logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*సమస్యలు తెలుసుకునేందుకు బస్తీబాటతెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.* మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షుడు డా"పత్య నాయక్.ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలో సమస్యలను తెలుసుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీబాట నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.13వ వార్డులో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పత్య నాయక్, ఆ వార్డు ముఖ్య నాయకులు గుజ్జరి గోపి, చాంద్ పాషా, అచ్చయ్య రమేష్ ఆధ్వర్యంలో శనివారం బస్తీబాట నిర్వహించారు. బస్తీబాటకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కాలనీలో తిరుగుతూ కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ లైట్లు,త్రాగునీరు డ్రైనేజీ,రోడ్లు,పారిశుద్ధం మౌలిక వసతులపై ప్రజలు సమస్యలు విన్నవించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా ఆమనగల్లు అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఎలాంటి పనులు చేపట్టలేదని ఆరోపించారు. మున్సిపల్ అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి, ఎంగలి రఘు, కమటం వెంకటయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమళ్ళ సుభాష్, మాజీ ఉపసర్పంచ్ గుమ్మకొండ రాజు, బిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు డేరంగుల వెంకటేష్,బిఆర్ఎస్ మున్సిపాలిటీ కార్యదర్శి వడ్డెమోని శివ కుమార్, సైదులు గౌడ్, నాగిళ్ల జగన్, ఎనుమల్ల రమేష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లండం యాదయ్య, కొమ్ము ప్రసాద్, జంతుక కిరణ్ వరికుప్పల గణేష్, వస్పుల రంజిత్, లండం యాదగిరి, శ్రీరాములు,దారయాదయ్య,ముజాహిద్,లలితమ్మవిమలమ్మ, కాజా, అషు, అజ్జు కుర్షిత బేగం,అమృతమ్మ, కళావతి,భారతమ్మ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు

16 hrs ago
user_Shaik Habeeb
Shaik Habeeb
Journalist కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
16 hrs ago
8e5debcd-3747-47c5-b02d-c589c608e0be

*సమస్యలు తెలుసుకునేందుకు బస్తీబాటతెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.* మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షుడు డా"పత్య నాయక్.ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలో సమస్యలను తెలుసుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్తీబాట నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.13వ వార్డులో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పత్య నాయక్, ఆ వార్డు ముఖ్య నాయకులు గుజ్జరి గోపి, చాంద్ పాషా, అచ్చయ్య రమేష్ ఆధ్వర్యంలో శనివారం బస్తీబాట నిర్వహించారు. బస్తీబాటకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కాలనీలో తిరుగుతూ కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ లైట్లు,త్రాగునీరు డ్రైనేజీ,రోడ్లు,పారిశుద్ధం మౌలిక వసతులపై ప్రజలు సమస్యలు విన్నవించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా ఆమనగల్లు అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఎలాంటి పనులు చేపట్టలేదని ఆరోపించారు. మున్సిపల్ అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి, ఎంగలి రఘు, కమటం వెంకటయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమళ్ళ సుభాష్, మాజీ ఉపసర్పంచ్ గుమ్మకొండ రాజు, బిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు డేరంగుల వెంకటేష్,బిఆర్ఎస్ మున్సిపాలిటీ కార్యదర్శి వడ్డెమోని శివ కుమార్, సైదులు గౌడ్, నాగిళ్ల జగన్, ఎనుమల్ల రమేష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లండం యాదయ్య, కొమ్ము ప్రసాద్, జంతుక కిరణ్ వరికుప్పల గణేష్, వస్పుల రంజిత్, లండం యాదగిరి, శ్రీరాములు,దారయాదయ్య,ముజాహిద్,లలితమ్మవిమలమ్మ, కాజా, అషు, అజ్జు కుర్షిత బేగం,అమృతమ్మ, కళావతి,భారతమ్మ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*
    1
    *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*
    user_Journalist Madhu
    Journalist Madhu
    Journalist కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    17 hrs ago
  • కాలుష్య పరిశ్రమలను తొలగించాలని కోరుతూ దోమడుగు గ్రామస్తులు నిరసన
    1
    కాలుష్య పరిశ్రమలను తొలగించాలని కోరుతూ దోమడుగు గ్రామస్తులు నిరసన
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
    1
    శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    Journalist Rolla, Sri Sathya Sai•
    23 hrs ago
  • కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.
    1
    కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    Journalist పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కర్నూలు జిల్లా... ఆలూరు నియోజకవర్గం... నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు... పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...
    4
    కర్నూలు జిల్లా...
ఆలూరు నియోజకవర్గం...
నేడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆలూరులో వడ్డెర కులస్తులు అంగరంగ వైభయంగా జరుపుకున్నారు...
పురవీధుల్లో వడ్డే ఓబన్న చిత్రపటం ఊరేగింపుగా చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల ఏసి ఘనంగా నివాళులర్పించారు...
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి నాయకులు గుమ్మనూరు కమలమ్మ, గుమ్మనూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన తొలి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నుముకల ఆయన నిలిచారన్నారు.. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నారాయణ అన్నారు...
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..
    Reporter ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    1
    Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    2 hrs ago
  • బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.
    1
    బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చడం కాంగ్రెస్ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి 
తెలంగాణలో తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం ప్రజల్ని పరిపాలిస్తుందని మాజీమంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు పనులు పూర్తి చేయలేక లేనిపోని ఆ పనిని వేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు పేరు మార్చి పనులు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వెంటనే వైఖరి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలిపారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    19 min ago
  • సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో రేపు విడుదల చేయనున్న తుది జాబితా
    1
    సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో రేపు విడుదల చేయనున్న తుది జాబితా
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.! కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
    2
    బద్వేలు: అన్నదమ్ముల మధ్య గొడవ.. ఒకరు మృతి.!
కడప జిల్లా గోపవరం మండలం నెల్లూరు రోడ్డులోని సత్య టౌన్షిప్ వద్ద గాయాలతో ఇద్దరు వ్యక్తులు పడి ఉన్నారు. ఇరువురి తలలపై తీవ్ర గాయాలై ఉన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించినట్లు సమాచారం. వారు ఇద్దరూ కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన అన్నదమ్ములుగా స్థానికులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఇరువురు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    Journalist పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.