ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి: కామన్ పల్లి పాఠశాల విద్యార్థులకు పెన్నుల పంపిణీ హిందూ స్వరాజ్య స్థాపకుడు,ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కామన్ పల్లి గ్రామ పాఠశాలలో శివాజీ సేన కమిటీ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా పెన్నులను పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు.ముందుగా పాఠశాల ఆవరణలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి,కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయులు ఘన నివాళులర్పించారు.శివాజీ చూపిన ధైర్యం,దేశభక్తి నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను,ఆయన చేసిన పోరాటాలను విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.విద్యార్థుల చదువుకు ప్రోత్సాహకంగా శివాజీ సేన కమిటీ తరపున పెన్నులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శివాజీ సేన కమిటీ ముఖ్య సభ్యులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.శివాజీ సేన కమిటీ చేస్తున్న ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను గ్రామస్థులు మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి: కామన్ పల్లి పాఠశాల విద్యార్థులకు పెన్నుల పంపిణీ హిందూ స్వరాజ్య స్థాపకుడు,ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కామన్ పల్లి గ్రామ పాఠశాలలో శివాజీ సేన కమిటీ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా పెన్నులను పంపిణీ చేసి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు.ముందుగా పాఠశాల ఆవరణలో శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి,కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయులు ఘన నివాళులర్పించారు.శివాజీ చూపిన ధైర్యం,దేశభక్తి నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను,ఆయన చేసిన పోరాటాలను విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.విద్యార్థుల చదువుకు ప్రోత్సాహకంగా శివాజీ సేన కమిటీ తరపున పెన్నులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శివాజీ సేన కమిటీ ముఖ్య సభ్యులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.శివాజీ సేన కమిటీ చేస్తున్న ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను గ్రామస్థులు మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.
- జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ గా తన నియామకంకు సహకరించినందుకు కృతజ్ఞతలుచెపుతూ, జగిత్యాలఅభివృద్ధికి సహక్రించాలని శ్రీమతి సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు కోరారు.1
- సిర్పూర్ నియోజకవర్గం బెజ్జుర్ మండలం ముంజంపల్లి గ్రామంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివాజీ దేశభక్తి, పరాక్రమం నేటి యువతకు ఆదర్శమని పేర్కొంటూ సమాజంలో ఐక్యత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.1
- బాల్క సుమన్ కి 14 రోజుల రిమాండ్. ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలింపు. ప్రధాన నిందితుడుగా బాల్క సుమన్.. రెండవ నిందితుడిగా చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మంచిర్యాల కవిత ఎదుట హాజరు పరిచిన పోలీసులు...! 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చిన న్యాయమూర్తి..! మరికొద్ది సేపట్లో ఆదిలాబాద్ జిల్లా జైలు కు తరలించనున్న పోలీసులు. ప్రస్తుతం ఇంకా కోర్టులోనే ఉన్న బాల్క సుమన్...! ....1
- Post by Bharath Newz1
- కాగజ్ నగర్ : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్ళు ఫిబ్రవరి 20వ తారీకు నుండి నిలిపివేస్తున్నారనే విషయంలో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారని సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటన లో తెలిపారు.ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ మరియు సీసీఐ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ గడువును పొడిగించే చర్యలు చేపడుతున్నారని, పత్తి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.1
- Post by KR NEWS 3691
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీల మైదానంలో అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలో బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ మాట్లాడుతూ,సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా సమాజ అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన బోధించిన సన్మార్గం సమానత్వం సామాజిక న్యాయం సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని సమాజంలోని ప్రతి వర్గం ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజహర్షి షా,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజేన్, ఐటిడిఎ పీఓ యువరాజ్ మార్మాట్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు బంజారా సమాజ పెద్దలు బంజారా సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.1
- చింతలమానేపల్లి మండల కేంద్రంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఉదయం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం యువత, ప్రజలు పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. శివాజీ ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యం నేటి తరానికి ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1