సత్తుపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రూ.10,000 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని, బుధవారం సత్తుపల్లి బస్టాండ్లో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి, మహిళా ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ.. మార్చి 29, 2026 నాటికి ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సుమారు 290 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా వారి జేబుల నుండి ఖర్చవ్వాల్సిన రూ.10,000 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. మహిళల ఆర్థిక స్వవలంబన కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సత్తుపల్లి నియోజకవర్గ మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూలీ పనులకు వెళ్లే మహిళలు, చిరు వ్యాపారులు, విద్యార్థినులు ఈ పథకం వల్ల నెలకు వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారని, ఆ డబ్బు వారి కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం బస్టాండ్లో వేచి ఉన్న మహిళా ప్రయాణికులతో ఎమ్మెల్యే గారు ముఖాముఖి మాట్లాడారు. బస్సుల రాక, సిబ్బంది ప్రవర్తన మరియు పథకం అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు స్పందిస్తూ.. "గతంలో ప్రయాణ ఖర్చుల కోసం వెనుకాడే వాళ్ళమని, ఇప్పుడు ధైర్యంగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నామని" ఎమ్మెల్యే వివరించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రెహన కమల్ పాషా , సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్, మున్సిపాలిటీకి చెందిన మహిళా వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున మహిళా ప్రయాణికులు పాల్గొన్నారు.
సత్తుపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రూ.10,000 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని, బుధవారం సత్తుపల్లి బస్టాండ్లో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి, మహిళా ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ.. మార్చి 29, 2026 నాటికి ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సుమారు 290 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా వారి జేబుల నుండి ఖర్చవ్వాల్సిన రూ.10,000 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. మహిళల ఆర్థిక స్వవలంబన కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి సత్తుపల్లి నియోజకవర్గ మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూలీ పనులకు వెళ్లే మహిళలు, చిరు వ్యాపారులు, విద్యార్థినులు ఈ పథకం వల్ల నెలకు వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారని, ఆ డబ్బు వారి కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం బస్టాండ్లో వేచి ఉన్న మహిళా ప్రయాణికులతో ఎమ్మెల్యే గారు ముఖాముఖి మాట్లాడారు. బస్సుల రాక, సిబ్బంది ప్రవర్తన మరియు పథకం అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు స్పందిస్తూ.. "గతంలో ప్రయాణ ఖర్చుల కోసం వెనుకాడే వాళ్ళమని, ఇప్పుడు ధైర్యంగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నామని" ఎమ్మెల్యే వివరించారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రెహన కమల్ పాషా , సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్, మున్సిపాలిటీకి చెందిన మహిళా వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున మహిళా ప్రయాణికులు పాల్గొన్నారు.
- Post by V Ramarao4
- మ99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలలో భాగంగా అనంతరం గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు, అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు చాలా మంది చనిపోవటం కూడా జరిగిందని గ్రామస్తులు గ్రామసభలో ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగ ఏమిటి ఈ సమస్య అని జూలూరుపాడు వైద్యాధికారిని అడగగా అనంతరం హెల్త్ క్యాంపు పెట్టి అన్ని టెస్టులు చేసాము అంత పాజిటివ్ గానే రిపోట్స్ వచ్చాయని అన్నారు. చుట్టుపక్కల మండలలల్లో ఎక్కడ లేని విదంగా ముఖ్యంగా జూలూరుపాడు లో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా యాంటీబయటీక్ ,స్టీరైడ్స్ ఎక్కువుగా వాడటం వల్లన అనంతరంలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామదాసు నాయక్ కు తెలిపారు, ఫోన్ లో స్వయంగా ఎమ్మెల్యే డి ఎం హెచ్ ఓ తో మాట్లాడిన్నారు సమస్య వివరించారు అదేవిధంగా స్పెషల్ డాక్టర్లుతో అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు...2
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వేన్నారం గ్రామ పరిధిలోని రామకుంట తండాలో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. తేజావత్ హర్యా ఇంటిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల 20 వేల నగదును అపహరించారు. ఈ ఘటన తండా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బుధవారం రోజు హర్యా కుటుంబ సభ్యులు తమ కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం నిమిత్తం సమీప గ్రామానికి వెళ్లారు. ఇంటిని ఖాళీగా ఉంచిన అవకాశాన్ని దొంగలు వినియోగించుకుని రాత్రి సమయంలో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తాళాలు పగులగొట్టబడి ఉండటం, బీరువాలు చెల్లాచెదురుగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ, క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై విచారణ కొనసాగుతోంది. ఈ దొంగతనం ఘటనతో రామకుంట తండా సహా పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట 2వ వార్డులో వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ కాంపెల్లి వీణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ తదితర అంశాలపై ప్రజలు వివరించారు. అనంతరం మాట్లాడిన కౌన్సిలర్ కాంపెల్లి వీణ, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ వార్డు సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.2
- పొన్నూరు: ప్రేమ జంటకు రక్షణ కల్పించిన పోలీసులు పొన్నూరుకు చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు అనే భయంతో మార్చి 28వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరి మిస్సింగ్పై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వటంతో పోలీసులు వీరిని పిలిపించారు.1
- Post by Sode Prasad1
- నకిరేకల్ మునిసిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ 21వ రోజు మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ మహాధర్నాకు అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యం వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో పనిచేసే దడువాయుల జీవనోపాధి కష్టాల్లో ఉందని, వారికి తక్షణమే పని కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.3
- కొత్తగూడెం కార్పొరేషన్ 20వ డివిజన్ అభివృద్ధికి 9కోట్ల రూపాయలు మంజులైనట్లు మేయర్ మూడ్ గణేష్ తెలిపారు లక్ష్మీదేవి పల్లి,నిమ్మలగూడెం,కోమటపల్లి గ్రామాలలో మౌలిక వసంతలు కల్పనకు ఈ నిధులు వేచినట్లు పేర్కొన్నారు.తనను గెలిపించిన ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటాను అని కేవలం 20వ డివిజన్ మాత్రమే కాకుండా కార్పోరేషన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు1