కావూరి రాజకీయ జీవితం... ప్రజాసేవకు అంకితం : ప్రత్తిపాటి కావూరి రాజకీయ జీవితం... ప్రజాసేవకు అంకితం : ప్రత్తిపాటి “మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, కావూరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ నాయకుడిగా కావూరి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన రాజకీయ ప్రస్తానం ఆసాంతం ప్రజాసేవే లక్ష్యంగా సాగింది. చివరి శ్వాశ కూడా ప్రజాసేవకే అంకితమైంది. ఐదుసార్లు ఎంపీగా, గెలిచిన కావూరి, యూపీయే ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర జౌళీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కావూరి భారత జౌళి పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేశారు. తన రాజకీయ జీవితంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పారదర్శకమైన ప్రజాసేవతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచారు. ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిత్యం శ్రమించారు.” అని ప్రత్తిపాటి ఒక ప్రకటనలో కొనియాడారు.
కావూరి రాజకీయ జీవితం... ప్రజాసేవకు అంకితం : ప్రత్తిపాటి కావూరి రాజకీయ జీవితం... ప్రజాసేవకు అంకితం : ప్రత్తిపాటి “మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, కావూరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ నాయకుడిగా కావూరి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన రాజకీయ ప్రస్తానం ఆసాంతం ప్రజాసేవే లక్ష్యంగా సాగింది. చివరి శ్వాశ కూడా ప్రజాసేవకే అంకితమైంది. ఐదుసార్లు ఎంపీగా, గెలిచిన కావూరి, యూపీయే ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర జౌళీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కావూరి భారత జౌళి పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేశారు. తన రాజకీయ జీవితంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పారదర్శకమైన ప్రజాసేవతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచారు. ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిత్యం శ్రమించారు.” అని ప్రత్తిపాటి ఒక ప్రకటనలో కొనియాడారు.
- Post by Anji Raju1
- L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.1
- Post by డాక్టర్ బాబు 70364451131
- నల్గొండ బ్రేకింగ్: నల్లగొండలో మొన్న జరిగిన యాక్సిడెంట్ కేసు తీవ్ర ఉద్రిక్తతకు దారి... యాక్సిడెంట్లో తీవ్ర గాయపడిన ముద్దస్సిర్ ఉద్దీన్ ఖాన్ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచాడు... నేడు హైదరాబాద్ పట్టణంలో చికిత్స పొందుతూ మరణించిన ముదస్సిర్ ను భారీ నిరసన ర్యాలీతో వీటి కాలనీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు తీసుకొని వచ్చారు... నిరసనగా కుటుంబ సభ్యులు నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు... యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకోకుండా వదిలివేయడం ఏంటని నిరుత్సాహపరిచారు కుటుంబ సభ్యులు... వెంటనే ఆక్సిడెంట్ లో గాయపడిన మహిళకు మరియు ముదస్సిర్ ఖాన్ కుటుంబం కు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా నిరసన.. వీరికి మద్దతుగా నలగొండ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజియోద్దీన్ మరియు ఏఐఎంఐఎం కార్పొరేటర్లు నదీమ్, హాజీ, మోయిన, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ మరియు టిఆర్ఎస్ మైనార్టీ నాయకులు జహంగీర్ బాబా, జమాల్ ఖాద్రి కాంగ్రెస్ మైనారిటీ కార్పొరేటర్లు మద్దతుగా ఉన్నారు.. డిప్యూటీ మేయర్ ఆమెర్ మాట్లాడుతూ ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించి బాధితుడికి 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని, ప్రమాదంలో గాయపడిన వారికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తమకు పూర్తి న్యాయం జరిగేవరకు తమ వెంటే ఉంటామని ధైర్యం వ్యక్తం చేశారు.. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు పూర్తి భరోసా లభించే వరకు నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని మృతుని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు...1
- NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- జయ్యారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించి, తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. HM ఉషాశ్రీ విద్యార్థులకు హాల్టికెట్లు అందజేయగా, మాజీ HM తేజోన్నత రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.3
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2
- గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్ గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.1