*ట్యాంక్ బండి పై గణపతి విగ్రహాల నిమజ్జనం నిషేధం?* హైదరాబాద్:సెప్టెంబర్ 16 హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈసారి గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ జిహెచ్ఎం సి, హైదరాబాద్ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదివరకు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వు లకు అనుగుణంగా సాగర తీరాన ఈ హెచ్చరిక ఫ్లెక్సీలు బ్యానర్లు వెలిశాయి.. భక్తులకు సమాచారం అందించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జిహెచ్ ఎంసి కమిషనర్ల పేరిట ఈ ఫ్లెక్సీలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు. హైకోర్టు మార్గదర్శ కాలకు అనుగుణంగా అధికారులు నెక్లెస్ రోడ్డు పరిసరాలలో ప్రత్యేక నిమజ్జన ఏర్పాట్లను ముమ్మ రం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాంక్ బండ్ వైపు విగ్రహాల నిమజ్జనా నికి అనుమతి లేదని ఈ బోర్డుల ద్వారా స్పష్టం చేశారు.నీటిని కాలుష్యం బారి నుంచి కాపాడేం దుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని అధికారు లు నిర్ణయించారు. *నెక్లెస్ రోడ్డులో ప్రత్యేక ఏర్పాట్లు* హుస్సేన్ సాగర్ వైపు వచ్చే విగ్రహాలను అప్పర్ ట్యాంక్ బండ్ వైపునకు వెళ్లకుండా నిరోధించేందుకు అధికారులు నెక్లెస్ రోడ్డు తీరం వెంబడి మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన ప్రక్రియను సులభతరం చేయడా నికి ఈ ప్రాంతంలో మరిన్ని క్రేన్లు, ప్రత్యేక ప్లాట్ఫారమ్లను ఏర్పాటు చేస్తున్నా రు. విగ్రహాల నిమజ్జ నానికి వచ్చే నిర్వాహ కులు ఎకో-ఫ్రెండ్లీ పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
*ట్యాంక్ బండి పై గణపతి విగ్రహాల నిమజ్జనం నిషేధం?* హైదరాబాద్:సెప్టెంబర్ 16 హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈసారి గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ జిహెచ్ఎం సి, హైదరాబాద్ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదివరకు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వు లకు అనుగుణంగా సాగర తీరాన ఈ హెచ్చరిక ఫ్లెక్సీలు బ్యానర్లు వెలిశాయి.. భక్తులకు సమాచారం అందించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జిహెచ్ ఎంసి కమిషనర్ల పేరిట ఈ ఫ్లెక్సీలను ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు. హైకోర్టు మార్గదర్శ కాలకు అనుగుణంగా అధికారులు నెక్లెస్ రోడ్డు పరిసరాలలో ప్రత్యేక నిమజ్జన ఏర్పాట్లను ముమ్మ రం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాంక్ బండ్ వైపు విగ్రహాల నిమజ్జనా నికి అనుమతి లేదని ఈ బోర్డుల ద్వారా స్పష్టం చేశారు.నీటిని కాలుష్యం బారి నుంచి కాపాడేం దుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని అధికారు లు నిర్ణయించారు. *నెక్లెస్ రోడ్డులో ప్రత్యేక ఏర్పాట్లు* హుస్సేన్ సాగర్ వైపు వచ్చే విగ్రహాలను అప్పర్ ట్యాంక్ బండ్ వైపునకు వెళ్లకుండా నిరోధించేందుకు అధికారులు నెక్లెస్ రోడ్డు తీరం వెంబడి మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన ప్రక్రియను సులభతరం చేయడా నికి ఈ ప్రాంతంలో మరిన్ని క్రేన్లు, ప్రత్యేక ప్లాట్ఫారమ్లను ఏర్పాటు చేస్తున్నా రు. విగ్రహాల నిమజ్జ నానికి వచ్చే నిర్వాహ కులు ఎకో-ఫ్రెండ్లీ పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం** *కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు* *బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్* ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: HMS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని HMS రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని మేనేజర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 నెలలుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. గనుల్లో పనిచేసే కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు తక్షణమే అందించాలని కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.1
- టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.1
- ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.1
- డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- రిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బోథ్ MLA అనిల్ జాదవ్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదేశించారు.3
- * (ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు):* *2016 దివ్యాంగుల హక్కుల చట్టం పూర్తి అమలు* రాష్ట్రంలో దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. దీనికై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలి. దివ్యాంగులందరికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇళ్లు': సురక్షితమైన నివాసం మరియు ఆత్మగౌరవం కోసం ప్రతి దివ్యాంగుడికీ ఉచితంగా 'ఇంద్రమ్మ ఇల్లు' మంజూరు చేయాలి. పెన్షన్ల పెంపు: దివ్యాంగుల పెన్షన్ను ₹6,000కు, అలాగే తీవ్ర వైకల్యం కలిగిన వారికి ₹15,000కు తక్షణమే పెంచాలి. బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ: ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. ఉచిత ప్రయాణ సౌకర్యం: ఆర్టీసీ బస్సులతో పాటు హెచ్ఎంఆర్ (HMR) మెట్రో రైళ్లలో కూడా దివ్యాంగులందరికీ ఉచిత పాస్ సౌకర్యం కల్పించాలి. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు: స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం ఇవ్వాలి. స్వతంత్ర కార్యాలయాల ఏర్పాటు: జీవో 34 ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దివ్యాంగుల వ్యవహారాల కోసం ప్రత్యేక స్వతంత్ర కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం: దివ్యాంగ విద్యార్థులకు సరైన విద్య అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన (Special Education) ఉపాధ్యాయులను నియమించాలి. సదరమ్ (SADAREM) సేవల మార్పు: రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్థోపెడిక్ సదరన్ క్యాంపులను హైదరాబాద్కు మార్చి, దివ్యాంగులకు సేవలను మరింత చేరువ చేయాలి.3
- చెన్నూరు: చెత్త సేకరణలో వివక్ష.. ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తుడు చెన్నూరు మండలం అంగరాజుపల్లిలో చెత్త సేకరణ విషయంలో వివక్ష చూపుతున్నారని గ్రామానికి చెందిన తిరుపతి ఆరోపించారు. జనరల్ వార్డు కాలనీలో మాత్రమే చెత్త బండి ద్వారా వ్యర్థాలను సేకరిస్తున్నారని, ఇతర వార్డులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డుల్లోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.1