అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం: సలాన మోహనరావు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోసమాల పీఏసీఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు అన్నారు. మంగళవారం మెళియాపుట్టి మండలం ఆంపురం గ్రామంలో మంగళవారం ‘ఇంటింటా టీడీపీ’ కార్యక్రమంలో భాగంగా ‘రెండేళ్ల సమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మోహనరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ప్రతినిధి బైరసింగి దినకర్, జడ్పీటీసీ గూడ ఎండయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం: సలాన మోహనరావు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోసమాల పీఏసీఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు అన్నారు. మంగళవారం మెళియాపుట్టి మండలం ఆంపురం గ్రామంలో మంగళవారం ‘ఇంటింటా టీడీపీ’ కార్యక్రమంలో భాగంగా ‘రెండేళ్ల సమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మోహనరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప
ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ప్రతినిధి బైరసింగి దినకర్, జడ్పీటీసీ గూడ ఎండయ్య తదితరులు పాల్గొన్నారు.
- పాలకొండ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.1
- విజయవాడ గురించి వర్ణిస్తున్న అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం1
- సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్ రాజాం /సంతకవిటి, షురూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు మూడు కేంద్రాలు : కలెక్టర్ ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.1
- అన్నదానం మహాదానం అభిమాని ఫౌండేషన్ వారి నిత్య అన్నదాన సేవ 1820 వ రోజు వృద్ధుల వికలాంగుల ఇతరుల ఇండ్ల వద్దకు ప్రతీ రోజు భోజనం అందిస్తూ ఆకలి నుంచి కాపాడుతున్న సేవ లో నేడు భాగస్వాములుగా నిలిచిన శ్రీ కంటు రాంప్రసాష్ దంపతులకు అభినందనలు1
- రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాలూరులో ఘనంగా మెగా రక్తదాన మహా శిబిరం సాలూరు: రాజయోగిని దాదీ ప్రకాశమణి 19వ పుణ్యతిథి సందర్భంగా బ్రహ్మాకుమారీస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాలూరులో మెగా రక్తదాన మహా శిబిరం నిర్వహించారు. బీకే రత్నకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 45 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. జీవనాధారంగా నిలుద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.2
- నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.1
- ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తునివాడ గ్రామ సమీపంలో తప్పిన ప్రమాదం రేగిడి మండలం తునివాడ గ్రామ సమీపంలో తప్పిన పెను ప్రమాదం.అదుపుతప్పి పొలాల్లోకి దూసుకు పోయిన పాలకొండ తమ్మినాయుడు కళాశాలకు చెందిన బస్సు. బస్సులో ఉన్న ఏడు మంది విద్యార్థులు ఏడు మందిలో పల్లి మిధున 9వ తరగతి విద్యార్థినికి గాయాలు మిగతా పిల్లలుసురక్షితం బస్సు కండిషన్ సరిగా లేదని గతంలోని యాజమాన్యానికి చెప్పానన్న బస్సు డ్రైవర్.ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు.1