Shuru
Apke Nagar Ki App…
పన్నెడలో విషాదం: ముగ్గురు చిన్నారుల మృతి, బాధిత కుటుంబాలకు పరామర్శ పన్నెడ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు మచ్చగడ్డలో మృతి చెందిన ఘటనపై ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొత్తగుడి భాగ్యలక్ష్మి గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. సెలవుల్లో పిల్లలు ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Rc Tv Telugu
పన్నెడలో విషాదం: ముగ్గురు చిన్నారుల మృతి, బాధిత కుటుంబాలకు పరామర్శ పన్నెడ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు మచ్చగడ్డలో మృతి చెందిన ఘటనపై ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొత్తగుడి భాగ్యలక్ష్మి గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. సెలవుల్లో పిల్లలు ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- my life money problems with your friends and family1
- డుంబ్రిగుడ, ఏప్రిల్ 14: మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, గ్రామస్తులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరాన్ని వివరించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా “అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం” అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- एक दर्दनाक हादसे में युवक की मौके पर ही मौत हो गई। ईंटों से भरी ट्रॉली अचानक पलट गई और वह उसकी चपेट में आ गया। बताया जा रहा है कि हादसा ट्रैक्टर का टायर टूटने की वजह से हुआ, जिससे संतुलन बिगड़ा और पूरी ट्रॉली युवक के ऊपर जा गिरी। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई। आसपास के लोगों ने तुरंत युवक को निकालने की कोशिश की, लेकिन तब तक उसकी मौत हो चुकी थी। घटना की सूचना मिलते ही पुलिस मौके पर पहुंची और शव को कब्जे में लेकर पोस्टमॉर्टम के लिए भेज दिया। फिलहाल पुलिस पूरे मामले की जांच कर रही है, वहीं इस हादसे से इलाके में शोक की लहर है।1
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు విజయనగరంలో ఘనంగా జరిగాయి. మంగళవారం స్థానిక బాలాజీ జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఇంచార్జి కలెక్టర్ సేధు మాధవన్, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్పర్సన్ పాలవలస యశస్వి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, మున్సిపల్ కమిషనర్ బాలాస్వామి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి ఎం.అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలోని రైట్ టు లివ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు స్పీచ్ వంటి ప్రాథమిక హక్కుల వల్ల సమాజంలో ప్రతి వర్గానికి, ప్రతి కులానికి సమానత్వం మరియు గౌరవం లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న వివక్షను మరెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు. నేడు వెనుకబడిన వర్గాల కుటుంబాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయంటే అది ఆయన కల్పించిన రాజ్యాంగ ఫలాలేనని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ప్రభుత్వం తరపున ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, భావితరాలకు ఆయన ఆశయాలను, గొప్పతనాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.1
- కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన 135వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో స్థానిక కూటమి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. స్థానిక గొల్ల అప్పారావు సెంటర్ లో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి,కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు దళిత నాయకులు పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా, వంగర, 14-04-2026. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని వంగర మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ. సురేష్ ముఖర్జీ, ఎంపీటీసీ ప్రతినిధి కనగల పారి నాయుడు, వంగర అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సత్యం మాస్టర్, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు వై.వాసు నాయుడు, మండల RTI విభాగం అధ్యక్షుడు దేవకివాడ దుర్గఅప్పల నాయుడు, వివేక్ మాస్టర్ మైండ్ ప్రిన్సిపాల్ బెవర ఈశ్వర రావు, గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీపీ యూ. సురేష్ ముఖర్జీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నాం.డాక్టర్ అంబేద్కర్ గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక ఆలోచన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను మన సమాజంలో స్థాపించడానికి ఆయన జీవితాంతం పోరాడారు.చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, ఆయన విద్యను ఆయుధంగా చేసుకుని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషి అపారమైనది.ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు మన దేశ భవిష్యత్తును నిర్మించాయి. అంబేద్కర్ గారు మనకు చెప్పిన ముఖ్యమైన సందేశం శిక్షణ పొందండి,సంఘటితమవండి,పోరాడండి.ఈ మాటలు ప్రతి ఒక్కరికీ ప్రేరణమనమందరం ఆయన ఆశయాలను అనుసరించి సమానత్వం, న్యాయం ఉన్న సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలి.చివరిగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి నా ఘన నివాళులు అర్పిస్తూ ఆ మహనీయునికి ఆశయ సాధనకై ఆయన ఆశయాలు సాధిద్దాం.2
- పిఠాపురం: రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.వారోత్సవాల ప్రారంభం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి అధికారులు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మీ సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న అగ్నిమాపక శాఖ, మంగళవారం నాడు స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ ప్రదర్శనను నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానాలను, ఆధునిక పరికరాల పనితీరును ప్రత్యక్షంగా చేసి చూపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పౌరుడికి కనీస అగ్నిమాపక శిక్షణ ఉండాలని, తద్వారా ప్రాణ,ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. అగ్ని నివారణ నియమాలను పాటించడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజానికి మేలు చేసిన వారవుతారని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ప్రదర్శనకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.1
- పిఠాపురం: రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ వంగా గీతా విశ్వనాధ్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు.ముందుగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పట్టణ పరిధిలో రదాలపేట అంబేద్కర్ సెంటర్, జీవన్ నగర్, జై భీమ్ నగర్ మరియు కత్తుల గూడెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ... సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, కులమతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఆయన ఆశయ సాధనే మా ప్రభుత్వ లక్ష్యం అని కొనియాడారు. విద్యా, వైద్యం, సామాజిక సాధికారత ద్వారా ప్రతి పేదవాడి చెంతకు రాజ్యాంగ ఫలాలు అందించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో కూడా సామాజిక న్యాయం అందించేందుకు మేమంతా నిరంతరం శ్రమిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,గండేపల్లి బాబి, వర్దినీడి సుజాత, సోమరౌతు ఆశలత, తలిశెట్టి వెంకటేశ్వరరావు, ఉలవల భూషణం, బత్తుల సాయి, సందక శ్యామ్, ముమ్మడి శ్రీను, నల్లమిల్లి పవన్ కుమార్,ఖండవల్లి లోవరాజు, చెల్లూరు లోవరాజు, ఆలీ, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1