*న్యూస్ విజన్: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ* అమరావతిలో దేశంలోనే తొలి ఓపెన్-యాక్సెస్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రపంచ క్వాంటం దినోత్సవం, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవ్వడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 'అమరావతి IS', మేధా టవర్స్లో 'అమరావతి 1Q' పేరిట ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు పరిశోధకులకు, విద్యార్థులకు, పారిశ్రామిక అవసరాలకు ఎంతగానో తోడ్పడతాయని వెల్లడించారు. ఐటీ రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన తెలుగు గడ్డ, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీకి వేదికగా మారడం గర్వకారణమని సీఎం కొనియాడారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్ ఎంత కీలకమో, ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటం సాంకేతికత అంత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. క్వాంటం రంగంలో సాధికారిత సాధించిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని, ఈ దిశగా అమరావతిని 'క్వాంటం వ్యాలీ'గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కేవలం 8 నెలల స్వల్ప కాలంలోనే ఈ ప్రాజెక్టును సాకారం చేయడం దేశ సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు సహకరిస్తున్న ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ (AQRF) దేశీయ క్వాంటం హార్డ్వేర్ పరీక్షలకు, సర్టిఫికేషన్కు కీలక కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
*న్యూస్ విజన్: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ* అమరావతిలో దేశంలోనే తొలి ఓపెన్-యాక్సెస్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రపంచ క్వాంటం దినోత్సవం, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవ్వడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 'అమరావతి IS', మేధా టవర్స్లో 'అమరావతి 1Q' పేరిట ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు పరిశోధకులకు, విద్యార్థులకు, పారిశ్రామిక అవసరాలకు ఎంతగానో తోడ్పడతాయని వెల్లడించారు. ఐటీ రంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన తెలుగు గడ్డ, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీకి వేదికగా మారడం గర్వకారణమని సీఎం కొనియాడారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్ ఎంత కీలకమో, ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటం సాంకేతికత అంత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. క్వాంటం రంగంలో సాధికారిత సాధించిన దేశాలే భవిష్యత్తును శాసిస్తాయని, ఈ దిశగా అమరావతిని 'క్వాంటం వ్యాలీ'గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కేవలం 8 నెలల స్వల్ప కాలంలోనే ఈ ప్రాజెక్టును సాకారం చేయడం దేశ సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు సహకరిస్తున్న ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు ఈ సందర్భంగా సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ (AQRF) దేశీయ క్వాంటం హార్డ్వేర్ పరీక్షలకు, సర్టిఫికేషన్కు కీలక కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- Post by Veesachandu1
- గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ *నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- Post by Paramesh Ratnagiri1
- భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించడం జరిగింది. #AmbedkarJayanti #StatueOfSocialJustice1