Shuru
Apke Nagar Ki App…
నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద కార్మికుడి ఆత్మహత్యాయత్నం – ఉద్రిక్తత వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం కార్మికుల సమ్మె సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఒక డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే సహచరులు మంటలను ఆర్పి అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
M D Azizuddin
నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద కార్మికుడి ఆత్మహత్యాయత్నం – ఉద్రిక్తత వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం కార్మికుల సమ్మె సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఒక డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే సహచరులు మంటలను ఆర్పి అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్న మనస్తాపంతో ఆయన నిప్పంటించుకున్నట్లు కార్మికులు తెలిపారు. వెంటనే తోటి సిబ్బంది ఆయనను హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్యశారద, సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.1
- నర్సంపేట ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్న విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపింది. డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం కలవరపరిచింది. ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం ప్రకారం, డ్రైవర్ శంకర్ గౌడ్ తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆవేదనతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సంఘటనను గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి, తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను అత్యవసర చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అక్కడ మోహరించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- హనుమకొండ జిల్లా : కార్మికులను అడ్డుకున్న పోలీసులు.. హనుమకొండ లోకల్ డిపో ఎదురుగా నిరసన తెలిపేందుకు వెళుతున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీసీ ఐకాసా ఆధ్వర్యంలో సుమారు 200 మంది బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీగా వెళుతుండగా పోలీసులు రాంనగర్ కూడలి వద్ద అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా నియంత్రించడం సరికాదని ఐకాస నేతలు అన్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడని సమాచారం. ఈ ఘటనను గమనించిన సహోద్యోగులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం గాయపడిన శంకర్ గౌడ్ను తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో నర్సంపేట డిపోలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పోతిరెడ్డిపేట నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, పలుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దంటే వద్దు డంపింగ్ యార్డ్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర హుజరాబాదుకె పరిమితం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, బీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో శంకరపట్నం మానకొండూర్ మండలాల్లో పాదయాత్ర చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లు రాజీనామా చేయడమో, డంపింగ్ యార్డు రద్దు కావడమో జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.3
- Post by User4017 Budhiya Kan ke2
- నకిరేకల్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదవులు అనుభవించి, తెలంగాణ ఉద్యమంతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి గారు గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే, నేడు అదే వేముల వీరేశం పార్టీ అధినేతలు కేసీఆర్, కేటీఆర్ గార్లను విమర్శించడం అత్యంత దారుణమని, ఆయనకు ఆ స్థాయి లేదని మండిపడ్డారు. పార్టీ అండతో రాజకీయంగా ఎదిగి, కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న వేముల వీరేశం తీరును ఆయన తప్పుబడుతూ, చేసిన మేలును మరచి అధినేతలపై అవాకులు చెవాకులు పేలడం తగదని హెచ్చరించారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద గురువారం కార్మికుల సమ్మె సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఒక డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే సహచరులు మంటలను ఆర్పి అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ఆగ్రహించిన కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.1