వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు సోమవారం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించి పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు పలు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా జూలూరుపాడు మండలం దండు తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ.2 లక్షల వ్యయంతో చేపట్టనున్న బాలుర మరుగుదొడ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలుగు పట్టి గుంత తవ్వి పనులను ప్రారంభించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్య అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు . అనంతరం పాపకొల్లు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ చేపట్టనున్న ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు శిబిరాల్లో చురుకుగా పాల్గొంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థిని పూజితను జిల్లా కలెక్టర్ అభినందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు . జూలూరుపాడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, కళాశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు వేసవి శిబిరంలో విద్యార్థులకు మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, కంప్యూటర్ స్కిల్స్, బేసిక్ కోడింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మాథ్స్, క్రీడలు, యోగా తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు. శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వేసవి శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థుల సంఖ్య, నిర్వహణ విధానం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమలోని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యతో పాటు కళలు, క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలపై కూడా దృష్టి పెట్టాలని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభా వికాసం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, విద్యా వారోత్సవాల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు . ఈ ఈ కార్యక్రమాలలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ, సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు ప్రధానోపాధ్యాయులు ఎస్కే మీరా సాహెబ్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు సోమవారం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించి పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు పలు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా జూలూరుపాడు మండలం దండు తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ.2 లక్షల వ్యయంతో చేపట్టనున్న బాలుర మరుగుదొడ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలుగు పట్టి
గుంత తవ్వి పనులను ప్రారంభించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్య అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు . అనంతరం పాపకొల్లు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ చేపట్టనున్న ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు శిబిరాల్లో చురుకుగా పాల్గొంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థిని పూజితను జిల్లా కలెక్టర్
అభినందించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు . జూలూరుపాడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, కళాశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు వేసవి శిబిరంలో విద్యార్థులకు మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, కంప్యూటర్ స్కిల్స్, బేసిక్ కోడింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మాథ్స్, క్రీడలు, యోగా తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు. శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వేసవి శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థుల సంఖ్య, నిర్వహణ విధానం తదితర వివరాలను
అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమలోని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యతో పాటు కళలు, క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలపై కూడా దృష్టి పెట్టాలని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభా వికాసం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, విద్యా వారోత్సవాల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు . ఈ ఈ కార్యక్రమాలలో కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ, సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు ప్రధానోపాధ్యాయులు ఎస్కే మీరా సాహెబ్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఎం పార్టీ కలెక్టరేట్ ధర్నా జిల్లాలో రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, వాటిలో ముఖ్యంగా వరి ధాన్యం, మొక్కజొన్న ను త్వరగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ల ఎదుట రైతుల ధర్నా లో భాగంగా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దానిలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో అరకొర సౌకర్యాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ, తాలు పేరుతో కోతలు విధిస్తున్నారని, వెంటనే ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలలో దళారుల దందాను అరికట్టి మొక్కజొన్నకు 2400 రూపాయల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీపీఎం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.2
- 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨............. 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨 *డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు* *🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం* 🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు, మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు. నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది. 👉 ప్రజలకు సూచన: బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. –కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు1
- బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి, శాఖల వారీగా అందిన ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తూ నివేదిక సమర్పించాలి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సోమవారం *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,* సంబంధిత అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం, ఇతర వేదికల ద్వారా ప్రజల సమస్య పరిష్కారం నిమిత్తం సామాన్య ప్రజలు చేసుకున్న ప్రతి ఒక దరఖాస్తుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తక్షణమే పరిష్కరించి నివేదికను తమకు సమర్పించాలని, తమ పరిధిలో లేని పక్షంలో సంబంధిత విభాగానికి సిఫారసు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం తో పాటు తొర్రూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు, అట్టి దరఖాస్తుల పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు, హైదరాబాద్ నుండి వచ్చిన ప్రజావాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేష్ మహబూబాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రజావాణి ప్రక్రియ యాప్ విధానాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ ను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు, ఈ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రెవెన్యూ విభాగానికి చెందినవి 58, పంచాయతీరాజ్ 14, డిఆర్డిఓ 12, హౌసింగ్, డబుల్ బెడ్ రూమ్ 24, మున్సిపల్ 9, మొత్తం అన్ని విభాగాలు కలిపి (133) దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనల్ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో (9) దరఖాస్తులు వచ్చాయని ఆర్డీవో క్రిష్ణవేణి తెలిపారు, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ( 14 ) దరఖాస్తులు వచ్చాయని ఆర్డిఓ గణేష్ తెలిపారు, ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, అందువలన ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ తెవలు అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, జడ్పీ సీఈవో (హౌసింగ్ పీడీ) పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థాయి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.1
- ఖమ్మం లో మైనర్ బాలికపైన అత్యాచారానికి పాల్పడిన బండి సాయి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి : ఐద్వా జిల్లా కార్యదర్శి బండి పద్మ1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్కు చెందిన కుందన్ సింగ్ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.1