logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెదకూరపాడులోని ఆనందపేట కృష్ణమాదిగ కాలనీలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భవన నిర్మాణానికి స్థల అనుమతి, అలాగే జగజ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి కోరుతూ పి.డి.ఎస్. జె. ఎస్. సి, కమిటీ అధ్యక్షులు కంచర్ల రత్నబాబు మాదిగ ఆధ్వర్యంలో తహసిల్దార్ శ్రీనివాసరావుకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. కాలనీలో సమావేశాలు, విద్యా కార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి కమ్యూనిటీ హాల్ లేదని, బాబు జగజ్జీవన్ రామ్ భవన నిర్మాణం ద్వారా ఆనందపేట అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని అధ్యక్షులు కంచర్ల రత్నబాబు మాదిగ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడి తప్పకుండా తగు న్యాయం చేస్తానని తహసిల్దార్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కంచర్ల ప్రదీప్ కుమార్, ట్రెజరరీ కంచర్ల అంకమ్మ, వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరు సూరిబాబు, జాయింట్ సెక్రటరీ మేకల నరేష్, కమిటీ గౌరవ సలహాదారులు కంచర్ల జానుబాబు మాదిగ, రావెల మాథ్యూస్, కంచర్ల అమర్ కుమార్, కంచర్ల సుబ్బారావు, కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి రాజు, ఎం శ్రీనివాసరావు, పవన్ ఎం మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

7 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

పెదకూరపాడులోని ఆనందపేట కృష్ణమాదిగ కాలనీలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భవన నిర్మాణానికి స్థల అనుమతి, అలాగే జగజ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి కోరుతూ పి.డి.ఎస్. జె. ఎస్. సి, కమిటీ అధ్యక్షులు కంచర్ల రత్నబాబు మాదిగ ఆధ్వర్యంలో తహసిల్దార్ శ్రీనివాసరావుకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. కాలనీలో సమావేశాలు, విద్యా కార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి కమ్యూనిటీ హాల్ లేదని, బాబు జగజ్జీవన్ రామ్ భవన నిర్మాణం ద్వారా ఆనందపేట అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని అధ్యక్షులు

కంచర్ల రత్నబాబు మాదిగ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మాట్లాడి తప్పకుండా తగు న్యాయం చేస్తానని తహసిల్దార్ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కంచర్ల ప్రదీప్ కుమార్, ట్రెజరరీ కంచర్ల అంకమ్మ, వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరు సూరిబాబు, జాయింట్ సెక్రటరీ మేకల నరేష్, కమిటీ గౌరవ సలహాదారులు కంచర్ల జానుబాబు మాదిగ, రావెల మాథ్యూస్, కంచర్ల అమర్ కుమార్, కంచర్ల సుబ్బారావు, కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి రాజు, ఎం శ్రీనివాసరావు, పవన్ ఎం మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విజయవాడ వన్ టౌన్ సీఐ నాగరాజును అరెస్టు చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విజయవాడ నగర పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుండి తరలించారు.
    1
    విజయవాడ వన్ టౌన్ సీఐ నాగరాజును అరెస్టు చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విజయవాడ నగర పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుండి తరలించారు.
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గాదె సాయికృష్ణ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
    1
    గాదె సాయికృష్ణ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    3 hrs ago
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు తగిన స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రైతు ఆశీర్వాదం సభను నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా తన గళాన్ని బలంగా వినిపించి వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలను సాధించుకుంటానని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న లక్షలాది మంది రైతులతో నిర్వహించే ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన రైతాంగాన్ని కోరారు.
    1
    డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు తగిన స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రైతు ఆశీర్వాదం సభను నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా తన గళాన్ని బలంగా వినిపించి వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలను సాధించుకుంటానని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న లక్షలాది మంది రైతులతో నిర్వహించే ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన రైతాంగాన్ని కోరారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    49 min ago
  • ఖమ్మంలో లైంగిక దాడి, హత్యాయత్నానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాలిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని విజయభారతి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం, బాధితురాలి వెన్నెముక పూర్తిగా చితికిపోయిన కారణంగా ఆమె జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవుతుందని పేర్కొన్నారు.
    1
    ఖమ్మంలో లైంగిక దాడి, హత్యాయత్నానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

బాలిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని విజయభారతి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం, బాధితురాలి వెన్నెముక పూర్తిగా చితికిపోయిన కారణంగా ఆమె జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవుతుందని పేర్కొన్నారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • పేర్ని నాని పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడినా తమ కార్యకర్తలు ఎవరూ స్పందించవద్దని కోరారు. జనసేన పార్టీకి మత్తు దిగిపోయిందని, మళ్లీ మత్తు ఎక్కించడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖను తీసుకొని ఆ శాఖకు ఏమైనా న్యాయం చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు. హోమ్ శాఖ తన చేతిలో లేదని పవన్ అంటున్నారని, అయితే ముందు తాను తీసుకున్న శాఖపై దృష్టి పెట్టాలని, దానికి న్యాయం చేస్తేనే ఇతర విషయాల గురించి ఆలోచించవచ్చని సలహా ఇచ్చారు. గ్రామ పంచాయతీల ప్రతి అకౌంట్ సీజ్ అయి ఉందని, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని ఆయన గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్ పవన్ చేతికి ఇస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న రౌడీలను, గూండాలను తొక్కి నార తీస్తారా అని పేర్ని నాని వ్యంగ్యంగా అడిగారు. పవన్ కల్యాణ్ కుంకి ఏనుగులు తెచ్చారని చెబుతున్నారని, అయితే ఆ తెచ్చిన ఏనుగుల్లో ఒకటి కుంటిది, ఇంకోటి గుడ్డిది అని ఆయన ఎద్దేవా చేశారు. ఇచ్చిన శాఖకు న్యాయం చేయాలని, వేరే శాఖల గురించి తర్వాత మాట్లాడాలని పవన్ కల్యాణ్ కు పేర్ని నాని స్పష్టం చేశారు. వైసిపి కార్యకర్తలకు తాను ఒక్కటే చెబుతున్నానని, పవన్ కల్యాణ్ “ఆటలో అరటిపండు” లాంటివాడని, అతని గురించి ఎవరూ పట్టించుకోవద్దని పునరుద్ఘాటించారు. జనసేన పార్టీకి మత్తు దిగిందని, మళ్లీ మత్తు ఎక్కించడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని తన వ్యాఖ్యలను ముగించారు.
    1
    పేర్ని నాని పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడినా తమ కార్యకర్తలు ఎవరూ స్పందించవద్దని కోరారు. జనసేన పార్టీకి మత్తు దిగిపోయిందని, మళ్లీ మత్తు ఎక్కించడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు.

పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖను తీసుకొని ఆ శాఖకు ఏమైనా న్యాయం చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు. హోమ్ శాఖ తన చేతిలో లేదని పవన్ అంటున్నారని, అయితే ముందు తాను తీసుకున్న శాఖపై దృష్టి పెట్టాలని, దానికి న్యాయం చేస్తేనే ఇతర విషయాల గురించి ఆలోచించవచ్చని సలహా ఇచ్చారు. గ్రామ పంచాయతీల ప్రతి అకౌంట్ సీజ్ అయి ఉందని, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని ఆయన గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్ పవన్ చేతికి ఇస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న రౌడీలను, గూండాలను తొక్కి నార తీస్తారా అని పేర్ని నాని వ్యంగ్యంగా అడిగారు. పవన్ కల్యాణ్ కుంకి ఏనుగులు తెచ్చారని చెబుతున్నారని, అయితే ఆ తెచ్చిన ఏనుగుల్లో ఒకటి కుంటిది, ఇంకోటి గుడ్డిది అని ఆయన ఎద్దేవా చేశారు.

ఇచ్చిన శాఖకు న్యాయం చేయాలని, వేరే శాఖల గురించి తర్వాత మాట్లాడాలని పవన్ కల్యాణ్ కు పేర్ని నాని స్పష్టం చేశారు. వైసిపి కార్యకర్తలకు తాను ఒక్కటే చెబుతున్నానని, పవన్ కల్యాణ్ “ఆటలో అరటిపండు” లాంటివాడని, అతని గురించి ఎవరూ పట్టించుకోవద్దని పునరుద్ఘాటించారు. జనసేన పార్టీకి మత్తు దిగిందని, మళ్లీ మత్తు ఎక్కించడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని తన వ్యాఖ్యలను ముగించారు.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    20 hrs ago
  • సత్తుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేస్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని సీనియర్ మంత్రి తుమ్మలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యమని, కేవలం అవినీతి కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసింది తానే అని ఓ సీనియర్ మంత్రి చెప్పుకుంటున్నారని, అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ముఖ్యమని నామా అన్నారు. నామా నాగేస్వరరావు తన విమర్శలను కొనసాగిస్తూ, ఎరువుల కట్టలు ఇవ్వలేక యాప్ పెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారం కోసమే పార్టీ మారారని, సీతారామ ప్రాజెక్టు 80 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తుచేశారు. కేవలం ఒక్క మోటరు పెట్టి నేనే చేశానని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఈ 'ముండ మోపి ప్రభుత్వం' రైతు బంధును ఎగ్గొట్టిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేసీఆర్ 50 వేల కోట్ల నిధులు తీసుకొచ్చారని, కేసీఆర్ తిరిగి వస్తేనే తెలంగాణ పచ్చగా ఉంటుందని నామా నాగేస్వరరావు స్పష్టం చేశారు. భారతదేశ చరిత్రలో కేసీఆర్ లాంటి నాయకుడు లేడని, ఆయన వచ్చాకే సాగునీరు, తాగునీరుకు లోటు లేకుండా పోయిందని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రైతులు, ప్రజలు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కేసీఆరే దిక్కు అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఎవరూ ఆలోచించని విధంగా కేసీఆర్ ఆలోచించి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ కార్యక్రమాన్ని మోడీతో సహా చాలా రాష్ట్రాలు కాపీ కొట్టాయని నామా నాగేస్వరరావు ప్రశంసించారు.
    1
    సత్తుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేస్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని సీనియర్ మంత్రి తుమ్మలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యమని, కేవలం అవినీతి కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసింది తానే అని ఓ సీనియర్ మంత్రి చెప్పుకుంటున్నారని, అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ముఖ్యమని నామా అన్నారు.

నామా నాగేస్వరరావు తన విమర్శలను కొనసాగిస్తూ, ఎరువుల కట్టలు ఇవ్వలేక యాప్ పెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారం కోసమే పార్టీ మారారని, సీతారామ ప్రాజెక్టు 80 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తుచేశారు. కేవలం ఒక్క మోటరు పెట్టి నేనే చేశానని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఈ 'ముండ మోపి ప్రభుత్వం' రైతు బంధును ఎగ్గొట్టిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

అంతేకాకుండా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేసీఆర్ 50 వేల కోట్ల నిధులు తీసుకొచ్చారని, కేసీఆర్ తిరిగి వస్తేనే తెలంగాణ పచ్చగా ఉంటుందని నామా నాగేస్వరరావు స్పష్టం చేశారు. భారతదేశ చరిత్రలో కేసీఆర్ లాంటి నాయకుడు లేడని, ఆయన వచ్చాకే సాగునీరు, తాగునీరుకు లోటు లేకుండా పోయిందని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రైతులు, ప్రజలు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కేసీఆరే దిక్కు అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఎవరూ ఆలోచించని విధంగా కేసీఆర్ ఆలోచించి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ కార్యక్రమాన్ని మోడీతో సహా చాలా రాష్ట్రాలు కాపీ కొట్టాయని నామా నాగేస్వరరావు ప్రశంసించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావును MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా, అనుమానాస్పద మృతిగా నమోదైన క్రాంతికుమార్ కేసును రీ-ఓపెన్ చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని, ఇప్పటివరకు పలువురు దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దళితులపై ప్రేమ ఉందని చెప్పుకునే నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, క్రాంతికుమార్ మరణం అనుమానాస్పదంగా ఉందని, పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ మాయం కావడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. ఈ కేసుతో పాటు గాదె సాయికృష్ణ ఘటనపై కూడా సమగ్ర సీబీఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
    1
    కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావును MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా, అనుమానాస్పద మృతిగా నమోదైన క్రాంతికుమార్ కేసును రీ-ఓపెన్ చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

విలేకరుల సమావేశంలో MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని, ఇప్పటివరకు పలువురు దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దళితులపై ప్రేమ ఉందని చెప్పుకునే నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, క్రాంతికుమార్ మరణం అనుమానాస్పదంగా ఉందని, పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ మాయం కావడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. ఈ కేసుతో పాటు గాదె సాయికృష్ణ ఘటనపై కూడా సమగ్ర సీబీఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) గట్టిగా డిమాండ్ చేసింది. విద్యను వ్యాపారంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పోరాడాలని PDSU పిలుపునిచ్చింది, అలాగే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరింది. ఈరోజు CPI ML న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా, విద్యా రంగం ఇంకా వ్యాపారంగానే ఉందని గోకినపల్లి మస్తాన్ విమర్శించారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా ముందు రాష్ట్రంలో సుమారు 23 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పడం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు బుక్స్, అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయల ఫీజులను అక్రమంగా వసూలు చేస్తున్నాయని PDSU ఆరోపించింది. జిల్లా అధికారులు ప్రైవేటు స్కూళ్లను సందర్శించకుండా కేవలం తమ కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని, ఇది ఖమ్మం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోందని మస్తాన్ పేర్కొన్నారు. పాఠశాలలు బయట ఒక పేరుతో బోర్డు పెట్టి, లోపల అడ్మిషన్లు వేరే స్కూళ్ల పేరు మీద చేస్తున్నాయని, ఇటువంటి వాటికి అనుమతులు ఎలా ఇస్తున్నారని PDSU ప్రశ్నించింది. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు సరిగా గదులు లేక, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా బడా కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయిందని తీవ్రంగా విమర్శించింది. విద్యా వ్యవస్థను మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యార్థులు ధర్నాలు చేయొద్దు అని చెప్పి, ఇప్పుడు విద్యార్థి తరఫున విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే కేసులు పెట్టే పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తున్నారని PDSU మండిపడింది. మరోవైపు, ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కైన పరిస్థితి ఉందని ఆరోపించారు. గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థులకు సరిగా మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని, గురుకులాలకు మరియు హాస్టళ్లకు సొంత భవనాలు కూడా లేవని ఆయన తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలపేతం చేయాలని PDSU డిమాండ్ చేసింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, ఈనెల 30న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా విద్యారంగ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని PDSU ముఖ్యమంత్రిని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో PDSU ఖమ్మం జిల్లా సభ్యులు రాము, విశ్వంత్, నాయకులు కార్తీక్, రాజేష్, అసాత్, ఉదయ్ పాల్గొన్నారు.
    2
    ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU) గట్టిగా డిమాండ్ చేసింది. విద్యను వ్యాపారంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా పోరాడాలని PDSU పిలుపునిచ్చింది, అలాగే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరింది. ఈరోజు CPI ML న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా, విద్యా రంగం ఇంకా వ్యాపారంగానే ఉందని గోకినపల్లి మస్తాన్ విమర్శించారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియా ముందు రాష్ట్రంలో సుమారు 23 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పడం సరికాదని, వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు బుక్స్, అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయల ఫీజులను అక్రమంగా వసూలు చేస్తున్నాయని PDSU ఆరోపించింది. జిల్లా అధికారులు ప్రైవేటు స్కూళ్లను సందర్శించకుండా కేవలం తమ కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని, ఇది ఖమ్మం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోందని మస్తాన్ పేర్కొన్నారు. పాఠశాలలు బయట ఒక పేరుతో బోర్డు పెట్టి, లోపల అడ్మిషన్లు వేరే స్కూళ్ల పేరు మీద చేస్తున్నాయని, ఇటువంటి వాటికి అనుమతులు ఎలా ఇస్తున్నారని PDSU ప్రశ్నించింది. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు సరిగా గదులు లేక, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా బడా కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయిందని తీవ్రంగా విమర్శించింది.

విద్యా వ్యవస్థను మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యార్థులు ధర్నాలు చేయొద్దు అని చెప్పి, ఇప్పుడు విద్యార్థి తరఫున విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే కేసులు పెట్టే పరిస్థితిని తెలంగాణ రాష్ట్రంలో సృష్టిస్తున్నారని PDSU మండిపడింది. మరోవైపు, ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మక్కైన పరిస్థితి ఉందని ఆరోపించారు. గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థులకు సరిగా మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని, గురుకులాలకు మరియు హాస్టళ్లకు సొంత భవనాలు కూడా లేవని ఆయన తెలిపారు. కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలపేతం చేయాలని PDSU డిమాండ్ చేసింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, ఈనెల 30న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా విద్యారంగ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని PDSU ముఖ్యమంత్రిని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో PDSU ఖమ్మం జిల్లా సభ్యులు రాము, విశ్వంత్, నాయకులు కార్తీక్, రాజేష్, అసాత్, ఉదయ్ పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు తమ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌరయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టుల గురించి మంత్రులు చర్చించారు.
    1
    తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు తమ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌరయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టుల గురించి మంత్రులు చర్చించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.