logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తత అవసరం: ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. వేసవి నేపథ్యంలో మంగళవారం జన్నారంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు అగ్నిప్రమాదల నివారణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవి దృష్ట్యా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే తమకు సమాచారం అందిస్తే మంటలను ఆపివేస్తామని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ వివరించారు.

7 hrs ago
user_Gourinatha p.g
Gourinatha p.g
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
7 hrs ago
91e72b8a-2a53-4f19-9ab4-a68c9133e5d5
74de83cf-e4a8-4671-a3a2-5f628476a0aa

అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తత అవసరం: ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అగ్ని ప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండల ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు. వేసవి నేపథ్యంలో మంగళవారం జన్నారంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు అగ్నిప్రమాదల నివారణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవి దృష్ట్యా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే తమకు సమాచారం అందిస్తే మంటలను ఆపివేస్తామని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ వివరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • జన్నారం మండలంలోని తాళ్లపెట్ రేంజ్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో అనేక పక్షులు కనువిందు చేస్తున్నాయని వన్యప్రాణి పరిశోధకుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డా.వెంకట్ ఎనగందుల తెలిపారు. మంగళవారం ఆయన మల్యాల బీట్ లో ఓరియంటల్ గోల్డెన్ ఒరియోల్, స్ట్రీక్ త్రోటేడ్ వుడ్ పీకర్, కామన్ కింగ్ ఫిషర్, ఎల్లో త్రోటెడ్ ప్యారో, ఆరెంజ్ హేడెడ్ త్రష్, టికెట్స్ బ్లూ ఫ్లై క్యాచర్ లాంటి పక్షులను తన కెమేరాలలో బంధించారు.
    1
    జన్నారం మండలంలోని తాళ్లపెట్ రేంజ్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో అనేక పక్షులు కనువిందు చేస్తున్నాయని వన్యప్రాణి పరిశోధకుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త 
డా.వెంకట్ ఎనగందుల తెలిపారు. మంగళవారం ఆయన మల్యాల బీట్ లో ఓరియంటల్ గోల్డెన్ ఒరియోల్, స్ట్రీక్ త్రోటేడ్ వుడ్ పీకర్, కామన్ కింగ్ ఫిషర్, ఎల్లో త్రోటెడ్ ప్యారో, ఆరెంజ్ హేడెడ్ త్రష్, టికెట్స్ బ్లూ ఫ్లై క్యాచర్ లాంటి పక్షులను తన కెమేరాలలో బంధించారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) మంజూరు కావడం ఆ ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ​గతంలో రైల్వే అధికారులు కొలనూరును సందర్శించినప్పుడు స్వయంగా వారితో కలిసి ఆన్‌సైట్ పరిశీలన నిర్వహించి, ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ అత్యవసరమని వివరించినట్లు చెప్పారు. మొదట రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే మంజూరు ఇచ్చి, ఓదేలుకు సాధ్యం కాదని తెలిపినా.. ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించినట్లు వివరించారు. ​ముఖ్య అంశాలు: ​నిరంతర పోరాటం: రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి, రిప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల కొలనూరు ఆర్ఓబీని రైల్వే శాఖ స్వంత ఖర్చులతో నిర్మించడానికి అంగీకరించింది. ​ఓదేలుపై హామీ: కొలనూరు తరహాలోనే ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. ​శాశ్వత పరిష్కారం: ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ​కొలనూరు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వంశీకృష్ణ, త్వరలోనే పనులు ప్రారంభమై పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) మంజూరు కావడం ఆ ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.
​గతంలో రైల్వే అధికారులు కొలనూరును సందర్శించినప్పుడు స్వయంగా వారితో కలిసి ఆన్‌సైట్ పరిశీలన నిర్వహించి, ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ అత్యవసరమని వివరించినట్లు చెప్పారు. మొదట రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే మంజూరు ఇచ్చి, ఓదేలుకు సాధ్యం కాదని తెలిపినా.. ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించినట్లు వివరించారు.
​ముఖ్య అంశాలు:
​నిరంతర పోరాటం: రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి, రిప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల కొలనూరు ఆర్ఓబీని రైల్వే శాఖ స్వంత ఖర్చులతో నిర్మించడానికి అంగీకరించింది.
​ఓదేలుపై హామీ: కొలనూరు తరహాలోనే ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు.
​శాశ్వత పరిష్కారం: ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.
​కొలనూరు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వంశీకృష్ణ, త్వరలోనే పనులు ప్రారంభమై పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।
    1
    सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    54 min ago
  • ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ రాజ్యసభ సభ్యులుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ రాజ్యసభ సభ్యులుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    2 hrs ago
  • రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్‌ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
    1
    రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్‌ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
    user_Ajay Doddi (ఉమ్మడి కరీంనగర్)
    Ajay Doddi (ఉమ్మడి కరీంనగర్)
    Journalist కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
    1
    జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.
    1
    తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే   పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • మ్యాదరిపేటలో విషాదం: ఇనుప స్టాండ్‌కు తగిలిన హైఓల్టేజ్ వైర్లు.. ఒకరు సజీవ దహనం, మరొకరు అక్కడికక్కడే మృతి. ​ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో సోమవారం ఒక పెను విషాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం వెళ్ళిన ఇద్దరు యువకులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. హైఓల్టేజ్ విద్యుత్ తీగలు తగలడంతో ఒక యువకుడు కళ్లెదుటే మంటల్లో కాలిపోగా, మరొకరు తీవ్రమైన షాక్‌తో ప్రాణాలు విడిచారు. ​అసలేం జరిగింది? ​స్థానికుల కథనం ప్రకారం.. మ్యాదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఒక భారీ ఇనుప స్టాండ్ ఉంది. మ్యాదరిపేటకు చెందిన సల్ల లక్ష్మీనారాయణ (ఎడ్డన్న), వెల్గనూర్ గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు ఆ స్టాండ్‌ను రోడ్డుపై నుంచి జరుపుతున్నారు. అయితే, పైన తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైఓల్టేజ్ విద్యుత్ మెయిన్ లైన్లను వారు గమనించలేదు. ​ఆ ఇనుప స్టాండ్ ఒక్కసారిగా విద్యుత్ తీగలకు తగలడంతో భారీ స్థాయిలో కరెంట్ ప్రవహించింది. ఈ క్రమంలో: ​సజీవ దహనం: విద్యుత్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. స్టాండ్‌ను పట్టుకుని ఉన్న లక్ష్మీనారాయణ శరీరం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. అందరూ చూస్తుండగానే ఆయన సజీవ దహనమయ్యాడు. ​అక్కడికక్కడే మృతి: మరో యువకుడు నాగరాజు తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ​గ్రామాల్లో మిన్నంటిన రోదనలు ​చేతికొచ్చిన కొడుకులు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండటంతో మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. మ్యాదరిపేట, వెల్గనూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ​"విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగింది. వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు యువకులు బలైపోయారు." > — స్థానికుల ఆవేదన ​విచారణ చేపట్టిన పోలీసులు ​ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మ్యాదరిపేటలో విషాదం: ఇనుప స్టాండ్‌కు తగిలిన హైఓల్టేజ్ వైర్లు.. ఒకరు సజీవ దహనం, మరొకరు అక్కడికక్కడే మృతి.
​
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో సోమవారం ఒక పెను విషాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం వెళ్ళిన ఇద్దరు యువకులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. హైఓల్టేజ్ విద్యుత్ తీగలు తగలడంతో ఒక యువకుడు కళ్లెదుటే మంటల్లో కాలిపోగా, మరొకరు తీవ్రమైన షాక్‌తో ప్రాణాలు విడిచారు.
​అసలేం జరిగింది?
​స్థానికుల కథనం ప్రకారం.. మ్యాదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఒక భారీ ఇనుప స్టాండ్ ఉంది. మ్యాదరిపేటకు చెందిన సల్ల లక్ష్మీనారాయణ (ఎడ్డన్న), వెల్గనూర్ గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు ఆ స్టాండ్‌ను రోడ్డుపై నుంచి జరుపుతున్నారు. అయితే, పైన తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైఓల్టేజ్ విద్యుత్ మెయిన్ లైన్లను వారు గమనించలేదు.
​ఆ ఇనుప స్టాండ్ ఒక్కసారిగా విద్యుత్ తీగలకు తగలడంతో భారీ స్థాయిలో కరెంట్ ప్రవహించింది. ఈ క్రమంలో:
​సజీవ దహనం: విద్యుత్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. స్టాండ్‌ను పట్టుకుని ఉన్న లక్ష్మీనారాయణ శరీరం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. అందరూ చూస్తుండగానే ఆయన సజీవ దహనమయ్యాడు.
​అక్కడికక్కడే మృతి: మరో యువకుడు నాగరాజు తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
​గ్రామాల్లో మిన్నంటిన రోదనలు
​చేతికొచ్చిన కొడుకులు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండటంతో మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. మ్యాదరిపేట, వెల్గనూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
​"విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగింది. వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు యువకులు బలైపోయారు." > — స్థానికుల ఆవేదన
​విచారణ చేపట్టిన పోలీసులు
​ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.