కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ జోగులాంబ గద్వాల జిల్లా: ఖమ్మం జిల్లా వెలుగుమెట్ల లో పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లతో వారి నివాసాలు కూల్చేయడం అన్యాయమని, ఇళ్లను కూల్చినచోటే మరో కొత్త ఇళ్లను కట్టించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ పాల్గొని పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న న్యాయపోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. ప్రజలపై ఎలాంటి చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పేదలని ఎంపిక చేసుకొని వారిపై బుల్డోజర్ల ప్రభుత్వం కొనసాగిస్తున్నారని ఇది ముమ్మాటికీ హేయమైన చర్య అని అన్నారు. హైదరాబాద్ నగరంలో పెద్దల యొక్క అక్రమ కట్టడాలను వదిలేసి పేదలపై వారి అధికార అహంకారాన్ని చూపించడం దారుణం అన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసు యంత్రంగాన్ని అడ్డం పెట్టుకుని పేదలపై జులుం ప్రదర్శించడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులతో పాటు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, మండల నాయకులు ప్రేమ్ రాజ్,మునెప్ప, దొడ్డెన్న,అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ జోగులాంబ గద్వాల జిల్లా: ఖమ్మం జిల్లా వెలుగుమెట్ల లో పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లతో వారి నివాసాలు కూల్చేయడం అన్యాయమని, ఇళ్లను కూల్చినచోటే మరో కొత్త ఇళ్లను కట్టించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ పాల్గొని పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న న్యాయపోరాటానికి తాము అండగా ఉంటామన్నారు. ప్రజలపై ఎలాంటి చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పేదలని ఎంపిక చేసుకొని వారిపై బుల్డోజర్ల ప్రభుత్వం కొనసాగిస్తున్నారని ఇది ముమ్మాటికీ హేయమైన చర్య అని అన్నారు. హైదరాబాద్ నగరంలో పెద్దల యొక్క అక్రమ కట్టడాలను వదిలేసి పేదలపై వారి అధికార అహంకారాన్ని చూపించడం దారుణం అన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసు యంత్రంగాన్ని అడ్డం పెట్టుకుని పేదలపై జులుం ప్రదర్శించడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులతో పాటు నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, మండల నాయకులు ప్రేమ్ రాజ్,మునెప్ప, దొడ్డెన్న,అంజి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా గుడ్డులాట పిడి జాతర1
- కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు 12 చెక్కులు పంపిణీ చేశారు తద్వారా 7. 63 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆపద సమయాల్లో సీఎం చంద్రబాబు పెద్దకొడుకుల నిరుపేదల పండగ నిలుస్తున్నారని ఎమ్మెల్యే పివి పార్థసారథి తెలిపారు.4
- టీమిండియా తదుపరి కెప్టెన్ సంజూ శాంసన్? మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు! టీ20 ప్రపంచకప్లో భారత్ సాధించిన అద్భుత విజయం తర్వాత, జట్టు భవిష్యత్తు నాయకత్వంపై ఆసక్తికర చర్చ మొదలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. వార్తలోని ముఖ్యాంశాలు: కైఫ్ జోస్యం: సూర్యకుమార్ యాదవ్ తర్వాత టీమిండియా టీ20 జట్టుకు నాయకత్వం వహించే అన్ని అర్హతలు సంజూ శాంసన్కు ఉన్నాయని కైఫ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్లో వీరవిహారం: ఈ మెగా టోర్నీలో సంజూ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది రికార్డు సృష్టించారు. కీలక ఇన్నింగ్స్: సెమీ ఫైనల్ మరియు ఫైనల్ వంటి హై-ప్రెషర్ మ్యాచ్ల్లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. నమ్మకమైన ఆటగాడు: సంజూ ప్రదర్శనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మరియు క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ రేసులో సంజూ శాంసన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది.1
- ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ మరియు హంస ఆధ్వర్యంలో మార్చి 15 న నిర్వహించనున్న "మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం" పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో మన ఉనికిని చాటుకోవడానికి ఈ వేదికను సిద్ధం చేసినట్లు తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా (నీలి జెండా నుండి ఎర్ర జెండా వరకు, ఆర్ఎస్యూ నుండి ఆర్ఎస్ఎస్ వరకు), మాల జాతి బిడ్డలందరూ ఒకే తాటిపైకి రావాలి అని కోరారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మాల యువతను ఉన్నత శిఖరాలకు చేర్చేలా విధివిధానాల రూపకల్పన. రాజకీయ రంగంలో మాలల వాటాను, ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే దిశగా పోరాడాలి అని అన్నారు. జాతి అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మన ఆలోచనా విధానం మాల జాతి పురోగతికి తోడ్పడేలా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలనీ వారు కోరారు.1
- వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (VCIWU) రిజిస్ట్రార్ గా ఇటీవల నియమితులైన ప్రొఫెసర్.విజయలక్ష్మి గారిని యూనివర్సిటీ దర్బార్ హాలులో ఉన్న వారి ఛాంబర్ లో కలిసి పూలబోకే శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నాయకులు జాతీయ అధ్యక్షులు డా.సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి డా.కొమ్ము శేఖర్ మాదిగ,రాష్ట్ర సీనియర్ నాయకులు వీరపాకుల పరుశురాం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్లి అనిల్ మాదిగ,ఓయూ ఉపాధ్యక్షులు కోల హరీష్ మాదిగ, ఓయూ నాయకులు కనకపూడి మహేంద్ర మాదిగ,పోతుగంటి ఉదయ్ కిరణ్ మాదిగ,ధార సతీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.1
- పదవ తరగతి విద్యార్థులకు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సూచనలు1
- మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4