logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తమ ఓటు ఉండాలంటే ఎస్ఐఆర్ చేసుకోవాల్సిందే లేకుంటే ఓటు హక్కు పోయే ప్రమాదం ఉంది* కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు మరియు సవరణల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను (హెల్ప్ డెస్క్‌లను) ఏర్పాటు చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలో నీ చింతకుంటలో లోని శాంతినగర్ చౌరస్తా వద్ద బి.అర్.ఎస్ ఏర్పాటు చేసిన ఎస్.ఐ.ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) సహాయ కేంద్రాలను మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ లతో కలిసి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే వీటి ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మరియు బి.ఎల్.ఓ ల సమన్వయ లోపం వల్ల నగరంలో ఇప్పటివరకు కేవలం 14 శాతం మాత్రమే ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. జూలై 24 లోపు మిగిలిన ప్రక్రియను ముగించాల్సి ఉందని... ఆన్‌లైన్ సర్వర్లు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే బీఆర్‌ఎస్ పార్టీ స్వయంగా రంగంలోకి దిగి, 10 కేంద్రాల ద్వారా ప్రజలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉచిత సేవలు అందిస్తోందని.ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో.. మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్, 14 డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ కుమార్, మాజీ కొత్తపెళ్లి మండల యూత్ అధ్యక్షులు గుర్రాల జయప్రకాశ్ రెడ్డి,మైనార్టీ విభాగం మండల అధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా,బిఆర్ఎస్ పార్టీ బి ఎల్ ఓ లు నజీమా బేగం, సోమిరెడ్డి లచ్చిరెడ్డి, కమల్ గౌడ్, శిధర్, కిట్టు, బెజ్జంకి,సంపత్ నాగరాజు,పరశురాములు,వంకాయల రాజు, శ్రీనివాస్ రెడ్డి, చిట్టి పెళ్లి నరేందర్, సయ్యద్ అన్వర్ పాషా సలీం సుజాత, రవినేతి రవివర్మ, మిడి దొడ్డి నవీన్,పబ్బతి శ్రీనివాస్ రెడ్డి,. ఆయా డివిజన్ల కు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Shankerreddy
Shankerreddy
కొత్తపల్లి, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago
66423e14-a77e-412e-9618-1dbd2779bea9

తమ ఓటు ఉండాలంటే ఎస్ఐఆర్ చేసుకోవాల్సిందే లేకుంటే ఓటు హక్కు పోయే ప్రమాదం ఉంది* కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు మరియు సవరణల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను (హెల్ప్ డెస్క్‌లను) ఏర్పాటు చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలో నీ చింతకుంటలో లోని శాంతినగర్ చౌరస్తా వద్ద బి.అర్.ఎస్ ఏర్పాటు చేసిన ఎస్.ఐ.ఆర్ (ప్రత్యేక ఓటర్ సవరణ) సహాయ కేంద్రాలను మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ లతో కలిసి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే వీటి ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం మరియు బి.ఎల్.ఓ ల సమన్వయ లోపం వల్ల నగరంలో ఇప్పటివరకు కేవలం 14 శాతం మాత్రమే ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. జూలై 24 లోపు మిగిలిన ప్రక్రియను ముగించాల్సి ఉందని... ఆన్‌లైన్ సర్వర్లు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందుకే బీఆర్‌ఎస్ పార్టీ స్వయంగా రంగంలోకి దిగి, 10 కేంద్రాల ద్వారా ప్రజలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను పూర్తి చేసేందుకు ఉచిత సేవలు అందిస్తోందని.ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో.. మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్, 14 డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ కుమార్, మాజీ కొత్తపెళ్లి మండల యూత్ అధ్యక్షులు గుర్రాల జయప్రకాశ్ రెడ్డి,మైనార్టీ విభాగం మండల అధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా,బిఆర్ఎస్ పార్టీ బి ఎల్ ఓ లు నజీమా బేగం, సోమిరెడ్డి లచ్చిరెడ్డి, కమల్ గౌడ్, శిధర్, కిట్టు, బెజ్జంకి,సంపత్ నాగరాజు,పరశురాములు,వంకాయల రాజు, శ్రీనివాస్ రెడ్డి, చిట్టి పెళ్లి నరేందర్, సయ్యద్ అన్వర్ పాషా సలీం సుజాత, రవినేతి రవివర్మ, మిడి దొడ్డి నవీన్,పబ్బతి శ్రీనివాస్ రెడ్డి,. ఆయా డివిజన్ల కు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నిర్వహించబోయే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని మాజీమంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్‌ను కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే గంగుల నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • ఎల్కతుర్తి మండల కేంద్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ తన అంకితభావం, నిబద్ధత, నిరంతర పోరాట పటిమతో బీజేపీ జాతీయ స్థాయి కీలక నాయకుడిగా ఎదిగి, కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బండి సంజయ్ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందుంటామని స్పష్టం చేశారు. బండి సంజయ్ అండదండలతో ఎల్కతుర్తి మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేస్తామని తెలిపారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, కార్యకర్తలు మరియు ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, మండల బాధ్యులు, జిల్లా నాయకులు పాల్గొని బండి సంజయ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
    1
    ఎల్కతుర్తి మండల కేంద్రంలో కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ, ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ తన అంకితభావం, నిబద్ధత, నిరంతర పోరాట పటిమతో బీజేపీ జాతీయ స్థాయి కీలక నాయకుడిగా ఎదిగి, కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బండి సంజయ్ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందుంటామని స్పష్టం చేశారు. బండి సంజయ్ అండదండలతో ఎల్కతుర్తి మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేస్తామని తెలిపారు.

వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, కార్యకర్తలు మరియు ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, మండల బాధ్యులు, జిల్లా నాయకులు పాల్గొని బండి సంజయ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
    user_Mahesh Chary
    Mahesh Chary
    Photographer Husnabad, Siddipet•
    1 day ago
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఉపసర్పంచ్ ధూమాల మహేష్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు గ్రామ సర్పంచ్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే, వాటిని ప్రజల ముందు ఉంచాలని ఆయన సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని ఆయన హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా ధూమాల మహేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి వేణు, లింగాల వెంకటేష్, దొంతరవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
    1
    సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఉపసర్పంచ్ ధూమాల మహేష్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు గ్రామ సర్పంచ్‌పై ఎలాంటి ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే, వాటిని ప్రజల ముందు ఉంచాలని ఆయన సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని ఆయన హితవు పలికారు.

రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి సహకరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా ధూమాల మహేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ బండి వేణు, లింగాల వెంకటేష్, దొంతరవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • హనుమకొండ పరిధిలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డిని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి రామల సునీత మరియు ఆలయ ప్రధాన అర్చకులు గౌరవశ్రీ శేషు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. జూలై 15 నుండి 29 వరకు ఆలయంలో వైభవంగా జరగనున్న శాకాంబరి నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ వారు ఎమ్మెల్యేకు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేసి, అమ్మవారి ప్రసాదాన్ని అందించి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం, తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాకాంబరి నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందాలని వారు కోరారు.
    1
    హనుమకొండ పరిధిలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డిని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి రామల సునీత మరియు ఆలయ ప్రధాన అర్చకులు గౌరవశ్రీ శేషు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. జూలై 15 నుండి 29 వరకు ఆలయంలో వైభవంగా జరగనున్న శాకాంబరి నవరాత్రి మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ వారు ఎమ్మెల్యేకు అధికారిక ఆహ్వాన పత్రికను అందజేసి, అమ్మవారి ప్రసాదాన్ని అందించి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం, తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వైద్య సదుపాయాలు తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాకాంబరి నవరాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కృపాకటాక్షాలు పొందాలని వారు కోరారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    హనుమకొండ, హనుమకొండ, తెలంగాణ•
    10 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి ఎల్. రమాదేవి క్షేత్రస్థాయిలో ఆలయ ప్రాంగణాన్ని మరియు లోపలి పలు విభాగాలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని టెంకాయలు కొట్టే ప్రాంతాన్ని పరిశీలించిన ఈవో, అక్కడ భక్తుల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. టెంకాయలు కొట్టేందుకు లేదా ఇతర సేవల పేరుతో ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే విధుల్లో ఉన్న అధికారులకు లేదా దేవస్థానం కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ఆలయ మైక్ ద్వారా భక్తులకు సూచించారు. అలాగే కోడె మొక్కులు చెల్లించే భక్తులకు టెండర్‌దారులు విక్రయిస్తున్న పచ్చిగడ్డి, అరటిపండ్ల నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన వస్తువులే అందించాలని ఆదేశించారు. దీపారాధన చేసే ప్రాంతాన్ని సందర్శించి, భక్తులు వెలిగించే దీపాల కోసం సహజమైన నెయ్యిని మాత్రమే వినియోగించేలా చూడాలని, ప్లాస్టిక్ లేదా రసాయన పదార్థాలు కలిగిన వస్తువులను ఉపయోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో భాగంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లతో పాటు భక్తులు టికెట్లు పొందుతున్న విధానాన్ని పరిశీలించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలపై స్వయంగా భక్తులను అడిగి తెలుసుకుని, అవసరమైన చోట మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు పారదర్శకమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే దేవస్థానం లక్ష్యమని ఈవో ఎల్. రమాదేవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ పరిశీలకులు వంశీ మోహన్, ఇతర ఆలయ అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి ఎల్. రమాదేవి క్షేత్రస్థాయిలో ఆలయ ప్రాంగణాన్ని మరియు లోపలి పలు విభాగాలను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆలయ ప్రాంగణంలోని టెంకాయలు కొట్టే ప్రాంతాన్ని పరిశీలించిన ఈవో, అక్కడ భక్తుల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అనే విషయాన్ని ఆరా తీశారు. టెంకాయలు కొట్టేందుకు లేదా ఇతర సేవల పేరుతో ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే విధుల్లో ఉన్న అధికారులకు లేదా దేవస్థానం కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని ఆలయ మైక్ ద్వారా భక్తులకు సూచించారు. అలాగే కోడె మొక్కులు చెల్లించే భక్తులకు టెండర్‌దారులు విక్రయిస్తున్న పచ్చిగడ్డి, అరటిపండ్ల నాణ్యతను పరిశీలించి, నాణ్యమైన వస్తువులే అందించాలని ఆదేశించారు. దీపారాధన చేసే ప్రాంతాన్ని సందర్శించి, భక్తులు వెలిగించే దీపాల కోసం సహజమైన నెయ్యిని మాత్రమే వినియోగించేలా చూడాలని, ప్లాస్టిక్ లేదా రసాయన పదార్థాలు కలిగిన వస్తువులను ఉపయోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

ఈ పరిశీలనలో భాగంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లతో పాటు భక్తులు టికెట్లు పొందుతున్న విధానాన్ని పరిశీలించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలపై స్వయంగా భక్తులను అడిగి తెలుసుకుని, అవసరమైన చోట మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు పారదర్శకమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే దేవస్థానం లక్ష్యమని ఈవో ఎల్. రమాదేవి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ పరిశీలకులు వంశీ మోహన్, ఇతర ఆలయ అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 min ago
  • జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.
    1
    జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం జరగనున్న కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా వివరాలు వెల్లడించారు.

జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తామే పోరాటం చేశామని కొందరు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి స్థానిక ఎంపీ కృషి చేయాలని, అలాగే విద్యార్థులకు రెగ్యులర్ సిబ్బందితో బోధన సాగేలా చొరవ చూపాలని ఆయన కోరారు. అభివృద్ధి పనుల విషయంలో తనకు ఎలాంటి భేషజాలు లేవని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీతో కలిసి పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధికి శ్రమిస్తానని, రేపటి భూమి పూజ కార్యక్రమం గురించి ఇప్పటికే వారితో మాట్లాడడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పెద్దపట్నం అగ్నిగుండాల వేడుకలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మొదటిరోజు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండప స్థాపన, శ్రీ విఘ్నేశ్వరారాధనతో ఈ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఈరోజు రాత్రి అత్యంత వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 13వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు భక్తులు అగ్నిగుండం దాటనున్నారు. అనంతరం వారికి స్వామివారి దక్షిణద్వార కటాక్ష దర్శనం కల్పించనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈఓ సదయ్య తెలిపారు. కాకతీయుల కాలం నాటి ఈ పుణ్యక్షేత్రంలో ఆదివారం రోజున మల్లన్న దేవుడికి బోనాలు సమర్పించడం ఎంతో ప్రత్యేకమని, ఆ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలయ పూజారి వీరభద్రయ్య పేర్కొన్నారు.
    2
    పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పెద్దపట్నం అగ్నిగుండాల వేడుకలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మొదటిరోజు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండప స్థాపన, శ్రీ విఘ్నేశ్వరారాధనతో ఈ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఈరోజు రాత్రి అత్యంత వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా 13వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు భక్తులు అగ్నిగుండం దాటనున్నారు. అనంతరం వారికి స్వామివారి దక్షిణద్వార కటాక్ష దర్శనం కల్పించనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈఓ సదయ్య తెలిపారు. కాకతీయుల కాలం నాటి ఈ పుణ్యక్షేత్రంలో ఆదివారం రోజున మల్లన్న దేవుడికి బోనాలు సమర్పించడం ఎంతో ప్రత్యేకమని, ఆ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలయ పూజారి వీరభద్రయ్య పేర్కొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 15న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరగనుంది. ఆదివారం రోజున సిపిఎం జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రాభవన్లో ఈ మహా ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగులు మరియు యువత వేలాదిగా తరలివచ్చి ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై వాసుదేవరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్, 12 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రశ్నించే యువతకు పకోడీలు, బజ్జీలు వేయడం కూడా ఉద్యోగమేనంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖల్లో దాదాపు 10 లక్షల పోస్టులు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఐటీలు వంటి ఉన్నత విద్యా సంస్థల్లో సుమారు 37 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేట్ సెక్టార్‌కు అప్పగిస్తూ ఉద్యోగాలను కుదించేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేసిందని వాసుదేవరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు గడుస్తున్నా కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని దుయ్యబట్టారు. 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు గానూ కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని, జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, స్వయం ఉపాధి రుణాలకు నిధులు మంజూరు చేయకుండా రాజీవ్ యువ వికాసం పథకాన్ని పక్కనబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏటా 9 వేల మంది పదవీ విరమణ పొందుతున్నారని, ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, డీఎస్సీ, జెఎల్, డిఎల్, గ్రూప్ 1, 2, 3, 4లతో పాటు అన్ని శాఖల్లోని ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నెలకు ₹5,000 నిరుద్యోగ భృతి అందించాలని, వివాదాస్పద జీవోలను తొలగించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, జి రాజేశం, నాయకులు రాయి కంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, మాతంగి శంకర్, చల్ల లక్ష్మణ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    2
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 15న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహా ధర్నా జరగనుంది. ఆదివారం రోజున సిపిఎం జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రాభవన్లో ఈ మహా ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, నిరుద్యోగులు మరియు యువత వేలాదిగా తరలివచ్చి ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై వాసుదేవరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీతో 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్, 12 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రశ్నించే యువతకు పకోడీలు, బజ్జీలు వేయడం కూడా ఉద్యోగమేనంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖల్లో దాదాపు 10 లక్షల పోస్టులు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఐటీలు వంటి ఉన్నత విద్యా సంస్థల్లో సుమారు 37 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేట్ సెక్టార్‌కు అప్పగిస్తూ ఉద్యోగాలను కుదించేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేసిందని వాసుదేవరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు గడుస్తున్నా కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని దుయ్యబట్టారు. 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు గానూ కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని, జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, స్వయం ఉపాధి రుణాలకు నిధులు మంజూరు చేయకుండా రాజీవ్ యువ వికాసం పథకాన్ని పక్కనబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏటా 9 వేల మంది పదవీ విరమణ పొందుతున్నారని, ప్రస్తుతం రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, డీఎస్సీ, జెఎల్, డిఎల్, గ్రూప్ 1, 2, 3, 4లతో పాటు అన్ని శాఖల్లోని ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నెలకు ₹5,000 నిరుద్యోగ భృతి అందించాలని, వివాదాస్పద జీవోలను తొలగించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, జి రాజేశం, నాయకులు రాయి కంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, మాతంగి శంకర్, చల్ల లక్ష్మణ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీళ్లు అడిగే తమ బీఆర్ఎస్ నేతలపై కక్ష పెంచుకొని, రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడి తన హోదాను మర్చిపోయారని చల్మెడ విమర్శించారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని నిన్నటి ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ప్రశ్నించగా, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటను తడుపుతానని సీఎం సమాధానం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే, మమ్మల్ని కోసి మా రక్తం పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి భాషనేనా అంటూ నిలదీశారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. నీళ్లు అడిగే తమ బీఆర్ఎస్ నేతలపై కక్ష పెంచుకొని, రేవంత్ రెడ్డి రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై రేవంత్ రెడ్డి అనవసరమైన మాటలు మాట్లాడి తన హోదాను మర్చిపోయారని చల్మెడ విమర్శించారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని నిన్నటి ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి ప్రశ్నించగా, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటను తడుపుతానని సీఎం సమాధానం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రైతులకు నీళ్లు ఇవ్వాలని అడిగితే, మమ్మల్ని కోసి మా రక్తం పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి భాషనేనా అంటూ నిలదీశారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.