Shuru
Apke Nagar Ki App…
పులివెందులలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ పులివెందులలో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అంశంపై నిరసన కార్యక్రమంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి, సతీశ్ రెడ్డి వైసీపీ శ్రేణులతో వెళ్లారు. కార్యాలయ గేట్లు వేసి పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు లోపలకు వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
LAKKU SIVA SANKAR reddy
పులివెందులలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్ పులివెందులలో వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అంశంపై నిరసన కార్యక్రమంలో సోమవారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి, సతీశ్ రెడ్డి వైసీపీ శ్రేణులతో వెళ్లారు. కార్యాలయ గేట్లు వేసి పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు లోపలకు వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మిత్రమాARDV కంపెనీలో జాయిన్ అయ్యి డైలీ టాస్క్ చూస్తూ సెల్ఫ్ గా 135 రూపాయలు సంపాదించుకోవచ్చు మిత్రమా1
- దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్… ఆయన త్యాగానికి ఇవే మా ఘన నివాళులు… పుట్టపర్తిలో అమర జవాన్ మురళి నాయక్కు ఘన నివాళులు అర్పించారు. పుట్టపర్తి పట్టణంలోని శిల్పారామంలో సోమవారం అమర జవాన్ మురళి నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, అధికారులు, మురళి నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆగస్టు 10న మురళి నాయక్ జన్మదినం సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం మురళి నాయక్ చేసిన త్యాగం, అందించిన సేవలు దేశానికి గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జవాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమర జవాన్ మురళి నాయక్ త్యాగానికి శతకోటి వందనాలు.1
- ఎమ్మెల్యే సార్ కొత్తూరు కు ఇచ్చిన హామీ నెరవేరేది ఎప్పుడు...! బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామంలో వర్షాకాలం వస్తే వీధులు అన్ని బురదమయం అవుతున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు తెలపడంతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయలేదు. పలు సందర్భాలలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ మాకు న్యాయం జరగలేదు అంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. మండలంలో అనేకచోట్ల పశువుల వామి దొడ్లకు రోడ్డు వేస్తున్నారు గాని వీధులలో మనుషులు తిరిగే ప్రదేశాలను మాత్రమే నాయకులు మరిచినట్లున్నారు. ఎమ్మెల్యే గారు గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేరచాలని కోరుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామంలో అత్యధికంగా బీసీలు ఉన్న ప్రాంతం కాబట్టే ఈ గ్రామంలోకి రోడ్లు వేయలేదు అంటూ కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికార పార్టీ మండల నాయకులు తమ బంధువులు, వైసీపీలో ఉన్న నాయకుల పశువుల పాగల వరకు రోడ్డు వేస్తున్నారు మా గ్రామంలో మాత్రం మరిచార అంటూ వారు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.1
- కడప:🪷 మన డివిజన్ – మన బాధ్యత మీ సమస్య… మా బాధ్యత. 🪷 *8వ రోజు(10/08/2026) సోమవారం* ప్రజల మధ్యే బీజేపీ..🇮🇳 కడప:🪷 మన డివిజన్ – మన బాధ్యత మీ సమస్య… మా బాధ్యత. 🪷 *8వ రోజు(10/08/2026) సోమవారం* ప్రజల మధ్యే బీజేపీ..🇮🇳 *బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి* గారి సూచనల మేరకు, *జిల్లా ఉపాధ్యక్షులు & 12వ డివిజన్ ఇంచార్జ్ యెర్రు మల్లికార్జున రెడ్డి* గారి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా సోమవారం *ఛత్రపతినగర్,శ్రీనగర్ ,మహాలక్ష్మి నగర్, ప్రాంతంలో* ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నాము. *ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో* దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, స్థానిక సమస్యలను నమోదు చేసి వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాడతామని హామీ ఇచ్చాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి ప్రజాభిమానికీ మరియు డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.1
- కూటమి ప్రభుత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ఆరోపణలు పులివెందులలో డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం పులివెందులలో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు, పేదలకు అందాల్సిన సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.1