logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

10 Examination in Nirmal District | Exam Peacefully Conducted

on 14 March
user_KR NEWS 369
KR NEWS 369
Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
on 14 March

10 Examination in Nirmal District | Exam Peacefully Conducted

More news from తెలంగాణ and nearby areas
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Photographer భైంసా, నిర్మల్, తెలంగాణ•
    15 hrs ago
  • పత్రికా ప్రకటన ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 16 :- *రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అదనపు డీజీ.* *"అరైవ్ అలైవ్" లో భాగంగా ప్రమాదాల నివారణకు కృషి* *ప్రభుత్వ ఆమోదిత రేడియం స్టిక్కర్లను లారీలకు అతికించిన అదనపు డీజీపి* *గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా అనిల్ కుమార్* “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. అతివేగంతో జరిగిన ప్రమాదానికి గురైన కారును ప్రజలకు కనిపించే విధంగా గుడిహత్నూర్ సమీపంలో ఏర్పాటు చేసి, గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా అనిల్ కుమార్ గారిచే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొన్నారు. అదేవిధంగా భారీ వాహనాలకు వెనుక భాగంలో ప్రభుత్వం ఆమోదిత ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లను అతికించడం జరిగింది. వీటి ద్వారా ఎంత దూరం నుండి అయినా రేడియం స్టిక్కర్ల పై లైట్ పడినట్లు అయితే అవి మెరుస్తూ రోడ్లపై ఉన్న వాహనాలను వాహనదారులను కనిపించే విధంగా ప్రతిబింబిస్తాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అవగాహన ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. వేగం వల్ల జరిగే ప్రమాదాల తీవ్రతను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రమాదానికి గురైన కారును ప్రదర్శనగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ముఖ్యంగా ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల అవకాశాలు అధికమవుతాయని హెచ్చరించారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీస్తుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించి, ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనను జిల్లా పోలీసు శాఖ మరియు సోమ హైవే సంస్థల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పరిపాలన అదనపు ఎస్పీ పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సోమ సంస్థ సిబ్బంది, ఇచ్చోడా సీఐ సిహెచ్ రమేష్, గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
ఏప్రిల్ 16 :-
*రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అదనపు డీజీ.* 
*"అరైవ్ అలైవ్" లో భాగంగా ప్రమాదాల నివారణకు కృషి* 
*ప్రభుత్వ ఆమోదిత రేడియం స్టిక్కర్లను లారీలకు అతికించిన అదనపు డీజీపి* 
*గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా అనిల్ కుమార్* 
“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. అతివేగంతో జరిగిన ప్రమాదానికి గురైన కారును ప్రజలకు కనిపించే విధంగా గుడిహత్నూర్ సమీపంలో ఏర్పాటు చేసి, గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా అనిల్ కుమార్ గారిచే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొన్నారు. అదేవిధంగా భారీ వాహనాలకు వెనుక భాగంలో ప్రభుత్వం ఆమోదిత ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లను అతికించడం జరిగింది. వీటి ద్వారా ఎంత దూరం నుండి అయినా రేడియం స్టిక్కర్ల పై లైట్ పడినట్లు అయితే అవి మెరుస్తూ రోడ్లపై ఉన్న వాహనాలను  వాహనదారులను కనిపించే విధంగా ప్రతిబింబిస్తాయి.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అవగాహన ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. వేగం వల్ల జరిగే ప్రమాదాల తీవ్రతను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రమాదానికి గురైన కారును ప్రదర్శనగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ముఖ్యంగా ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల అవకాశాలు అధికమవుతాయని హెచ్చరించారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీస్తుందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించి, ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనను జిల్లా పోలీసు శాఖ మరియు సోమ హైవే సంస్థల సహకారంతో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పరిపాలన అదనపు ఎస్పీ పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సోమ సంస్థ సిబ్బంది, ఇచ్చోడా సీఐ సిహెచ్ రమేష్, గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    7 hrs ago
  • అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు.  అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.
    4
    అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు.
అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు. 
అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.
కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • అది ఒక ప్రశాంతమైన గ్రామం.. కానీ ఇప్పుడు అక్కడ అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే మరణం వెంటాడుతోంది. జన్నారం మండలంలోని చింతలపల్లి, పోన్కల్, కిష్టాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం "కుక్కల రాజ్యమే" నడుస్తోంది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ​రక్తసిక్తమైన గ్రామాలు: బాధితుల ఆర్తనాదాలు ​గర్భిణీ అని కూడా చూడకుండా మెట్టుపల్లి గంగజలపై కుక్క దాడి చేయడం స్థానికులను కలిచివేస్తోంది. ఇంటి ముందు ఊడుస్తున్న జయవ్వ, తన మనవడిని కాపాడబోయిన వృద్ధుడు రాజన్న, అలాగే శ్రీరామ్, పుష్పలత.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, వరుస దాడులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మూగజీవాలైన ఆవులు, బర్రెలపై కూడా దాడులు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ​"మమ్మల్ని చంపేయండి.. కానీ కుక్కను మాత్రం ఏమీ అనకండి" ​ప్రస్తుతం జన్నారంలో వినిపిస్తున్న వ్యంగ్యాస్త్రం ఇది. గ్రామంలోని సర్పంచ్ పంజాల సురేష్, ఇతర వార్డ్ మెంబర్లు, సెక్రెటరీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలేమో "మమ్మల్ని కాపాడండి" అని వారిని వేడుకుంటున్నారు. కానీ పాలకవర్గం మాత్రం "మేమేం చేయాలి?" అని నిస్సహాయంగా తలలు పట్టుకుంటున్నారు.
    3
    అది ఒక ప్రశాంతమైన గ్రామం.. కానీ ఇప్పుడు అక్కడ అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే మరణం వెంటాడుతోంది. జన్నారం మండలంలోని చింతలపల్లి, పోన్కల్, కిష్టాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం "కుక్కల రాజ్యమే" నడుస్తోంది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం.
​రక్తసిక్తమైన గ్రామాలు: బాధితుల ఆర్తనాదాలు
​గర్భిణీ అని కూడా చూడకుండా మెట్టుపల్లి గంగజలపై కుక్క దాడి చేయడం స్థానికులను కలిచివేస్తోంది. ఇంటి ముందు ఊడుస్తున్న జయవ్వ, తన మనవడిని కాపాడబోయిన వృద్ధుడు రాజన్న, అలాగే శ్రీరామ్, పుష్పలత.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, వరుస దాడులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మూగజీవాలైన ఆవులు, బర్రెలపై కూడా దాడులు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
​"మమ్మల్ని చంపేయండి.. కానీ కుక్కను మాత్రం ఏమీ అనకండి"
​ప్రస్తుతం జన్నారంలో వినిపిస్తున్న వ్యంగ్యాస్త్రం ఇది. గ్రామంలోని సర్పంచ్ పంజాల సురేష్, ఇతర వార్డ్ మెంబర్లు, సెక్రెటరీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలేమో "మమ్మల్ని కాపాడండి" అని వారిని వేడుకుంటున్నారు. కానీ పాలకవర్గం మాత్రం "మేమేం చేయాలి?" అని నిస్సహాయంగా తలలు పట్టుకుంటున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • Post by Anandrao
    4
    Post by Anandrao
    user_Anandrao
    Anandrao
    Artist జైనూర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులోని రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరారు. ఆ వార్డులోని ఎంపీడీవో, తాసిల్దార్, రిజిస్ట్రేషన్ వెళ్లే రహదారి పక్కన 5 రోజులుగా పైప్ లైన్ లీకేజీ అయ్యి నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై నీటి ప్రవాహం ఉండడంతో చిన్నారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించాలని కోరారు.
    1
    లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులోని రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరారు. ఆ వార్డులోని ఎంపీడీవో, తాసిల్దార్, రిజిస్ట్రేషన్ వెళ్లే రహదారి పక్కన 5 రోజులుగా పైప్ లైన్ లీకేజీ అయ్యి నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై నీటి ప్రవాహం ఉండడంతో చిన్నారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించాలని కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :16.04.2026
కామారెడ్డి జిల్లా 
గురువారం 
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. 
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు.
గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్,  ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు.
రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో  ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు  మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.