భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లపై షెడ్యూల్డ్ కాస్ట్ సంక్షేమ శాఖ డీడీ శ్రీలత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్ చేశారు. భద్రాచలంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హాస్టల్ వర్కర్లకు 16 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం, తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినందుకు కొందరిపై చర్యలు తీసుకోవడం, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విధులను నిలిపివేయడం, నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయడం వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. అత్యల్ప వేతనాలతో కుటుంబాన్ని పోషిస్తున్న వర్కర్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కామ్రేడ్ సతీష్ తెలిపారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, హాస్టల్ వర్కర్ల సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ నాయకురాలు మడకం సమ్మక్క, పీవైఎల్ నాయకులు మట్ట నరసింహరావు, కారం జైరాజు, రమేష్ సహా పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లపై షెడ్యూల్డ్ కాస్ట్ సంక్షేమ శాఖ డీడీ శ్రీలత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్ చేశారు. భద్రాచలంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హాస్టల్ వర్కర్లకు 16 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం, తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినందుకు కొందరిపై చర్యలు తీసుకోవడం, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విధులను నిలిపివేయడం, నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు
చేయడం వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. అత్యల్ప వేతనాలతో కుటుంబాన్ని పోషిస్తున్న వర్కర్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కామ్రేడ్ సతీష్ తెలిపారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, హాస్టల్ వర్కర్ల సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ నాయకురాలు మడకం సమ్మక్క, పీవైఎల్ నాయకులు మట్ట నరసింహరావు, కారం జైరాజు, రమేష్ సహా పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్లపై షెడ్యూల్డ్ కాస్ట్ సంక్షేమ శాఖ డీడీ శ్రీలత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్ చేశారు. భద్రాచలంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హాస్టల్ వర్కర్లకు 16 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం, తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినందుకు కొందరిపై చర్యలు తీసుకోవడం, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విధులను నిలిపివేయడం, నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేయడం వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. అత్యల్ప వేతనాలతో కుటుంబాన్ని పోషిస్తున్న వర్కర్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కామ్రేడ్ సతీష్ తెలిపారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, హాస్టల్ వర్కర్ల సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ నాయకురాలు మడకం సమ్మక్క, పీవైఎల్ నాయకులు మట్ట నరసింహరావు, కారం జైరాజు, రమేష్ సహా పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.2
- భద్రాచలంలోని శ్రీరామాలయ విస్తరణ పనులు మొదలయ్యాయి. ఈ పనులను Today9TV నివేదించింది.1
- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 72 శాతం కాంట్రాక్టులు ఇస్తామన్న రేవంత్ రెడ్డి హామీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాటల ప్రకారం, ₹4,400 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి మూడు వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు అందాల్సి ఉంది. అయితే, వారికి కనీసం మూడు రూపాయలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంలో గోదావరి వరదల నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు ప్రణాళికలు, తీసుకోవలసిన చర్యలపై జిల్లాస్థాయి ఉన్నత అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, గోదావరి వరదల ముందస్తు ప్రణాళికకు సంబంధించి అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాసనసభ్యులు, ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు.3
- పోలాండ్లోని ఒక పార్కులో పిల్లలు ఆడుకుంటుండగా, వారి పక్కనే ఉన్న ఫౌంటేన్పై ఒక్కసారిగా పిడుగు పడిన షాకింగ్ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెప్పపాటులో జరిగిన ఈ మెరుపుపాటు సంఘటన అక్కడి సర్వైలెన్స్ కెమెరాలో రికార్డైంది. ఎగిసిపడుతున్న నీటిని పిడుగు తాకిన ఈ అరుదైన దృశ్యం నెటిజన్లను తీవ్రంగా విస్మయానికి గురిచేస్తోంది.1
- మహబూబాబాద్ జిల్లాలోని నాగారం–దమ్మాయిగూడెం రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, అక్కడి గుంతలు ప్రజలకు నిత్యం ప్రమాదకరంగా మారాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) నాయకత్వం స్పందించింది. ప్రజల ప్రాణాలు బలి తీసుకునేలోపు ఈ గుంతల రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించింది. ఈ చర్యను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ గండ్ర కమలాకర్ పటేల్ గారు, టీఆర్పీ నాయకులు కోడూరి ప్రవీణ్ కుమార్ గారు పర్యవేక్షించారు. ప్రజల భద్రత కోసం ముందుకు వచ్చిన ఈ నాయకత్వాన్ని అభినందిస్తూ, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. పదవుల్లో ఉండటం నాయకత్వం కాదని, ప్రజల కష్టాల్లో నిలబడటమే నిజమైన నాయకత్వం అని టీఆర్పీ స్పష్టం చేసింది.1
- ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో, ఇంటి సమీపంలోని పొలంలో కట్టివేసి ఉన్న 21 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ అకస్మిక ఘటనతో పశువుల యజమాని సమ్మయ్యతో పాటు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో పశువులు మరణించడంతో యజమానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదిలో వరదల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో వరదల సన్నద్ధతలో భాగంగా చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ అంకిత్ మంత్రికి వివరించారు. జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్తో పాటు మండల స్థాయిలో ఎమర్జెన్సీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను గుర్తించి, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, పారిశుధ్యం, ఆహార సరఫరా, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. క్విక్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచి, అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ వరదల సమయంలో ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంటుందని, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖలతో సమన్వయంతో సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని, వైద్యశాఖ అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. భద్రాచలం పట్టణంలో వర్షపు నీరు వేగంగా వెళ్లిపోయేలా పంపింగ్ మోటార్లను సిద్ధంగా ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. భద్రాచలం–కూనవరం కరకట్ట నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, సారపాక జాతీయ రహదారిపై ఐటీసీ ఈస్ట్ గేట్ సమీపంలో వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా రహదారి ఎత్తును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బూర్గంపాడు, అశ్వాపురం ప్రాంతాలు వరదలకు అధికంగా గురయ్యే అవకాశమున్నందున ముందస్తు చర్యలు మరింత బలోపేతం చేయాలని కోరారు. పరిశ్రమల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఐటిడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శేష్ట, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందనతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని వరదల సమయంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.3