లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు సీఎం గ్రీన్సిగ్నల్.. భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశం.! లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను శరవేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో రిజర్వాయర్ నిర్మాణంపై సీఎం ప్రత్యేకంగా చర్చించారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చివరి లిఫ్ట్గా ఉన్న లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు ముందుగా భూసేకరణ పూర్తి చేయాలని సీఎం సూచించారు. భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భూసేకరణలో జాప్యం జరిగితే ప్రాజెక్టులు పూర్తికావని, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.సీఎం ఆదేశాలతో భూసేకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. భూసేకరణ పూర్తయిన వెంటనే రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని, అవసరమైన నిధులు మంజూరయ్యాయని తెలిపారు.సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల్లో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు సీఎం గ్రీన్సిగ్నల్.. భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశం.! లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను శరవేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో రిజర్వాయర్ నిర్మాణంపై సీఎం ప్రత్యేకంగా చర్చించారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చివరి లిఫ్ట్గా ఉన్న లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు ముందుగా భూసేకరణ పూర్తి చేయాలని సీఎం సూచించారు. భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భూసేకరణలో జాప్యం జరిగితే ప్రాజెక్టులు పూర్తికావని, ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.సీఎం ఆదేశాలతో భూసేకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. భూసేకరణ పూర్తయిన వెంటనే రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని, అవసరమైన నిధులు మంజూరయ్యాయని తెలిపారు.సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల్లో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- పటాన్చెరు: 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పటాన్చెరు: 22A నిషేధిత జాబితాలో చేరిన భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది. ఆగస్టు 29న అమీన్పూర్లో భారీ నిరసన సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్న సభకు 15 వేల మంది తరలిరానున్నట్లు చెప్పారు. అర్హత ఉన్న భూములను 22A నుంచి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1