*ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఆదిలాబాదు నియోజకవర్గ శాసన సభ్యులు పాయల శంకర్* *మున్సిపల్ విలీన వార్డుల అభివృద్ధికి 30 కోట్లు: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్* పత్రిక ప్రకటన ఏప్రిల్ 16, 2026_ఆదిలాబాదు: *ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి: మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష* ప్రభుత్వం ఏదైనా అంతిమంగా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాదు నియోజకవర్గ శాసన సభ్యులు పాయల శంకర్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించిన మున్సిపల్ స్థాయి సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్ లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ముందుగా మున్సిపల్, వైద్య, పోలీస్ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని సమావేశంలో అధికారులు వివరించారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రుణాల చెక్కులను అతిథులు పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతాలు చేశారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న వ్యాపారాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా అంతిమంగా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయడానికి 99 రోజుల ప్రణాళిక చేపట్టడం జరిగిందని, అధికారులు ప్రజలవద్దకు వచ్చి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారన్నారు. దరఖాస్తుదారుల సమస్యలపై తీసుకున్న చర్యలపై లేఖల ద్వారా తెలియజేసేలా కొత్త నాందికి శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ వీలైన వార్డుల అభివృద్ధికి 30 కోట్లు కేటాయించడం జరిగిందని, పట్టణానికి శాశ్వత నీటి సమస్య పరిష్కారంతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం పటిష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గతంలో నీటి పంపింగ్లో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్లో భాగంగా లండ సాగ్రి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. వచ్చే ఏడాది అక్టోబర్ నుండి జనవరి లోపు ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, ఇది పూర్తయితే వేసవిలో కూడా పట్టణానికి పుష్కలంగా నీరు అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ కౌన్సిల్, అధికారులు మరిన్ని కొత్త ప్రాజెక్టులను గుర్తించి డిటైల్డ్ రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, మున్సిపాలిటీ యొక్క అంతర్గత వనరులను పెంచుకోవడం ద్వారా అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయవచ్చని తెలిపారు. జూన్ 2వ తేదీ నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ భరోసా బీమా' పథకాన్ని ప్రారంభించబోతుందని, దీని ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే 5 లక్షల రూపాయల బీమా అందుతుందని వివరించారు. అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, అర్హులైన వారికి పథకాలతోపాటు ఆయా శాఖల వారీగా చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా 99 రోజుల యాక్షన్ ప్లాన్ తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రతి శాఖకు వారం రోజుల సమయం కేటాయించి వారి నివేదికలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్, అదనపు కలెక్టర్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్, డీవైఎస్ఓ శ్రీనివాస్, సంక్షేమ అధికారి మిల్కా, ట్రాఫిక్ ఎస్సై దేవేందర్, తహసిల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్నపూర్ణ, స్వాతి, ధోని జ్యోతి, చరణ్ గౌడ్, మున్న జైస్వాల్, గంట జీవన్, విజయ్, ఆత్రం వేంకటేష్, నాగ్ సేన్, మహెబూబ్, సంజయ్, అంగన్వాడీలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
*ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఆదిలాబాదు నియోజకవర్గ శాసన సభ్యులు పాయల శంకర్* *మున్సిపల్ విలీన వార్డుల అభివృద్ధికి 30 కోట్లు: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్* పత్రిక ప్రకటన ఏప్రిల్ 16, 2026_ఆదిలాబాదు: *ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి: మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష* ప్రభుత్వం ఏదైనా అంతిమంగా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాదు నియోజకవర్గ శాసన సభ్యులు పాయల శంకర్ అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించిన మున్సిపల్ స్థాయి సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్ లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ముందుగా మున్సిపల్, వైద్య, పోలీస్ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని సమావేశంలో అధికారులు వివరించారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రుణాల
చెక్కులను అతిథులు పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతాలు చేశారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న వ్యాపారాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా అంతిమంగా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయడానికి 99 రోజుల ప్రణాళిక చేపట్టడం జరిగిందని, అధికారులు ప్రజలవద్దకు వచ్చి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారన్నారు. దరఖాస్తుదారుల సమస్యలపై తీసుకున్న చర్యలపై లేఖల ద్వారా తెలియజేసేలా కొత్త నాందికి శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ వీలైన వార్డుల అభివృద్ధికి 30 కోట్లు కేటాయించడం జరిగిందని, పట్టణానికి శాశ్వత నీటి సమస్య పరిష్కారంతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం పటిష్టమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గతంలో నీటి పంపింగ్లో ఎదురైన ఇబ్బందులను
దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్లో భాగంగా లండ సాగ్రి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. వచ్చే ఏడాది అక్టోబర్ నుండి జనవరి లోపు ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, ఇది పూర్తయితే వేసవిలో కూడా పట్టణానికి పుష్కలంగా నీరు అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ కౌన్సిల్, అధికారులు మరిన్ని కొత్త ప్రాజెక్టులను గుర్తించి డిటైల్డ్ రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, మున్సిపాలిటీ యొక్క అంతర్గత వనరులను పెంచుకోవడం ద్వారా అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయవచ్చని తెలిపారు. జూన్ 2వ తేదీ నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ భరోసా బీమా' పథకాన్ని ప్రారంభించబోతుందని, దీని ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తి చనిపోతే 5 లక్షల రూపాయల బీమా అందుతుందని వివరించారు. అదేవిధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలని
పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, అర్హులైన వారికి పథకాలతోపాటు ఆయా శాఖల వారీగా చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా 99 రోజుల యాక్షన్ ప్లాన్ తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రతి శాఖకు వారం రోజుల సమయం కేటాయించి వారి నివేదికలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్, అదనపు కలెక్టర్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్, డీవైఎస్ఓ శ్రీనివాస్, సంక్షేమ అధికారి మిల్కా, ట్రాఫిక్ ఎస్సై దేవేందర్, తహసిల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్నపూర్ణ, స్వాతి, ధోని జ్యోతి, చరణ్ గౌడ్, మున్న జైస్వాల్, గంట జీవన్, విజయ్, ఆత్రం వేంకటేష్, నాగ్ సేన్, మహెబూబ్, సంజయ్, అంగన్వాడీలు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు. అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.4
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.1
- పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.1
- Post by Vishwamber Rao1
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్ గీతా నగర్ చౌరస్తాలో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.1
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు అధికారులు ఏకకాలంలో పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జీఎస్టీ ఎగవేత, పాన్ కార్డుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిర్దేశించిన ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో లోపాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తుల జోక్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.4