పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి. - డాక్టర్ సంధ్యారాణి,హేమలత. పాడి రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పశు వైద్యాధికారులు డాక్టర్ సంధ్య రాణి, హేమలతలు పేర్కొన్నారు. మంగళవారం హత్నూర మండలంలోని మధుర, దేవులపల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 131 పాడి పశువులకు ఉచితంగా వేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలికుంటు టీకా వేయించడం వల్ల పశువుల్లో వ్యాధి నివారణ తీవ్రతను తగ్గించడంతో పాటు పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.పశువుల్లో పాల ఉప్పత్తి సామర్థ్యం తగ్గకుండా టీకా పని చేస్తుందన్నారు. ఈ వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాప్తి చెందుతుంది అన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా మార్చ్ 10 నుండి ఏప్రిల్ 9 వరకు టీకాల పంపిణీ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, ఉపసర్పంచ్ పాండు, మహేందర్, పశువైత సిబ్బంది,రైతులు తదితరులు ఉన్నారు.
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి. - డాక్టర్ సంధ్యారాణి,హేమలత. పాడి రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని పశు వైద్యాధికారులు డాక్టర్ సంధ్య రాణి, హేమలతలు పేర్కొన్నారు. మంగళవారం హత్నూర మండలంలోని మధుర, దేవులపల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 131 పాడి పశువులకు ఉచితంగా వేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలికుంటు టీకా వేయించడం వల్ల పశువుల్లో వ్యాధి నివారణ తీవ్రతను తగ్గించడంతో పాటు పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.పశువుల్లో పాల ఉప్పత్తి సామర్థ్యం తగ్గకుండా టీకా పని చేస్తుందన్నారు. ఈ వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాప్తి చెందుతుంది అన్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా మార్చ్ 10 నుండి ఏప్రిల్ 9 వరకు టీకాల పంపిణీ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, ఉపసర్పంచ్ పాండు, మహేందర్, పశువైత సిబ్బంది,రైతులు తదితరులు ఉన్నారు.
- సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం వేళ నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని హనుమంతుడి సేవలో లీనమై పోయారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- మహిళలు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు: సంగారెడ్డిలో TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- Post by Narasimulu Narasimulu1
- పక్కగా భూ హక్కులకోసం రీసర్వే ----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి తండా కు చెందిన గిరిజన దంపతులకు నెల రోజుల క్రితం మగ బిడ్డ జన్మించారు. తొలి కాన్పులో మగ బిడ్డ జన్మించిన ఆనందంగా ఉన్న దంపతులు కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు ఓ మధ్యవర్తి ద్వారా బాలు తల్లిదండ్రులను కలిసి బేరం పెట్టారు. 50 వేలకు బేరం కుదిరింది. డబ్బులు ఇచ్చిన కామారెడ్డి కి చెందిన దంపతులు తీసుకు వెళ్ళారు. అయితే బాబు పుట్టిన తరవాత అంగన్వాడిలో పాలు, ఇతర పోషక ఆహారం కు బాలింత రాకపోవడం తో అనుమానం కలిగిన అంగన్వాడీ టీచర్ ఆరా తీసింది. విషయం అడగడం తో ఇంటికి తాళం వెళ్ళిపోయారు. అధికారులు రంగంలోకి దిగి పోలీస్ లకు సమాచారం అందించారు. కామారెడ్డి లో ఉన్న నెల రోజుల పసికందును తీసుకొని సఖి కేంద్రం కు తరలించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి నట్టు నిర్వాహకురాలు రేణుక తెలిపారు. నెల రోజుల పసి కందు ను విక్రయించడం పై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర మండల రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ ప్రజల సమస్యలు పట్టించుకోలేని అధ్యక్షుడు పన్నీరు మహేష్ ఆరోపించారు. కాలనీ ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ఇల్లు లేని నిరుపేదలకు రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ లో 52 బిల్డింగులు,6420 కుటుంబాలు ఇల్లు అలాట్మెంట్ చేయడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రోడ్డు సమస్య, రోజు కనీసం ఒక రెండు మూడు బైకులు కిందపడి ప్రజలను కాలు చేతులు వేరే కొట్టుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుండి కలెక్టర్ కు మరియు జిహెచ్ఎంసి వారికి మరియు నాగారం మున్సిపాలిటీ అధికారులకు, ఎన్నిసార్లు వినతిపత్రం వచ్చినా కూడా చూసి చూడనట్టుగా వివరిస్తున్న అధికారులు మరియు లీడర్లు , రాంపల్లి డబుల్ బెడ్రూంలో ఇల్లు అలెర్ట్మెంట్ చేశారు. అక్కడ ఉండడానికి ప్రధానమైనటువంటి సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ కావట్లేదు, బస్తీ దావకాన లేదు, అంగన్వాడి కేంద్రం లేదు, ప్రజలు కనీసం అక్కడ ఏదైనా పని చేసుకుని బతకడానికి వసతులు లేవు, ఏవైతే గవర్నమెంట్ చేసినటువంటి సెంటర్ అవి కూడా ఓపెన్ చేయకుండా, తినడానికి తిండి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాగారం మున్సిపాలిటీకి టాక్సీ కూడా పే చేయడం జరిగింది. ఒక్కొక్కరు 1980 రూపాయలు టాక్స్ కడుతున్నారు. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. టాక్స్ కట్టని వారికి నోటీసులు అందిస్తామని చెప్పి పేద ప్రజలను భయాందోళనకు గురిచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ యొక్క రాంపల్లి డబుల్ బెడ్ సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రభుత్వ స్పందించకపోతే కాలనీ ప్రజలందరం పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.1
- రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన వేమ్ నరేందర్ రెడ్డిని మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన వేమ్ నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వేమ్ నరేందర్ రెడ్డి కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.1
- శారీరక దృఢత్వానికి క్రీడలు అవసరం క్రీడలతో ఒత్తిడి దూరం మెదక్ జిల్లా ఎస్పీ. డి . వి. శ్రీనివాస రావు మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు పోలీసు వార్షిక క్రీడోత్సవాలను (Annual Sports & Games) ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ జెండా ఆవిష్కరించి క్రీడా పోటీలకు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడోత్సవాల ప్రారంభానికి ముందు నిర్వహించిన పరేడ్ను ఎస్పీ పరిశీలించి సిబ్బంది నుంచి వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొంటూ క్రీడా స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారని, అలాంటి పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించి విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు. అదేవిధంగా క్రీడా పోటీలు సిబ్బందిలో ఐక్యత, జట్టు భావన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. విధుల్లో ఎంత నిబద్ధతతో పనిచేస్తారో, అదే ఉత్సాహంతో క్రీడల్లో కూడా పాల్గొని ప్రతిభ కనబరచాలని సూచించారు. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలకంగా ఉంటాయని చెప్పారు. ఈ క్రీడోత్సవాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్పుట్ వంటి పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ముగింపు కార్యక్రమంలో బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు మహేష్, రేణుక రెడ్డి, కృష్ణమూర్తి, జాన్ రెడ్డి, వెంకట రాజా గౌడ్, ఆర్ఐలు శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1