logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మేనిఫెస్టో హామీల అమలులో ముందున్న కౌన్సిలర్ లక్ష్మి నర్సింహా రెడ్డి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి నర్సింహా రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీల అమలులో చురుకుగా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం, మహిళల సాధికారత, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా తన సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో విశ్వాసం పొందుతున్నారు. ఇటీవల 13వ వార్డులో జరిగిన ఓ యువతి వివాహానికి హాజరైన ఆయన, రూ.25 వేల నగదు కానుక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆడబిడ్డ పుట్టిన కుటుంబాలకు సహాయం, వివాహ కానుకలు, వృద్ధాప్య మరియు వితంతు పింఛన్ల రూపంలో ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నాలుగు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. “అభివృద్ధి మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలి” అనే నినాదంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతరం సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. కౌన్సిలర్ చేపడుతున్న కార్యక్రమాలకు స్థానిక ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.

20 hrs ago
user_Ajay Krishna Racharla
Ajay Krishna Racharla
Local News Reporter రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
20 hrs ago
076881e9-ed58-4c35-ae86-d0017917752c

మేనిఫెస్టో హామీల అమలులో ముందున్న కౌన్సిలర్ లక్ష్మి నర్సింహా రెడ్డి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి నర్సింహా రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీల అమలులో చురుకుగా ముందుకు సాగుతున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం, మహిళల సాధికారత, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా తన సొంత నిధులతో కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో విశ్వాసం పొందుతున్నారు. ఇటీవల 13వ వార్డులో జరిగిన ఓ యువతి వివాహానికి హాజరైన ఆయన, రూ.25 వేల

f2f4f095-7f22-4682-bfcd-c24fb080d8b5

నగదు కానుక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆడబిడ్డ పుట్టిన కుటుంబాలకు సహాయం, వివాహ కానుకలు, వృద్ధాప్య మరియు వితంతు పింఛన్ల రూపంలో ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నాలుగు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. “అభివృద్ధి మాటల్లో కాదు, పనుల్లో కనిపించాలి” అనే నినాదంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతరం సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. కౌన్సిలర్ చేపడుతున్న కార్యక్రమాలకు స్థానిక ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.

More news from తెలంగాణ and nearby areas
  • a Masjid-e-Abbas (Gulshan-e-Abul Fazal Abbas A.S.) langar house ke paas mori ka pani jama ho raha hai, jiski wajah se musalliyon ko aane jaane mein sakht mushkilat ho rahi hain. GHMC se guzarish hai ke is masle par fauri tawajjo de kar ise hal karein.
    1
    a Masjid-e-Abbas (Gulshan-e-Abul Fazal Abbas A.S.) langar house ke paas mori ka pani jama ho raha hai, jiski wajah se musalliyon ko aane jaane mein sakht mushkilat ho rahi hain. GHMC se guzarish hai ke is masle par fauri tawajjo de kar ise hal karein.
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • సంగారెడ్డి మున్సిపాలిటీలో చెత్తను వేరువేరుగా వేయాలి: అదనపు కలెక్టర్ పాండు
    1
    సంగారెడ్డి మున్సిపాలిటీలో చెత్తను వేరువేరుగా వేయాలి: అదనపు కలెక్టర్ పాండు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 2 ప్రజా తెలంగాణ న్యూస్/వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందన్నారు, రేపు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అమలు కానీ 420 హామీలపై,6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామసభలలో నిలదీసి వైఫల్యం ఎండ కట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను తమ మంత్రులను గ్రామ సభలోకి వెళ్లకుండా, అధికారులతోనే గ్రామ సభలు జరపాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిందని, కళ్యాణ లక్ష్మి లక్ష తో పాటు తులంబంగారం ఇస్తామని చెప్పి మోసం, విద్యార్థినిలకు స్కూటీల పంపిణీ చేస్తామని మో
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 2 ప్రజా తెలంగాణ న్యూస్/వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిందన్నారు, రేపు జరగబోయే గ్రామ సభలలో ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అమలు కానీ 420 హామీలపై,6 గ్యారెంటీలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గ్రామసభలలో నిలదీసి వైఫల్యం ఎండ కట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను తమ మంత్రులను గ్రామ సభలోకి వెళ్లకుండా, అధికారులతోనే గ్రామ సభలు జరపాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు, 
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామని మోసం చేసిందని, కళ్యాణ లక్ష్మి లక్ష తో పాటు తులంబంగారం ఇస్తామని చెప్పి మోసం, విద్యార్థినిలకు స్కూటీల పంపిణీ చేస్తామని మో
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఏసీబీ దాడులు ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని బిల్స్ సెక్షన్ లో పనిచేస్తున్న రమేష్, అరవింద్ అనే ఇద్దరు ఉద్యోగులు రూ. 13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఏసీబీ దాడులు
ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోని బిల్స్ సెక్షన్ లో పనిచేస్తున్న రమేష్, అరవింద్ అనే ఇద్దరు ఉద్యోగులు రూ. 13 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    12 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యమిస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ 'డుసిమస్ 2025 - 2026' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఫెస్ట్ లో భాగంగా మొదటిరోజు వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీలలో పోటీలు జరిగాయి. రెండవ రోజు గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు,నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత పదమూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్ట్ కు ఆతిథ్యమిచ్చి, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తోందని కొనియాడారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. ఎన్ రాంప్రసాద్, డీన్, హెచ్ఓడి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, స్టూడెంట్ ఆర్గనైజర్లు బండి భరత్, సిద్దార్థ్, శ్రీజ బాల్ రెడ్డి, టి. క్రాంతి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.
    5
    ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యమిస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ 'డుసిమస్ 2025 - 2026' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఫెస్ట్ లో భాగంగా మొదటిరోజు వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీలలో పోటీలు జరిగాయి. రెండవ రోజు గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు,నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత పదమూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్ట్ కు ఆతిథ్యమిచ్చి, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తోందని కొనియాడారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. ఎన్ రాంప్రసాద్, డీన్, హెచ్ఓడి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, స్టూడెంట్ ఆర్గనైజర్లు బండి భరత్, సిద్దార్థ్, శ్రీజ బాల్ రెడ్డి, టి. క్రాంతి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • పసిడి ప్రేమికులకు భారీ ఊరట.. నేలచూపు చూస్తున్న బంగారం, వెండి ధరలు! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా భారీగా తగ్గిన ధరలు..
    1
    పసిడి ప్రేమికులకు భారీ ఊరట.. నేలచూపు చూస్తున్న బంగారం, వెండి ధరలు!
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా భారీగా తగ్గిన ధరలు..
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్‌కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు. అవినీతి డిమాండ్‌ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్‌ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.
    2
    ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనంలో పెన్షన్ దరఖాస్తు కోసం వచ్చిన ఓ విశ్రాంత ఉద్యోగి నుండి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, పెన్షన్ మంజూరు కోసం వచ్చిన బాధితుడిని సీనియర్ అసిస్టెంట్ అరవింద్ రూ.15,000 లంచం కోరగా, చివరకు రూ.13,000కి ఒప్పందం కుదిరింది. ఆ మొత్తాన్ని తన సహచరుడు రమేష్‌కు ఇవ్వాలని అరవింద్ సూచించాడు.
అవినీతి డిమాండ్‌ను సహించలేక బాధితుడు ఏసీబీని సంప్రదించడంతో అధికారులు పథకం ప్రకారం బుధవారం లేడీస్ హాస్టల్ బస్టాప్ వద్ద రమేష్‌ను డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. విచారణలో అరవింద్ ప్రమేయం బయటపడడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ, ఎక్కడైనా అవినీతి జరిగితే ప్రజలు ధైర్యంగా ఏసీబీని సంప్రదించాలని సూచించారు.
    user_B. vinay kumar
    B. vinay kumar
    ఉప్పల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    20 hrs ago
  • హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న మహిళ ఈ మధ్యకాలంలో పదవీ విమరణ పొందారు. పెన్షన్ డబ్బుల కోసం పరిపాలన భవనం చుట్టూ తిరుగుతుండగా బిల్ సెక్షన్ లోని సీనియర్ అసిస్టెంట్ అయిన రమేష్ 15000 లంచం అడిగాడు. దానితో బాధితులు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. దీంతో రంగంలో ఏసిబి అధికారులు. ఇద్దరు పైన నిగ వేశారు. బాధితులు తాను 15000 ఇవ్వలేను అని చెప్పగా మరొక సీనియర్ అసిస్టెంట్ అరవింద్ మధ్యవర్తిగా వచ్చి 13,000 కు లంచం కుదుర్చుకొని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఓయూ బస్టాప్ వద్ద బాధితుల దగ్గర నుండి 13,000 తీసుకొని ఓయూ పరిపాలన భవనం వచ్చాడు. పరిపాలన భవనం సెక్షన్ లోకి రాగానే ఏసీబీ అధికారి అరవింద్ మరియు రమేష్ లోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫైల్ కోసం సోదాలు నిర్వహించారు అనంతరం రమేష్ అరవింద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు రేపు ఉదయం కోర్ట్ లో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ పరిపాల భవనంలోనే ఉన్నారు.
    2
    హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న మహిళ ఈ మధ్యకాలంలో పదవీ విమరణ  పొందారు. పెన్షన్ డబ్బుల కోసం పరిపాలన భవనం చుట్టూ తిరుగుతుండగా బిల్ సెక్షన్ లోని సీనియర్ అసిస్టెంట్ అయిన రమేష్ 15000 లంచం అడిగాడు. దానితో బాధితులు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. దీంతో రంగంలో ఏసిబి అధికారులు. ఇద్దరు పైన నిగ వేశారు. బాధితులు తాను 15000 ఇవ్వలేను అని చెప్పగా మరొక సీనియర్ అసిస్టెంట్ అరవింద్  మధ్యవర్తిగా వచ్చి 13,000 కు లంచం కుదుర్చుకొని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఓయూ బస్టాప్ వద్ద బాధితుల దగ్గర నుండి 13,000 తీసుకొని ఓయూ పరిపాలన భవనం వచ్చాడు. పరిపాలన భవనం సెక్షన్ లోకి రాగానే ఏసీబీ అధికారి అరవింద్ మరియు రమేష్ లోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫైల్ కోసం సోదాలు నిర్వహించారు అనంతరం రమేష్ అరవింద్  లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు రేపు ఉదయం కోర్ట్ లో హాజరు పరుస్తామని  ఏసీబీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ పరిపాల భవనంలోనే ఉన్నారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.