సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ,యోగిమల్లవరం శివాలయంలో హిందూ సంఘాల ప్రత్యేక పూజలు. సోమనాథ్ ఆలయ గౌరవం, హిందూ స్వాభిమానం ప్రతీకగా నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా యోగిమల్లవరం పరాసరేశ్వర స్వామి దేవస్థానంలో హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.సోమనాథ్ మందిరం చరిత్ర, దాని ధ్వంసం నుంచి పునర్నిర్మాణం వరకు సాగిన గాథను హిందూ ఉపాధ్యాయ సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో, కేయం మున్షి పర్యవేక్షణలో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరగడం హిందూ సమాజ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. 1000 ఏళ్ల తర్వాత 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సోమనాథ్ స్వాభిమాన్ కార్యక్రమాలు హిందూ వారసత్వానికి నూతన ఊపునిచ్చాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పరాసరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ సుభిక్షం, శాంతి, సమృద్ధి కోసం, అలాగే ప్రధానమంత్రి మోడీకి దైవ ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో హిందూ ఉపాధ్యాయ సమితి, ఎస్సీ–ఎస్టీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మునస్వామి నాగరాజ, హిందూ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మునిరామ్ రెడ్డి, ఉపాధ్యాయులు నారాయణ, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ,యోగిమల్లవరం శివాలయంలో హిందూ సంఘాల ప్రత్యేక పూజలు. సోమనాథ్ ఆలయ గౌరవం, హిందూ స్వాభిమానం ప్రతీకగా నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా యోగిమల్లవరం పరాసరేశ్వర స్వామి దేవస్థానంలో హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.సోమనాథ్ మందిరం చరిత్ర, దాని ధ్వంసం నుంచి పునర్నిర్మాణం వరకు సాగిన గాథను హిందూ ఉపాధ్యాయ సమితి ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో, కేయం మున్షి పర్యవేక్షణలో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరగడం హిందూ సమాజ గౌరవానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. 1000 ఏళ్ల తర్వాత 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన సోమనాథ్ స్వాభిమాన్ కార్యక్రమాలు హిందూ వారసత్వానికి నూతన ఊపునిచ్చాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పరాసరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ సుభిక్షం, శాంతి, సమృద్ధి కోసం, అలాగే ప్రధానమంత్రి మోడీకి దైవ ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో హిందూ ఉపాధ్యాయ సమితి, ఎస్సీ–ఎస్టీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మునస్వామి నాగరాజ, హిందూ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మునిరామ్ రెడ్డి, ఉపాధ్యాయులు నారాయణ, బీజేపీ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- బద్వేలు, ఏప్రిల్ 0 2: ఫిబ్రవరి మాసంలో వృద్ధాప్యంలో కూడా వీడని అన్న చెల్లెల అనుబంధం. అనేటువంటి కథనం సోషల్ మీడియా ద్వారా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో వారు చేసినటువంటి ట్వీట్ట్ ద్వారా కలెక్టర్ జిల్లా యంత్రాంగం స్పందించి గోపవరం మండలం పిపి కుంట గ్రామంలోని ఇద్దరు నిరాశ్రయులను ఆర్డిఓ చంద్రమోహన్ మరియు డిఆర్డిఏ పిడి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో లక్కీ కొండయ్య మరియు ఆయన సోదరి పొంత గిరిలక్ష్మీనారాయణమ్మ గా గుర్తించారు. బద్వేలు పట్టణంలోని మెప్మా మరియు బద్వేలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నైట్ షెల్టర్, ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం. నకు తరలించి, వారికి అవసరమైనటువంటి వసతులను ఏర్పాటు చేసి, డాక్టర్ల ద్వారా వైద్యం అందించడం జరిగింది. అధికారులు స్వయంగా వారి చేతుల మీదుగా వారికి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఆర్డీవో , డిఆర్డిఎ పిడి రాజ్యలక్ష్మి ఆదేశాలతో, వారిని నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించుకొని, వారికి అవసరమైనటువంటి వైద్యము, వసతి, ఆహారాన్ని, ఈ రెండు నెలలపాటు అందించడం జరిగింది. అధికారుల సహకారంతో, వారికి అవసరమైన రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, మంజూరు చేశారు. నేడు ఏప్రిల్ ఒకటో తారీకు ఉదయం, పెన్షన్ వారికి ఇవ్వడంతో ఆనంద నిలయంలోని వృద్ధులు అందరు కూడా తమ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని, తెలియపరుస్తూ, వచ్చినటువంటి అధికారులకు కృతజ్ఞతలతో చిరు సన్మానం చేయడం జరిగింది .ఆనంద నిలయం నిర్వాహకులు పిడతల రవికుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపవరం మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.2
- గాండ్లపెంట మండలo క ఠారుపల్లి గ్రామంలో యోగివేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించి, ముగింపుకు చేరుకున్నాయి. గురువారం రాత్రి ఉత్సవాలు ముగింపు కావడంతో యోగివేమన గొడుగుకి వేమన పీఠాధిపతులు నందవేమారెడ్డి, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలు చేశారు. వేమన సమాధిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేమన ఉత్సవాలు వైభవంగా నిర్వహించిన నందవేమారెడ్డికి భక్తులు ప్రశంసిస్తున్నారు.1
- ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..1
- కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్లో బాణసంచా పేల్చి, సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మోరేపల్లి మల్లికార్జున, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏1
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వర స్వామి రథోత్సవ వేడుకలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి ఉత్సవమూర్తిని రథోత్సవం పై కొలువు తీర్చి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మడుగుతేరు కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రథోత్సవ వేడుకల్లో పాల్గొని రథాన్నిలాగి మొక్కలు తీర్చుకున్నారు.1
- బద్వేలు :స్వచ్ఛ సర్వేక్షన్ 2026 లక్ష్యంగా మన బద్వేలు పురపాలక సంఘం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు వార్డు స్థాయిలో జరిగిన చెత్త వర్గీకరణ (Waste Segregation) కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమీషనర్ స్వయంగా పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమ ముఖ్యాంశాలు: నేరుగా క్షేత్రస్థాయిలో: కమిషనర్ గారు స్వయంగా తడి, పొడి మరియు హానికర వ్యర్థాలను ఎలా వేరు చేయాలో (ఆకుపచ్చ, నీలం, ఎరుపు బుట్టల వినియోగం) ప్రజలకు వివరించారు. కార్మికులకు దిశానిర్దేశం: పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి, వ్యర్థాల సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలను పర్యవేక్షించారు. పౌరుల బాధ్యత: "మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన వీధిని, మన పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం మన అందరి బాధ్యత" అని కమీషనర్ గారు పిలుపునిచ్చారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న వేళ, మన వంతుగా చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి సహకరిద్దాం. స్వచ్ఛ సర్వేక్షన్ 2026లో మన బద్వేలు ను నంబర్ 1 గా నిలుపుదాం!1
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబు గుంపల గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు కుళాయిల వద్ద బిందెలను క్యూ లైన్లో పెట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్ అధికారులకు తాగునీటి సమస్యను గ్రామస్థులు తెలియజేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- Post by Syyed taher1