కావూరి రాజకీయ జీవితం... ప్రజాసేవకు అంకితం : ప్రత్తిపాటి కావూరి రాజకీయ జీవితం... ప్రజాసేవకు అంకితం : ప్రత్తిపాటి “మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, కావూరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ నాయకుడిగా కావూరి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన రాజకీయ ప్రస్తానం ఆసాంతం ప్రజాసేవే లక్ష్యంగా సాగింది. చివరి శ్వాశ కూడా ప్రజాసేవకే అంకితమైంది. ఐదుసార్లు ఎంపీగా, గెలిచిన కావూరి, యూపీయే ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర జౌళీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కావూరి భారత జౌళి పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేశారు. తన రాజకీయ జీవితంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పారదర్శకమైన ప్రజాసేవతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచారు. ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిత్యం శ్రమించారు.” అని ప్రత్తిపాటి ఒక ప్రకటనలో కొనియాడారు.
కావూరి రాజకీయ జీవితం... ప్రజాసేవకు అంకితం : ప్రత్తిపాటి కావూరి రాజకీయ జీవితం... ప్రజాసేవకు అంకితం : ప్రత్తిపాటి “మాజీ కేంద్రమంత్రి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, కావూరి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ నాయకుడిగా కావూరి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన రాజకీయ ప్రస్తానం ఆసాంతం ప్రజాసేవే లక్ష్యంగా సాగింది. చివరి శ్వాశ కూడా ప్రజాసేవకే అంకితమైంది. ఐదుసార్లు ఎంపీగా, గెలిచిన కావూరి, యూపీయే ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర జౌళీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో కావూరి భారత జౌళి పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి విశేష కృషి చేశారు. తన రాజకీయ జీవితంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికే ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పారదర్శకమైన ప్రజాసేవతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచారు. ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కావూరి, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు నిత్యం శ్రమించారు.” అని ప్రత్తిపాటి ఒక ప్రకటనలో కొనియాడారు.
- Post by Bondhu Suresh1
- పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ పోకూడదు: కాంగ్రెస్ నాయకులు, నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె.బి.ఆర్ నాయుడు1
- పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టిడిపి విధానం - కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు. - మలి విడతగా నేడు 67 అన్న క్యాంటీన్ల ప్రారంభం. - అన్న క్యాంటీన్లు రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తున్నాయి. - గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసింది. - కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీకి పునాది అని, ఆ ఆశయ సాధనలో భాగంగానే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చిన కూడు, గూడు, గుడ్డ నినాదమే నేడు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్ఫూర్తినిచ్చిందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీటిని పునరుద్ధరించి రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.కోవూరులో అన్నా క్యాంటీన్ లేదని గతంలో చాలా బాధపడేదానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నేడు ఇక్కడ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల నుంచి ఆసుపత్రి పనుల కోసం, ఇతర అవసరాల కోసం కోవూరు వచ్చే పేదలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సేవలో ముందుంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.4
- స్మాల్ స్కాలర్స్ పాఠశాలలో వారు స్కూల్లో ఏడవ తరగతి వరకు చదివి ఇప్పుడు టెన్త్ క్లాస్ సీబీఎస్సీ పరీక్షలు స్కూల్ టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అభినంద సభ జరిగింది. ఆ సమావేశాలలో స్కూల్ కరస్పాండెంట్ పి పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ ఎల్కేజీ నుండి ఏడవ తరగతి వరకు ప్రారంభించిన మా స్కూలు అనతి కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని అందుకు ఉదాహరణగా మా స్కూలు నందు ఏడవ తరగతి పాసై నగరంలో వివిధ స్కూళ్లలో చదివి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులు వివిధ రకాల పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. పద్మజా రెడ్డి గారి మాట్లాడుతూ స్మాలర్ స్కాలర్ స్కూల్ 2012లో ఈ బిల్డింగ్ లో ప్రారంభించామని ,ప్రీ ప్రైమరీ లెవెల్ లో మాంటిసోరి కరికులం ఫాలో అవుతూ విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాష పరిపూర్ణంగా రావాల్సిన అవసరం ఉంది. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ గా మారిపోయాయి. మా స్కూల్లో రెగ్యులర్గా వివిధ కార్యక్రమాల ద్వారా ఇంగ్లీషులో మాట్లాడడం వారి మాతృభాషలాగా అలవాటు చేశాము. స్కూల్లో జరిగే స్పీచ్ కాంపిటీషన్స్ మరియు డిబేట్ కాంపిటీషన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని పాల్గొనేటట్టు చేస్తున్నాము, దీనివలన ప్రతి విద్యార్థికి పబ్లిక్ స్పీకింగ్ అలవాటవుతుంది. మా పూర్వ విద్యార్థి డి సాత్విక్ రెడ్డి 487 మార్క్స్ తెచ్చుకుని తను తన స్కూల్ టాపర్ గా నిలిచాడు. ఇంగ్లీష్ భాషలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని స్మాలర్ స్కాలర్స్ స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు. ఇదే విధంగా మా పూర్వ విద్యార్థిని వి. ఇవాంజులిన్ 475 మార్కులు తెచ్చుకుని మా స్కూలు పేరు నిలిపింది. విద్యార్థులను నైమిశా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పి .శశిధర్ రెడ్డి గారు మరియు సొసైటీ ట్రెజరర్ బి .రామ్మోహన్ రెడ్డి గారు అభినందించారు. కరస్పాండెంట్ పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ స్కూల్ని సెవెంత్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు త్వరలో ఎక్స్పాండ్ చేస్తున్నామని తెలిపారు.2
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- Post by SS NEWS1
- Post by Bondhu Suresh1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్ ఆవరణలో నిల్వ ఉంచిన రిజెక్ట్ కోల్ ఒక్కసారిగా అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వేసవి తీవ్రతతో పాటు గాలి ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించి దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం లేకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.1
- పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో ఒంటికోట బడులు కావడం ఆపై అధికంగా ఎండ ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయగా చిన్నారులు ఎంచక్కా కెనాల్ లో ఈత కొడుతూ ఎండ వేడిని సేద తీరుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అతి ఎండ ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు చిన్నారులకు ఇంటికి వెళితే అధికంగా వేడి ఉండడంతో ఉపశమనం కొరకు కెనాల్ కాలువలో చల్లని నీటిలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు1