షోషల్ మీడియా రాష్ట్ర ఉత్తమ హస్యనటుడుగా పల్లె రాములు.... కళాసేవకు గుర్తింపుగా పల్లె రాములుకు దక్కిన గౌరవం.. నర్సంపేట,మర్చి 09, కళాసేవను నమ్ముకుని వివిధ కార్యక్రమాలు చేపట్టిన పల్లె రాములు అందుకు గుర్తింపుగా అరుదైన గౌరవం దక్కింది.కళారంగంలో తనకంటు ఓ ప్రత్యేగ గుర్తింపును సంపాదించుకుని, తెలంగాణ యాస బాషలతో తనదైన పద్దతిలో పల్లే బతుకులను ప్రపంచానికి చాటిచెప్పుతున్న, పల్లె రాములు తెలంగాణ రాష్ట్ర షోషల్ మీడియా ఉత్తమ హస్యనటుడుగా ఎంపియ్యారు.ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచే విషయాలను తనదైన పద్దతిలో వ్యంగ్యంగ వివరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకన్నారు పల్లే రాములు. పల్లే రాములు యూట్యూబ్ చానల్ పేరుతో తను తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ పల్లేల్లోని జీవన విదానాలు, పద్దతులను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంటారు..ఇది గుర్తించిన శ్రీ వివేకానంద సేవా సమితి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో భాగంగ పల్లె రాములుకు ఈ అవార్డును ఇస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్బంగా పల్లే రాములు మాట్లాడుతూ... ఇలాంటి సత్కారాలకు, నా పేరు ప్రతిష్టలకు కారణం తనను అభిమానిస్తున్న తెలుగు ప్రజల అభిమానమే అని అన్నారు.ఈ అవార్డుతో నాకు మరింత బాద్యత పెరిగిందని తెలిపారు. ఇందుకోసం నా వీడియోలు చూస్తున్న ప్రతీ ఒక్కరినీ సాద్యమైనంత వరకు నవ్విస్తూనే ఉంటానని అవార్డు గ్రహీత పల్లె రాములు చెప్పారు.
షోషల్ మీడియా రాష్ట్ర ఉత్తమ హస్యనటుడుగా పల్లె రాములు.... కళాసేవకు గుర్తింపుగా పల్లె రాములుకు దక్కిన గౌరవం.. నర్సంపేట,మర్చి 09, కళాసేవను నమ్ముకుని వివిధ కార్యక్రమాలు చేపట్టిన పల్లె రాములు అందుకు గుర్తింపుగా అరుదైన గౌరవం దక్కింది.కళారంగంలో తనకంటు ఓ ప్రత్యేగ గుర్తింపును సంపాదించుకుని, తెలంగాణ యాస బాషలతో తనదైన పద్దతిలో పల్లే బతుకులను ప్రపంచానికి చాటిచెప్పుతున్న, పల్లె రాములు తెలంగాణ రాష్ట్ర షోషల్ మీడియా ఉత్తమ హస్యనటుడుగా ఎంపియ్యారు.ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరిచే విషయాలను తనదైన పద్దతిలో వ్యంగ్యంగ వివరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకన్నారు పల్లే రాములు. పల్లే రాములు యూట్యూబ్ చానల్ పేరుతో తను తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ పల్లేల్లోని జీవన విదానాలు, పద్దతులను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంటారు..ఇది గుర్తించిన శ్రీ వివేకానంద సేవా సమితి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో భాగంగ పల్లె రాములుకు ఈ అవార్డును ఇస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సందర్బంగా పల్లే రాములు మాట్లాడుతూ... ఇలాంటి సత్కారాలకు, నా పేరు ప్రతిష్టలకు కారణం తనను అభిమానిస్తున్న తెలుగు ప్రజల అభిమానమే అని అన్నారు.ఈ అవార్డుతో నాకు మరింత బాద్యత పెరిగిందని తెలిపారు. ఇందుకోసం నా వీడియోలు చూస్తున్న ప్రతీ ఒక్కరినీ సాద్యమైనంత వరకు నవ్విస్తూనే ఉంటానని అవార్డు గ్రహీత పల్లె రాములు చెప్పారు.
- వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.1
- వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.3
- *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.1
- Shabbir Arts 81216816861
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- ములుగు జిల్లా: గోవిందరావుపేట మండలం దుంపల్లిగూడెం సమీపంలో శ్మశానవాటిక ప్రాంతంలో రైతులు భారీ కొండచిలువను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పామును చాకచక్యంగా పట్టి సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ దీప్తోల్, అర్జున్, లక్ష్మీనారాయణ, కిరణ్, రాజేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.1