logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు పిడుగు పడటంతో గ్రామానికి చెందిన మందాటి కొండల్ రెడ్డి అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఆకస్మిక సంఘటనతో సుమారు ఒక లక్ష రూపాయల విలువ చేసే ఎద్దు మరణించిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతుకు ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరారు.

9 hrs ago
user_Devender Pasunoori
Devender Pasunoori
Local News Reporter Jangoan, Telangana•
9 hrs ago
c0ee3a5a-2675-44b5-821e-8f0921ce6f54

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు పిడుగు పడటంతో గ్రామానికి చెందిన మందాటి కొండల్ రెడ్డి అనే రైతుకు చెందిన దుక్కిటెద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఆకస్మిక సంఘటనతో సుమారు ఒక లక్ష రూపాయల విలువ చేసే ఎద్దు మరణించిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతుకు ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరారు.

More news from Telangana and nearby areas
  • ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు.

ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter Jangoan, Telangana•
    3 hrs ago
  • హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.
    1
    హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు.

కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు.

వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_ARUTLA KISHORE KUMAR
    ARUTLA KISHORE KUMAR
    Teacher Yadagirigutta, Yadadri Bhuvanagiri•
    9 hrs ago
  • జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడంతో పాటు బీఎన్ఏలకు శిక్షణ కార్యక్రమాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మరింత మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన సూచనలు కూడా ఆయన ఇవ్వనున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని మండల, క్లస్టర్ ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజయ్య పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 29న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టడంతో పాటు బీఎన్ఏలకు శిక్షణ కార్యక్రమాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మరింత మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన సూచనలు కూడా ఆయన ఇవ్వనున్నారని తెలిపారు.

నియోజకవర్గంలోని మండల, క్లస్టర్ ఇన్‌చార్జులు, సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని రాజయ్య పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ సమావేశం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కరీంనగర్ జిల్లాలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వరుణ దేవుడి కరుణ కోసం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు సాంప్రదాయబద్ధంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకం చేయడంతో పాటు కప్పతల్లి ఆటను ఆడారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కందుగుల గ్రామంలో, గ్రామస్తులు వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష వయోభేదం లేకుండా అందరూ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక బిందెడు నీళ్లను డప్పుచప్పుళ్లతో ఆలయాలకు తీసుకువెళ్లి దేవతలకు జలాభిషేకం చేశారు. పసుపు కుంకుమలతో దేవత మూర్తులను అలంకరించి, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు. అదేవిధంగా, వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు ఓ సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షాలు లేకపోవడంతో పూర్వ కాలం నాటి ఆచారం ప్రకారం కప్పలకు వివాహం జరిపారు. బాజా భజంత్రీలు, మేళా తాళాల నడుమ రెండు కప్పలను తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
    1
    వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కరీంనగర్ జిల్లాలో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వరుణ దేవుడి కరుణ కోసం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు సాంప్రదాయబద్ధంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకం చేయడంతో పాటు కప్పతల్లి ఆటను ఆడారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని కందుగుల గ్రామంలో, గ్రామస్తులు వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. చిన్న, పెద్ద, స్త్రీ, పురుష వయోభేదం లేకుండా అందరూ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక బిందెడు నీళ్లను డప్పుచప్పుళ్లతో ఆలయాలకు తీసుకువెళ్లి దేవతలకు జలాభిషేకం చేశారు. పసుపు కుంకుమలతో దేవత మూర్తులను అలంకరించి, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కుకున్నారు.

అదేవిధంగా, వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామస్తులు ఓ సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షాలు లేకపోవడంతో పూర్వ కాలం నాటి ఆచారం ప్రకారం కప్పలకు వివాహం జరిపారు. బాజా భజంత్రీలు, మేళా తాళాల నడుమ రెండు కప్పలను తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా వివాహ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
    2
    ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
    user_Journalist Madhu
    Journalist Madhu
    Financial Analyst కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • హైదరాబాద్‌లోని అత్తాపూర్ వద్ద, పిలర్ నంబర్ 213 సమీపంలో జరిగిన ఒక రోడ్ రేజ్ ఘటన కలకలం రేపింది. ఒక కారు డ్రైవర్ రాంగ్ సైడ్‌లో తన వాహనాన్ని నడుపుతూ, అనంతరం జరిగిన వాగ్వాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్, రోడ్ రేజ్ వంటి సంఘటనలు నగర రహదారులపై ప్రయాణికుల భద్రతకు పెను ముప్పుగా మారుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
    1
    హైదరాబాద్‌లోని అత్తాపూర్ వద్ద, పిలర్ నంబర్ 213 సమీపంలో జరిగిన ఒక రోడ్ రేజ్ ఘటన కలకలం రేపింది. ఒక కారు డ్రైవర్ రాంగ్ సైడ్‌లో తన వాహనాన్ని నడుపుతూ, అనంతరం జరిగిన వాగ్వాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్, రోడ్ రేజ్ వంటి సంఘటనలు నగర రహదారులపై ప్రయాణికుల భద్రతకు పెను ముప్పుగా మారుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు. ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
    1
    కరీంనగర్-హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్న కరీంనగర్-2 డిపోకు చెందిన ఓ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే బస్సును నిలిపివేయగా, డ్రైవర్, కండక్టర్లు కలిసి అందులో ఉన్న 37 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటికి దించారు.

ప్రయాణికులను దించిన అనంతరం మంటలు బస్సు మొత్తం వ్యాపించి, అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.