పెనుకొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రచార రథాన్ని ప్రారంభించిన మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుకొండ పట్టణంలో నియోజకవర్గ స్థాయి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్ శ్రీ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు మరియు పిల్లల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రత్యేక ప్రచార రథాన్ని మంత్రి, కలెక్టర్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు.'అక్షరాంధ్ర' కార్యక్రమం ద్వారా మహిళలు విద్యావంతులు కావాలని, తద్వారా కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని వారు సూచించారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.స్థానిక ప్రభుత్వ కళాశాల మైదానంలో నూతనంగా నిర్మించిన బహిరంగ వేదికను (Stage) ఈరోజు గౌరవ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు కలిసి ఘనంగా ప్రారంభించారు.కళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు, క్రీడా కార్యక్రమాలకు మరియు ఇతర ముఖ్య సమావేశాలకు అనుగుణంగా ఈ వేదికను అత్యాధునిక వసతులతో నిర్మించారు.ఈ కార్యక్రమములో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
పెనుకొండలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రచార రథాన్ని ప్రారంభించిన మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుకొండ పట్టణంలో నియోజకవర్గ స్థాయి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్
శ్రీ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు మరియు పిల్లల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రత్యేక ప్రచార రథాన్ని మంత్రి, కలెక్టర్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు.'అక్షరాంధ్ర' కార్యక్రమం ద్వారా మహిళలు విద్యావంతులు కావాలని, తద్వారా కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని వారు సూచించారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.స్థానిక ప్రభుత్వ కళాశాల
మైదానంలో నూతనంగా నిర్మించిన బహిరంగ వేదికను (Stage) ఈరోజు గౌరవ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు కలిసి ఘనంగా ప్రారంభించారు.కళాశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు, క్రీడా కార్యక్రమాలకు మరియు ఇతర ముఖ్య సమావేశాలకు అనుగుణంగా ఈ వేదికను అత్యాధునిక వసతులతో నిర్మించారు.ఈ కార్యక్రమములో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, భారీ సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
- రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో తాగు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లగా.. ఆయన వెంటనే పంచాయతీ సెక్రెటరీతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన బోర్ వేయించి దాహార్తిని తీర్చారు. సమస్య విన్నవించిన వెంటనే పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- Post by Magathala Siddhartha2
- Post by ఉష శ్రీ6
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- కడప బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి... చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు... 2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి... సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ... విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ? బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...1