'హోటళ్ల బంద్'...... భోజన ప్రియులకు భారీ షాక్!......... 'హోటళ్ల బంద్'.. భోజన ప్రియులకు భారీ షాక్! బెంగళూరు: నగరంలోని హోటళ్లు మరియు రెస్టారెంట్ల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి (మార్చి 10, 2026) నుంచి నగరవ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియా (Middle East) లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో వంట వండటం సాధ్యం కాక, హోటళ్లను నిరవధికంగా బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా బ్యాచిలర్స్, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు మరియు ఆస్పత్రుల్లో ఉండే రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటల్ యజమానులు కోరుతున్నారు. గ్యాస్ నిల్వలు పెరిగే వరకు ఈ బంద్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
'హోటళ్ల బంద్'...... భోజన ప్రియులకు భారీ షాక్!......... 'హోటళ్ల బంద్'.. భోజన ప్రియులకు భారీ షాక్! బెంగళూరు: నగరంలోని హోటళ్లు మరియు రెస్టారెంట్ల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి (మార్చి 10, 2026) నుంచి నగరవ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియా (Middle East)
లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో వంట వండటం సాధ్యం కాక, హోటళ్లను నిరవధికంగా బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల
ముఖ్యంగా బ్యాచిలర్స్, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు మరియు ఆస్పత్రుల్లో ఉండే రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటల్ యజమానులు కోరుతున్నారు. గ్యాస్ నిల్వలు పెరిగే వరకు ఈ బంద్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్! బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.దీక్షలో ఆమెతో పాటు డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్హౌస్ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మల్లన్నసాగర్కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Termites existence, not to be ignored, love your home.1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్1