన కారు నుంచి 8 లక్షల రూపాయలు దొంగలు అపహరించుకొని పోవడం బాన్సువాడ పట్టణ ప్రజల్ని భయం గుప్పెట్లోకి పంపించింది. ఇప్పటికే బిచ్కుంద పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో డోంగ్లి మండలం లింబురు గ్రామ శివారులో పొలం వద్ద గుర్తుతెలియని దొంగలు రెండు రోజుల క్రితం మూడు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి విలువైన రాగి తీగలు, నూనె ఎత్తుకొని వెళ్ళిపోయారు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార , పిట్లం మండలంలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి విలువైన రాగి తీగలను దొంగలించుకుని పోతున్నారు జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పగలగొట్టి విలువైన వస్తువులను దొంగలించుకుని పారిపోతున్నారు. బాన్స్వాడ పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ నుంచి తన బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారి అవసరాల కోసం తోటి బంధువు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు మంగళవారం బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలు డ్రా చేసుకొని, తాడ్ కోల్ చౌరస్తా వద్ద గల రిలయన్స్ సూపర్ మార్కెట్ కు సరుకులు కొనడానికి వెళ్లిన మాధవరావును గుర్తించిన దొంగలు, ఆయన కారులో దాచిన ఎనిమిది లక్షల రూపాయలు కారు అద్దాలు పగలగొట్టి పట్ట పగలే చోటికి పాల్పడ్డారు. ముఖ్యంగా బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడం వల్ల, నేరాలు, ఘోరాలు జరగడానికి కారణం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీగా వచ్చిన శ్వేత ముఖ్యంగా సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు, వ్యాపారస్తుల కు అవగాహన కల్పించి వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ శాఖ ద్వారా ముఖ్య కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. కానీ వాటిపై పోలీస్ శాఖ నిర్లక్ష్యపు నీడలు అల్ముకోవడంతో, సిసి కెమెరాలు పనిచేయక పోవడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దొంగతనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాన్సువాడ కల్కి చెరువు వద్ద గుర్తుతెలియని రెండు మహిళా మృతదేహాలు బయట పడ్డప్పటికీ, అవి ఎవరి అన్నది పోలీసులు చేదించలేకపోయారు, నిజం సాగర్ వద్ద 23 ఏళ్ల యువతి మృతదేహం బయటపడి మూడు నెలలు కావస్తున్నా ఆ యువతి ఎవరు అన్నది పోలీసులు చేదించలేకపోయారు. దీనివల్ల బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగతనాలు, ద్విచక్ర వాహనాలు దొంగలించడం, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు దొంగలు పాల్పడుతున్నారు. కానీ పోలీసులకు చిక్కకుండా దొంగలు పారిపోవడానికి కారణం సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడుకుల్ చౌరస్తాలో 8 లక్షల నగదును కారులో నుంచి దొంగలించి పోయిన దొంగలు ఎవరు? కారు అద్దాలు పగలకొట్టేవరకు ఎవరు? ఎవరు గమనించలేదా? కారు అద్దం బలమైన ఏదైనా ఆయుధంతో పలగొట్టి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చుట్టుపక్కల గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు, కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేస్తుండగా, మరికొన్ని చోట్ల పని చేయకపోవడంతో, పట్టపగలు కారులో నుంచి 8 లక్షల దొంగలించుకుని పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు చిక్కకపోవడంతో, మాధవరావు అనే రైతు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తన బంధువుకు చికిత్స ఖర్చులకోసం నుంచి బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులను సూపర్ మార్కెట్ నుంచి 15 నిమిషాల్లోనే బయటకు వచ్చేసరికి డబ్బులు మాయం కావడం పట్ల మాధవరావు వారిని రైతు కంటతడి పెడుతున్నారు. కారు అద్దాలు పగలగొట్టి భారీ నగదు చోరీకి పాల్పడ్డ దుండగులురు పట్టుకోలంటూ మాధవరావు అనే రైతు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బాన్స్వాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గల సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కారులో నుంచి నగదు చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకుంటామని పోలీసులు సీరియస్గా తీసుకొని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ లో మంగళవారం పట్టపగలు జరిగిన భారీ నగదు చోరీలో పాల్పడ్డ దుండగులు అంతరాష్ట్ర దొంగల ముఠాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పకడ్బందీగా బాన్స్వాడ డిఎస్పి విట్టల్ రెడ్డి దొంగలను పట్టుకోవడానికి మూడు బృందాలుగా ఏర్పడి గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
    1
    బాన్సువాడ లో పట్ట పగలే భారీ  
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎప్పుడూ రద్దీగా ఉండే తాడ్కోల్ ప్రధాన రహదారిపై నిలిపిన కారు నుంచి పట్టపగలే 8 లక్షల రూపాయల నగదుదొంగతనం జరగడం బాన్సువాడ లో కలకలం రేపింది. మొదటినుంచి మన దినపత్రిక బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ వరుస కథనాలు ప్రచరించినప్పటికీ, ఇటు పోలీస్ యంత్రాంగం, అటు వ్యాపారస్తులు స్పందించకపోవడం వల్ల బాన్సువాడ పోలీస్ డివిజన్ పరిధిలో దొంగతనాలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తాజాగా బాన్స్వాడ పట్టణంలోని తాడ్కోలు చౌరస్తా వద్ద నిలిపిన కారు నుంచి 8 లక్షల రూపాయలు దొంగలు అపహరించుకొని పోవడం బాన్సువాడ పట్టణ ప్రజల్ని భయం గుప్పెట్లోకి పంపించింది. ఇప్పటికే బిచ్కుంద పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో డోంగ్లి మండలం లింబురు గ్రామ శివారులో పొలం వద్ద గుర్తుతెలియని దొంగలు రెండు రోజుల క్రితం మూడు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి విలువైన రాగి తీగలు, నూనె ఎత్తుకొని వెళ్ళిపోయారు. మద్నూర్ మండలం పెద్ద ఎక్లార , పిట్లం మండలంలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి విలువైన రాగి తీగలను దొంగలించుకుని పోతున్నారు జిల్లాలో వరుసగా ట్రాన్స్ఫార్మర్ల పగలగొట్టి విలువైన వస్తువులను దొంగలించుకుని పారిపోతున్నారు. బాన్స్వాడ పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ నుంచి తన బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వారి అవసరాల కోసం తోటి బంధువు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన మాధవరావు మంగళవారం బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలు డ్రా చేసుకొని, తాడ్ కోల్ చౌరస్తా వద్ద గల రిలయన్స్ సూపర్ మార్కెట్ కు సరుకులు కొనడానికి వెళ్లిన మాధవరావును గుర్తించిన దొంగలు, ఆయన కారులో దాచిన ఎనిమిది లక్షల రూపాయలు కారు అద్దాలు పగలగొట్టి పట్ట పగలే చోటికి పాల్పడ్డారు. ముఖ్యంగా బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడం వల్ల, నేరాలు, ఘోరాలు జరగడానికి కారణం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీగా వచ్చిన శ్వేత ముఖ్యంగా సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు, వ్యాపారస్తుల కు అవగాహన కల్పించి వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరా ఏర్పాటు, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ శాఖ ద్వారా ముఖ్య కూడలిలో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. కానీ వాటిపై పోలీస్ శాఖ నిర్లక్ష్యపు నీడలు అల్ముకోవడంతో, సిసి కెమెరాలు పనిచేయక పోవడంతో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దొంగతనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాన్సువాడ కల్కి చెరువు వద్ద గుర్తుతెలియని రెండు మహిళా మృతదేహాలు బయట పడ్డప్పటికీ, అవి ఎవరి అన్నది పోలీసులు చేదించలేకపోయారు, నిజం సాగర్ వద్ద 23 ఏళ్ల యువతి మృతదేహం బయటపడి మూడు నెలలు కావస్తున్నా ఆ యువతి ఎవరు అన్నది పోలీసులు చేదించలేకపోయారు. దీనివల్ల బాన్స్వాడ పోలీస్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగతనాలు, ద్విచక్ర వాహనాలు దొంగలించడం, తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు దొంగలు పాల్పడుతున్నారు. కానీ పోలీసులకు చిక్కకుండా దొంగలు పారిపోవడానికి కారణం సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయకపోవడమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాడుకుల్ చౌరస్తాలో 8 లక్షల నగదును కారులో నుంచి దొంగలించి పోయిన దొంగలు ఎవరు? కారు అద్దాలు పగలకొట్టేవరకు ఎవరు? ఎవరు గమనించలేదా? కారు అద్దం బలమైన ఏదైనా ఆయుధంతో పలగొట్టి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు చుట్టుపక్కల గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు, కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేస్తుండగా, మరికొన్ని చోట్ల పని చేయకపోవడంతో, పట్టపగలు కారులో నుంచి 8 లక్షల దొంగలించుకుని పారిపోయిన వారి ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు చిక్కకపోవడంతో, మాధవరావు అనే రైతు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న తన బంధువుకు చికిత్స ఖర్చులకోసం నుంచి బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులను సూపర్ మార్కెట్ నుంచి 15 నిమిషాల్లోనే బయటకు వచ్చేసరికి డబ్బులు మాయం కావడం పట్ల మాధవరావు వారిని రైతు కంటతడి పెడుతున్నారు. కారు అద్దాలు పగలగొట్టి భారీ నగదు చోరీకి పాల్పడ్డ దుండగులురు పట్టుకోలంటూ మాధవరావు అనే రైతు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బాన్స్వాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి ఆధ్వర్యంలో చుట్టుపక్కల గల సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. కారులో నుంచి నగదు చోరీకి పాల్పడ్డ దుండగులను పట్టుకుంటామని పోలీసులు సీరియస్గా తీసుకొని బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ లో మంగళవారం పట్టపగలు జరిగిన భారీ నగదు చోరీలో పాల్పడ్డ దుండగులు అంతరాష్ట్ర దొంగల ముఠాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పకడ్బందీగా బాన్స్వాడ డిఎస్పి విట్టల్ రెడ్డి దొంగలను పట్టుకోవడానికి మూడు బృందాలుగా ఏర్పడి గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
    user_Local Public news
    Local Public news
    బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి, ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  సూచన మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని  అధికారులకు స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, వీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అన్వర్,కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్,గడ్డమీద మహేష్,అంజద్,లడ్డు, భూపతి,గంగాధర్, వాజిద్,లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిడి లక్ష్మణ్,కె. లలిత, బబ్లు,మాజీద్, జావేద్,యూనుస్, సిద్దిఖ్,గ్యార సాయిలు, మన్సూర్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహము భారత్ 1- 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా బుధవారం జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు. జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శాఖ అధికారినీ హేమ భార్గవి, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు,జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు రాజు, శరత్ మరియు సిబ్బంది సంజీవ్, నవనీత పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు
    1
    జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నగేష్  తెలిపారు.
కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ   ఆధ్వర్యంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 'బాల్య వివాహము భారత్ 1- 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం'లో భాగంగా బుధవారం  జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని జెండా ఊపి అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు.
జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ  100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శాఖ అధికారినీ హేమ భార్గవి, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు,జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు రాజు, శరత్ మరియు సిబ్బంది సంజీవ్, నవనీత పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది ఇతర అధికారులు  పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • కొల్చారం శివారులో హైదరాబాద్ ప్రధాన రహదారి పై అతివేగంగా వస్తున్న కారు చెట్టు ను ఢీ కొట్టడం జరిగింది. ఈ సంఘటన లో మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బిసి వై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా అక్కడిక్కడే మృతి చెందాడు. విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ బిసి సింహ గర్జన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తన స్నేహితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని 108 సహాయంతో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కొల్చారం శివారులో హైదరాబాద్ ప్రధాన రహదారి పై అతివేగంగా వస్తున్న కారు చెట్టు ను ఢీ కొట్టడం జరిగింది. ఈ సంఘటన లో మెదక్ పట్టణానికి చెందిన వీవీ సిల్క్స్ యజమాని, బిసి వై పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి రోహిత్ గుప్తా అక్కడిక్కడే మృతి చెందాడు. విజయవాడలో జరిగిన బీసీవై పార్టీ బిసి సింహ గర్జన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తన స్నేహితుడు కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రున్ని 108 సహాయంతో మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని  కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    19 hrs ago
  • బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా పిప్పలదరి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పంట పొలంలో రైతుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతుల కండ్లలో ఆనందం ధైర్యం చూస్తే తెలంగాణ లో మళ్ళీ రైతు రాజ్యం రాబోతుందని తెలుస్తుంది అని అన్నారు.
    1
    బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా పిప్పలదరి గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి పంట పొలంలో రైతుల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతుల కండ్లలో ఆనందం ధైర్యం చూస్తే తెలంగాణ లో మళ్ళీ రైతు రాజ్యం రాబోతుందని తెలుస్తుంది అని అన్నారు.
    user_AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    AlluriMahesh(ఆదిలాబాద్ జిల్లా)
    Local News Reporter Boath, Adilabad•
    22 hrs ago
  • జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో  శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.
    1
    జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో  శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న భవిత సెంటర్ ను సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.
    1
    నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.  
అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న భవిత సెంటర్ ను సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.
    user_Sri
    Sri
    Carpenter నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.