ఎపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ "ఛలో వాల్తేరు డిపో 'కార్యక్రమం గణతంత్ర దినోత్సవం రోజున ఎపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి పై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని జోనల్ కార్యదర్శి B.K.MURTY 'ఛలో వాల్తేరు డిపో 'కార్యక్రమం లో పిలుపు ఇచ్చారు.26/01/26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాల్తేరు డిపో నందు నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో ఎపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి D.S.BABU పై డిపో మేనేజర్, డిపో ఇతర అధికారులు మరియు ఉద్యోగులు అందరి ఆధ్వర్యంలో NMUA కార్యదర్శి R.వసంతరావు మరియు వారి సభ్యులు అసభ్యకరమైన పదజాలంతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. గతంలో పోస్టాఫీసు పాయింట్ లో డ్యూటీ లో లేని ఇద్దరు ఉద్యోగులు తిట్టుకున్నారని వారిని సస్పెండ్ చేసి ఇతర డిపోలకు పంపిన అధికారులు డిపో మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది, ఆ కార్యక్రమం నకు హాజరైన ఉద్యోగులు ఎదురుగా అసభ్యకరమైన.....కొడుకు మొదలగు పదజాలంతో దూషిస్తూ దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో యూనియన్ పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది.కావున ఈ సమస్యపై ఎపి పిటిడి ఎంప్లాయీస్ జోనల్ కార్యదర్శి కామ్రేడ్ బి.కె.మూర్తి, కామ్రేడ్ కె.ఎస్. రావు, కామ్రేడ్ కె.ఎస్. ఎస్. మూర్తి జోనల్కోశాధికారి, కామ్రేడ్ యుఎస్ నారాయణ జోనల్ సహాయ కార్యదర్శి, కామ్రేడ్ ఎమ్. ఎస్. రావు రీజనల్ అధ్యక్షులు, కామ్రేడ్ జి.తాతాలు రీజనల్ కార్యదర్శి, AITUC రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ఆధ్వర్యంలో ఛలో వాల్తేరు డిపో కార్యక్రమం నిర్వహించి గేట్ మీటింగ్ నిర్వహించడ మైనది.డిపో కార్యదర్శి D.S బాబు పై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని యెడల జిల్లా మరియు జోన్ వ్యాప్తంగా అవసరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుందని జోనల్ అధ్యక్ష కార్యదర్శులు ఈ గేట్ మీటింగ్ ద్వారా తెలియ చేసినారు.అక్రమ OD లు రద్దు చేయాలని, K.S.రావు Study సస్పెన్స్ ఎత్తి వేయాలని,ఒకే యూనియన్ కు కొమ్ము కాసే విధానము విడనాడాలని, డిపో మేనేజర్ పక్షపాత ధోరణి వీడనాడాలని నినాదించినారు.
ఎపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ "ఛలో వాల్తేరు డిపో 'కార్యక్రమం గణతంత్ర దినోత్సవం రోజున ఎపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి పై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని జోనల్ కార్యదర్శి B.K.MURTY 'ఛలో వాల్తేరు డిపో 'కార్యక్రమం లో పిలుపు ఇచ్చారు.26/01/26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాల్తేరు డిపో నందు నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో ఎపి పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి D.S.BABU పై డిపో మేనేజర్, డిపో ఇతర అధికారులు మరియు ఉద్యోగులు అందరి ఆధ్వర్యంలో NMUA కార్యదర్శి R.వసంతరావు మరియు వారి సభ్యులు అసభ్యకరమైన పదజాలంతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. గతంలో పోస్టాఫీసు పాయింట్ లో డ్యూటీ లో లేని ఇద్దరు ఉద్యోగులు తిట్టుకున్నారని వారిని సస్పెండ్ చేసి ఇతర డిపోలకు పంపిన అధికారులు డిపో మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది, ఆ కార్యక్రమం నకు హాజరైన ఉద్యోగులు ఎదురుగా అసభ్యకరమైన.....కొడుకు మొదలగు పదజాలంతో దూషిస్తూ దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో యూనియన్ పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది.కావున ఈ సమస్యపై ఎపి పిటిడి ఎంప్లాయీస్ జోనల్ కార్యదర్శి కామ్రేడ్ బి.కె.మూర్తి, కామ్రేడ్ కె.ఎస్. రావు, కామ్రేడ్ కె.ఎస్. ఎస్. మూర్తి జోనల్కోశాధికారి, కామ్రేడ్ యుఎస్ నారాయణ జోనల్ సహాయ కార్యదర్శి, కామ్రేడ్ ఎమ్. ఎస్. రావు రీజనల్ అధ్యక్షులు, కామ్రేడ్ జి.తాతాలు రీజనల్ కార్యదర్శి, AITUC రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ఆధ్వర్యంలో ఛలో వాల్తేరు డిపో కార్యక్రమం నిర్వహించి గేట్ మీటింగ్ నిర్వహించడ మైనది.డిపో కార్యదర్శి D.S బాబు పై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని యెడల జిల్లా మరియు జోన్ వ్యాప్తంగా అవసరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుందని జోనల్ అధ్యక్ష కార్యదర్శులు ఈ గేట్ మీటింగ్ ద్వారా తెలియ చేసినారు.అక్రమ OD లు రద్దు చేయాలని, K.S.రావు Study సస్పెన్స్ ఎత్తి వేయాలని,ఒకే యూనియన్ కు కొమ్ము కాసే విధానము విడనాడాలని, డిపో మేనేజర్ పక్షపాత ధోరణి వీడనాడాలని నినాదించినారు.
- విజయనగరం జిల్లా రామభద్రపురంలోని టి.బి.ఆర్ థియేటర్ సమీపంలో బుధవారం బస్సు–లారీ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారికి సహాయం చేశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...2
- అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీకి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. 2020లో తండ్రి మరణించగా, 2025లో తల్లి కూడా చనిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎవరూ ఆదుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గోమంగి అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. తమ పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసిన అక్కాచెల్లెళ్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించి జీవనోపాధి కల్పించాలని కోరారు.1
- పెదబయలు మండలంలోని గల్లెల, గోమంగి, కిముడుపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించేలా ప్రత్యేకంగా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ రామారావు దొర మాట్లాడుతూ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆదివాసీలకు పూర్తిగా అమలు కావాలని, స్థానికులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు1
- Post by Shyam1
- 83746060591
- ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर1
- *50శాతం అపరాధ రుసుము సబ్సిడీ తో మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం* *ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్.శివారెడ్డి* విజయనగరం, మార్చి 11: రాష్ట్రం లో 500 చదరపు మీటర్లు లేదా 8 అపార్ట్మెంట్ కంటే ఎక్కువగా కలిగిన ప్రతి హోసింగ్ ప్రోజెక్ట్ ఎ పి రెరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్.శివారెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదారుల హక్కుల పరిరక్షణను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (APRERA) ఆధ్వర్యంలో రెరా చట్టం, 2016 నిబంధనలు, వాటి అమలు విధానం పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం హోటల్ ఎస్విఎన్ లేక్ ప్యాలస్ లో నిర్వహించారు. అవగాహన సదస్సు కు విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన రియల్ ఎస్టేట్ రంగ ప్రమోటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు గృహ కొనుగోలుదారులు హాజరయ్యారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏపీ రెరా చైర్మన్ ఆర్. ఎస్. శివారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం తరువాత అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఆర్ధిక రంగం నిర్మాణరంగమని తెలిపారు. నిర్మాణదారులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు రాకుండా, కొనుగోలుదారుల సంక్షేమమే అంతిమలక్ష్యంగా రేరా అథారిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అయన తెలిపారు. రేరా చట్టం పై ప్రజలకు, నిర్మాణదారులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 13 పాత జిల్లాలలో అవగాహన కార్యక్రమంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో నిర్మాణరంగం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. నిర్మాణరంగం అభివృద్ధికి, కొనుగోలుదారుల రక్షణ, సంక్షేమానికి రెరా చట్టం రూపొందించడం జరిగిందని అన్నారు. 500 చదరపు మీటర్లు విస్తీర్ణం లేదా ఎనిమిది అపార్ట్మెంట్లు పైబడిన ప్రతి ప్రాజెక్టు రేరా అథారిటీ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రేరా వద్ద రిజిస్ట్రేషన్ పొందని ప్రాజెక్టులపై ప్రాజెక్ట్ వ్యయంలో పది శాతం అపరాధం రుసుము విధించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోని ప్రాజెక్టులకు మార్చి 31 వరకు యాబది శాతం అపరాధ రుసుము సబ్సిడీతో రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్మాణ రంగంలో వచ్చే సమస్యలు, ఫిర్యాదులు రేరా అథారిటీ ద్వారా మాత్రమే పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. నిర్మాణదారులు తాము చేపడుతున్న ప్రాజెక్టులలో వాస్తవంగా కల్పిస్తున్న సౌకర్యాలను మాత్రమే వినియోగదారులకు తెలియజేయాలని, అగ్రిమెంట్లో పొందుపరచుకోవాలని తెలిపారు. అగ్రిమెంట్లో పొందుపరిచిన విధంగా ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా, వసతులు కల్పించకపోయిన పోయినా ఫిర్యాదుల మేరకు రేరా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రెరా చట్టంపై నిర్మాణదారులు, కొనుగోలుదారులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రాజెక్టులు చేపట్టుటకు రిజిస్ట్రేషన్, త్రైమాసిక నివేదికలు సమర్పణ, ప్రాజెక్టు పూర్తయిన పిదప అపార్ట్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి వారికి అప్పగించడం ద్వారా రేరా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అపార్ట్మెంట్ అప్పగించిన ఐదు సంవత్సరాల వరకు ఒప్పందం అమలులో ఉంటుందని తెలిపారు. 10 శాతం మార్టిగేజ్ స్థలం విడిపించుకోవాలన్నా, ప్రాజెక్టుకు బ్యాంకు రుణం పొందాలన్నా రేరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ తో పాటు రెరా అసిస్టెంట్ డైరెక్టర్ జివిజిఎస్ వరప్రసాద్, సభ్యులు రాజశేఖర్ రెడ్డి, కామేశ్వరరావు, శివారెడ్డి, వెంకటరత్నం, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, జె. కులదీప్ రెరా చట్టం–2016లోని ముఖ్య నిబంధనలు, ప్రాజెక్టుల నమోదు విధానం, సమయపాలన, ఆర్థిక పారదర్శకత, వినియోగదారుల హక్కులు మరియు బాధ్యతలు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. ప్రతినిధుల సందేహాలకు సమాధానాలు తెలిపారు.1
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- 🙏😭1