Shuru
Apke Nagar Ki App…
రానున్న ఎన్నికలలో BRS జెండా ఎగరవేయలని కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ చిరుమర్తి లింగయ్య గారి సమక్షంలో రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన నక్క నరేందర్ గారిని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నక్క నరేందర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం పాలకవర్గం తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Nagesh Kothapalli
రానున్న ఎన్నికలలో BRS జెండా ఎగరవేయలని కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ చిరుమర్తి లింగయ్య గారి సమక్షంలో రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన నక్క నరేందర్ గారిని బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నక్క నరేందర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం పాలకవర్గం తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
More news from Telangana and nearby areas
- NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- జయ్యారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించి, తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. HM ఉషాశ్రీ విద్యార్థులకు హాల్టికెట్లు అందజేయగా, మాజీ HM తేజోన్నత రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.3
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.1
- మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.1
- Post by డాక్టర్ బాబు 70364451131
- టీమిండియా తదుపరి కెప్టెన్ సంజూ శాంసన్? మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు! టీ20 ప్రపంచకప్లో భారత్ సాధించిన అద్భుత విజయం తర్వాత, జట్టు భవిష్యత్తు నాయకత్వంపై ఆసక్తికర చర్చ మొదలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. వార్తలోని ముఖ్యాంశాలు: కైఫ్ జోస్యం: సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 జట్టుకు నాయకత్వం వహించే అన్ని అర్హతలు సంజూ శాంసన్కు ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్లో వీరవిహారం: ఈ మెగా టోర్నీలో సంజూ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది రికార్డు సృష్టించారు. కీలక ఇన్నింగ్స్: సెమీ ఫైనల్ మరియు ఫైనల్ వంటి హై-ప్రెషర్ మ్యాచ్ల్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. నమ్మకమైన ఆటగాడు: సంజూ ప్రదర్శనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది.1
- దేశాయిపేటలోని జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు ఓ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, ఇతర అవసరమైన వస్తువులతో కూడిన పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ నటుడు మరియు సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన Sonu Sood వీడియో కాల్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి వారికి ప్రోత్సాహం అందించారు. చదువుపై దృష్టి పెట్టాలని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన సూచించారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకోబడ్డాయి, వీటి విలువ సుమారు ₹45,000. అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.1