Shuru
Apke Nagar Ki App…
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్లోని 50 ప్రాంతాలలో ప్రత్యేక ఆర్గానిక్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, అన్ని జిల్లా కేంద్రాలలోనూ ఆర్గానిక్ మార్కెట్లను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఈ చొరవ వల్ల సేంద్రియ రైతులందరికీ మెరుగైన మార్కెట్ అవకాశాలు లభించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
Ram Thotapally
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్లోని 50 ప్రాంతాలలో ప్రత్యేక ఆర్గానిక్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, అన్ని జిల్లా కేంద్రాలలోనూ ఆర్గానిక్ మార్కెట్లను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఈ చొరవ వల్ల సేంద్రియ రైతులందరికీ మెరుగైన మార్కెట్ అవకాశాలు లభించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
More news from Ntr and nearby areas
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో యోగాంధ్ర-2026 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా యోగాంధ్ర-2026కు సంబంధించిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుండి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో యోగాంధ్ర నిర్వహించాలని సీఎం సూచించారు. మొత్తంగా కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. రాజధాని అమరావతిలోని కృష్ణా నదీ వంతెనపై, వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా నిర్మించిన బ్రిడ్జిపై జూన్ 21న 25 వేల మందితో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది ట్రైనర్లకు అదనంగా మరో లక్ష మందిని ట్రైనర్లుగా చేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రతి జిల్లా ఒక థీమ్ తో 14 రోజుల యోగాంధ్రను నిర్వహిస్తుంది. జిల్లాల్లో యోగాంధ్ర నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ. 25 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. ఆరోగ్య, మానవవనరులు, మునిసిపల్, పంచాయతీ రాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి జిల్లాలోని రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో (మొత్తం 56 కేంద్రాల్లో) ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తారు. ఒక రోజుకు రెండు జిల్లాల చొప్పున 500 మందితో పర్యాటక ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తారు. అలాగే, 14 రోజుల పాటు పార్కులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయి. యోగాంధ్ర ఈవెంట్లకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అవార్డులు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ యోగా, నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు యోగాంధ్ర నిర్వహణకు సంబంధించి రూపొందించిన పోస్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. యోగాపై అవగాహన, శిక్షణ కోసం తాను చేపట్టిన కార్యక్రమాలను సత్యనారాయణ రాజు సీఎంకు వివరించారు. 90 ఆసనాల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాల వీడియోలు, రోజు వారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామంపై 7 వీడియోలు, యోగా సందేహాలు ప్రశ్నలు-సమాధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్ డొమైనులో పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మీడియా, సోషల్ మీడియా, వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ద్వారా వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. 8142404888 నెంబర్కు 'హాయ్' అని మెసేజ్ పంపడం లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సత్యనారాయణ రాజు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్ తో పాటు సీఎస్ సాయి ప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, కమిషనర్ వీర పాండియన్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.1
- ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో గల శ్రీ గణపేశ్వర ఆలయం అభివృద్ధి పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ అభివృద్ధి కోసం 3 కోట్ల 72 లక్షల రూపాయలను కేటాయించి శ్రీకారం చుట్టారు. ఈ అభివృద్ధి పనులలో భాగంగా ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, ఆలయ శిఖరం, మరియు మరికొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ్ సహాయం రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా నాయకులు, కూసుమంచి సర్పంచ్ కృష్ణవేణి, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం కంట్రోల్ రూమ్ ఎస్సైగా విధులు నిర్వర్తించిన సుబ్బరాజు 37 సంవత్సరాల విశిష్ట సేవలు అందించిన తర్వాత పదవీ విరమణ పొందారు. ప్రజాసేవను పరమావధిగా, క్రమశిక్షణను జీవిత సూత్రంగా భావించి, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, విధి నిబద్ధతకు చిరునామాగా ఆయన నిలిచారని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఎస్పీ సుబ్బరాజును, ఆయన సతీమణిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి ఆయన విశిష్ట సేవలను కొనియాడారు. ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ, కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై స్థాయికి ఎదిగిన సుబ్బరాజు ప్రయాణం యువ పోలీసులకు స్ఫూర్తిదాయకం అన్నారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కాదని, అది సమాజ భద్రత కోసం చేసే త్యాగయాత్ర అని, అలాంటి యాత్రను 37 సంవత్సరాలపాటు అత్యంత నిజాయితీతో, నిబద్ధతతో కొనసాగించిన అధికారి సుబ్బరాజు అని ఆమె ప్రశంసించారు. 1989లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్గా సేవలు ప్రారంభించిన ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి సబ్ ఇన్స్పెక్టర్ హోదాను అందుకోవడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శమని తెలిపారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి వంటి ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సైతం ధైర్యసాహసాలతో సేవలందించి, తన సర్వీసు కాలమంతా ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు లేకుండా విధులు నిర్వర్తించడం ఆయన నిష్కళంక సేవలకు నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. ఆయన చూపిన విధి నిబద్ధత, ప్రజల పట్ల మానవీయ దృక్పథం, సహోద్యోగులతో స్నేహపూర్వక వైఖరి యువతరం పోలీసులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక కొత్త అధ్యాయమని, ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ సునీత రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే జీపీఎఫ్, ఇన్సూరెన్స్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా, పదవీ విరమణ అనంతరం అందాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి సీఐ సుగంధ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఇతర అధికారులు, సుబ్బరాజు కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.3
- పని ఒత్తిడి, ఆందోళనల కారణంగా తన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న ఓ మహిళ గురించి లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. మిథ్లాజ్ స్వయంగా ఆ మహిళ ఆటో ఎక్కి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ఐటీ మేనేజర్గా పని చేసిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఆ ఉద్యోగం మానేసినట్లు ఆ మహిళ చెప్పినట్లు మిథ్లాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా, ఆటో డ్రైవర్గా ఆమె చాలా సంతోషంగా ఉన్నారని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఆ మహిళ ఎక్కడ ఆటో నడుపుతున్నారనే వివరాలను మాత్రం ఆ వీడియోలో చెప్పలేదు.1
- మాసబ్ ట్యాంక్లో హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కుటుంబాన్ని కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.1
- మసాలా దోసెను ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. తెలంగాణలోని ఒక చిన్న పట్టణంలో మసాలా దోసె పట్ల అపారమైన ప్రేమను చూపించే ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నాడు — అది ప్రతిరోజూ ఉదయం ఒక నిర్దిష్ట సమయానికి అల్పాహారం కోసం ఒక దోసె బండి దగ్గరకు వచ్చే ఒక ఎద్దు. ఈ దోసె బండి యజమాని, ఆ ఎద్దు ఒకరికొకరు మంచి స్నేహితులుగా మారారు. యజమాని తన స్నేహితుడైన ఎద్దు కోసం ప్రత్యేకంగా రెండు దోసెలను తయారు చేస్తాడు. ఈ దోసెలు కారం లేకుండా, కేవలం ఆలుగడ్డ మసాలాతో సిద్ధం చేయబడతాయి. దోసెలు తయారయ్యే వరకు ఎద్దు ఎంతో ఓర్పుగా ఎదురుచూస్తుంది. అవి సిద్ధమయ్యాక, యజమాని వాటిని ఫ్యాన్ కింద చల్లబరిచి, తన ప్రియమైన స్నేహితుడికి ప్రేమగా తినిపిస్తాడు. ఈ అద్భుతమైన మరియు అందమైన అనుబంధం ఎన్నో సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది.1
- ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని నిమ్స్ ట్రామా బ్లాక్లో అగ్నిమాపక మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్ అగ్నిమాపక శాఖ మార్గదర్శకత్వంలో చేపట్టిన ఈ విన్యాసంలో, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు రోగులను సురక్షితంగా తరలించే విధానాలపై డమ్మీ పేషెంట్లతో సిబ్బందికి శిక్షణ, అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో స్పందించే నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం కాగా, అగ్ని ప్రమాదం వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై నిమ్స్లో ప్రత్యక్ష అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.1
- అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సీఎండీ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి, ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులు వేసిన అడ్డుకట్టను తక్షణం తొలగించాలని ఏడీసీ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. స్లూయీజ్ గేట్ల లీకేజీ ద్వారా కృష్ణానదిలోని నీటి ప్రవాహం కొండవీటివాగులోనికి వెళ్లకుండా నిరోధించేందుకు ఈ అడ్డుకట్ట వేయబడిందని ఆమె పేర్కొన్నారు. పంపింగ్ స్టేషన్కు మరమతులు చేసే క్రమంలో, నీటిపారుదల శాఖ అధికారులు కొండవీటివాగులో నీరు ఇన్టేక్ పాండ్లో కలవకుండా ఈ అడ్డుకట్ట వేశారని వివరణ లభించింది. నీటిపారుదల హెడ్ రెగ్యులేటర్లో లీకేజీ మరియు ఈ కట్ట కారణంగా కృష్ణా నది నుండి పెనుమాక రిజర్వాయర్కు నీటి ప్రవాహం వెనక్కి ప్రవహించిందని ఏడీసీ ఛీఫ్ ఇంజినీరు బి.నరసింహమూర్తి సీఎండీకి వివరించారు. ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణానదిలో కొండవీటివాగు నీటి ప్రవాహం కలుస్తుంది. ఇక్కడ అడ్డుకట్ట వేయడం వల్ల కృష్ణానదిలో నీరు వెనక్కి వచ్చి, పెనుమాకలో అభివృద్ధి పనులలో ఉన్న రిజర్వాయర్లోనికి చేరి నిలిచిందని ఆయన నివేదించారు. ఈ అడ్డుకట్ట బకింగ్హాం కెనాల్లో వెళ్లాల్సిన కొండవీటివాగు నీరు సైతం నిలిచిపోవడానికి కారణమైంది. ఈ పరిస్థితిపై శనివారం ఏడీసీ ఇంజినీరింగ్ అధికారులతో పంపింగ్ స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎండీ, వెంటనే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి, అడ్డుకట్టను తక్షణమే తొలగించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఆమె పెనుమాక రిజర్వాయర్కు చేరిన కృష్ణా నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున, రాజధాని అమరావతి గుండా ప్రవహిస్తున్న కొండవీటివాగు, పాలవాగుల మధ్య నిర్మిస్తున్న రహదార్ల వంతెనల వద్ద నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కూడా ఆమె ఆదేశించారు. అలాగే, పాలవాగు ప్రారంభమయ్యే రాయపూడి వద్ద ఉన్న డైవర్షన్ ఛానెల్ను మరింత లోతుగా తవ్వకం చేయాలని సూచించారు. ఈ పర్యటనలో ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు ఆర్.గోపాలకృష్ణారెడ్డి, సీహెచ్. ధనుంజయ, ఎస్ఈ రామమోహనరావుతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.1
- తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి, రూరల్ మండలాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కుసుమంచి మండలంలోని గణపేశ్వర ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, అలాగే కొండాపురం నుంచి పొన్నెకల్లు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి, వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ కోరారు.1