logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సత్తుపల్లి అభివృద్ధికి నిధులు ఇవ్వండి అజారుద్దీన్ ని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ రెహనా కమల్ మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలుపొందిన మున్సిపాలిటీ చైర్ పర్సన్ రెహనా కమల్ సోమవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రి మాజీ క్రికెటర్, మహమ్మద్ అజారుద్దీన్ ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి అభివృద్ధికి మైనారిటీ సంక్షేమ శాఖ నుండి నిధులు కావాలని, షాది ఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అభివృద్ధికి మీ సహాయ,సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆయనకు వివరించారు. తెలియజేసిన సమస్యలను సానుకూలంగా స్పందించి, అభివృద్ధికి కచ్చితంగా తోడ్పడతానని హామీ ఇచ్చారు.

1 hr ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago
e7ce07a2-ac85-4ecd-856b-cd4509458b34

సత్తుపల్లి అభివృద్ధికి నిధులు ఇవ్వండి అజారుద్దీన్ ని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ రెహనా కమల్ మున్సిపాలిటీ ఎలక్షన్లో గెలుపొందిన మున్సిపాలిటీ చైర్ పర్సన్ రెహనా కమల్ సోమవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రి మాజీ క్రికెటర్, మహమ్మద్ అజారుద్దీన్ ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి అభివృద్ధికి మైనారిటీ సంక్షేమ శాఖ నుండి నిధులు కావాలని, షాది ఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అభివృద్ధికి మీ సహాయ,సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆయనకు వివరించారు. తెలియజేసిన సమస్యలను సానుకూలంగా స్పందించి, అభివృద్ధికి కచ్చితంగా తోడ్పడతానని హామీ ఇచ్చారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨............. 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨 *డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు* *🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం* 🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్‌.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్‌.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు, మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు. నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది. 👉 ప్రజలకు సూచన: బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. –కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు
    1
    🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨.............

🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨
*డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు*
*🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం*
🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37  క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి
విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్‌.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్‌.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు.
సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు,  మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు.
నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది.
👉 ప్రజలకు సూచన:
బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు.
–కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు
    user_Ravi Reporter
    Ravi Reporter
    Local News Reporter తిరువూరు, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    52 min ago
  • బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.

పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు.

తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం లో మైనర్ బాలికపైన అత్యాచారానికి పాల్పడిన బండి సాయి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి : ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ
    1
    ఖమ్మం లో మైనర్ బాలికపైన అత్యాచారానికి పాల్పడిన బండి సాయి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి : ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    37 min ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    user_Shivaram
    Shivaram
    Apprenticeship Centre బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    1
    ఐపీఎల్ 2024 లో నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ, సీఎస్‌కే వర్సెస్ ఎల్‌ఎస్‌జీ జట్లు తలపడ్డాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలతో పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
    user_Jayateja
    Jayateja
    Hotel Vijayawada (Rural), Ntr•
    9 hrs ago
  • ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి, శాఖల వారీగా అందిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తూ నివేదిక సమర్పించాలి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సోమవారం *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,* సంబంధిత అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం, ఇతర వేదికల ద్వారా ప్రజల సమస్య పరిష్కారం నిమిత్తం సామాన్య ప్రజలు చేసుకున్న ప్రతి ఒక దరఖాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తక్షణమే పరిష్కరించి నివేదికను తమకు సమర్పించాలని, తమ పరిధిలో లేని పక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం తో పాటు తొర్రూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు, అట్టి దరఖాస్తుల పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రజావాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేష్ మహబూబాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రజావాణి ప్రక్రియ యాప్ విధానాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ ను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు, ఈ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రెవెన్యూ విభాగానికి చెందినవి 58, పంచాయతీరాజ్ 14, డిఆర్డిఓ 12, హౌసింగ్, డబుల్ బెడ్ రూమ్ 24, మున్సిపల్ 9, మొత్తం అన్ని విభాగాలు కలిపి (133) దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో (9) దరఖాస్తులు వచ్చాయని ఆర్డీవో క్రిష్ణవేణి తెలిపారు, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ( 14 ) దరఖాస్తులు వచ్చాయని ఆర్డిఓ గణేష్ తెలిపారు, ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, అందువలన ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ తెవలు అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, జడ్పీ సీఈవో (హౌసింగ్ పీడీ) పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
    1
    ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి,
శాఖల వారీగా అందిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తూ నివేదిక సమర్పించాలి,
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,
సోమవారం *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,* సంబంధిత అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం, ఇతర వేదికల ద్వారా ప్రజల సమస్య పరిష్కారం నిమిత్తం సామాన్య ప్రజలు చేసుకున్న ప్రతి ఒక దరఖాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తక్షణమే పరిష్కరించి నివేదికను తమకు సమర్పించాలని, తమ పరిధిలో లేని పక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు,
ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం తో పాటు 
తొర్రూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు, 
అట్టి దరఖాస్తుల పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు, 
హైదరాబాద్ నుండి వచ్చిన ప్రజావాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేష్ మహబూబాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రజావాణి ప్రక్రియ యాప్ విధానాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ ను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు,
ఈ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రెవెన్యూ విభాగానికి చెందినవి 58, పంచాయతీరాజ్ 14, డిఆర్డిఓ 12, హౌసింగ్, డబుల్ బెడ్ రూమ్ 24, మున్సిపల్ 9, మొత్తం అన్ని విభాగాలు కలిపి (133) దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు, 
మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో (9) దరఖాస్తులు వచ్చాయని ఆర్డీవో క్రిష్ణవేణి తెలిపారు, 
తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ( 14 )  దరఖాస్తులు వచ్చాయని ఆర్డిఓ గణేష్ తెలిపారు, 
ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, అందువలన ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ తెవలు అందించాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, జడ్పీ సీఈవో (హౌసింగ్ పీడీ) పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    35 min ago
  • ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
    1
    ఖమ్మం లో బండి భగీరథ్ను కఠినంగా శిక్షించాలి : BRS నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    57 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.