పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతకు విద్యార్థుల కు ప్రత్యేక కార్యాచరణ సింగోటం జడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ అచ్చంపేట, జనవరి 09,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి):నాగర్కర్నూలు జిల్లా సింగోటం మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్ర వారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు,ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా బోధన విధానం, విద్యార్థుల హాజరు శాతం, పరీక్షల సన్నద్ధతపై సమగ్రంగా పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాస స్థాయిని పరీక్షించారు. బలహీన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించాలన్నారు. పరీక్షల ఫలితాల ఆధారంగా బోధన విధానంలో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. విద్యార్థుల హాజరు పెంచేందుకు తల్లిదండ్రులతో సమన్వయం పెంచాలని, వారిని పాఠశాల కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలని, తద్వారా ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య రెండూ సమానంగా ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతకు విద్యార్థుల కు ప్రత్యేక కార్యాచరణ సింగోటం జడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్ అచ్చంపేట, జనవరి 09,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి):నాగర్కర్నూలు జిల్లా సింగోటం మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్ర వారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు,ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా బోధన విధానం, విద్యార్థుల హాజరు శాతం, పరీక్షల సన్నద్ధతపై సమగ్రంగా పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాస స్థాయిని పరీక్షించారు. బలహీన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు
శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించాలన్నారు. పరీక్షల ఫలితాల ఆధారంగా బోధన విధానంలో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. విద్యార్థుల హాజరు పెంచేందుకు తల్లిదండ్రులతో సమన్వయం పెంచాలని, వారిని పాఠశాల కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలని, తద్వారా ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్య రెండూ సమానంగా ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- నల్గొండ జిల్లా : II తిరుమలగిరి సాగర్, నిడమానూర్ మండల కేంద్రంలో నీ మూడు వైన్స్ షాప్ లను అర్థంరాత్రి సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు... II అర్ధరాత్రి సమయంలో వైన్స్ షాప్ ను సీజ్ చేసే సమయంలో సీజ్ నీ నిరసిస్తూ ఎక్సైజ్ పోలీస్ వాహనానికి అడ్డు పడ్డ వైన్స్ షాప్ నిర్వాకుడు... అర్ధరాత్రి సమయంలో షాప్ సీజ్ చేయవలసిన అవసరం ఏంటి అర్థం కావట్లేదు అని అంటున్న వైన్స్ సామాన్యం... II తిరుమలగిరి సాగర్ లో సీజ్ చేసిన రెండు వైన్స్ షాప్ లకు ఎనిమిది లక్షల రూపాయలు ఫైన్ చెల్లించిన కక్ష పూరితంగా నా వైన్స్ షాప్ ల పై దాడులు చేస్తున్నారని వైన్స్ యజమాని విద్య సాగర్ రెడ్డి వెల్లడి..2
- Post by Paramesh Ratnagiri1
- - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.1
- हिमाचल प्रदेश के सिरमौर जिले के हरिपुरधार क्षेत्र में एक दर्दनाक सड़क हादसा सामने आया। एक प्राइवेट बस करीब 200 मीटर गहरी खाई में गिर गई, जिसमें 14 लोगों की मौत हो गई, जबकि 52 यात्री घायल हुए हैं। इनमें से 3 की हालत गंभीर बताई जा रही है, जिन्हें IGMC शिमला रेफर किया गया है। प्रशासन के अनुसार, 39 सीटर बस में 66 यात्री सवार थे, जिनमें महिलाएं और बच्चे भी शामिल थे। प्रारंभिक जानकारी के मुताबिक, बस के स्किड होने से हादसा हुआ हो सकता है, हालांकि हादसे के वास्तविक कारणों की जांच जारी है। हादसे की सूचना मिलते ही स्थानीय लोग, पुलिस, प्रशासन और स्वास्थ्य विभाग की टीमें मौके पर पहुंचीं और राहत व बचाव कार्य शुरू किया गया। कई घायलों को हरिपुरधार, राजगढ़ और नाहन के अस्पतालों में भर्ती कराया गया। इस हादसे पर प्रधानमंत्री नरेंद्र मोदी ने शोक व्यक्त करते हुए प्रधानमंत्री राष्ट्रीय राहत कोष (PMNRF) से आर्थिक सहायता की घोषणा की है। मृतकों के परिजनों को 2-2 लाख रुपये और घायलों को 50-50 हजार रुपये की सहायता दी जाएगी। प्रशासन ने भरोसा दिलाया है कि पीड़ित परिवारों को हरसंभव मदद दी जाएगी और मामले की मजिस्ट्रेट जांच करवाई जाएगी।1
- గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /* సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్ సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...4
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1