జనగణన 2027 విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పూర్తి సహకారం అందించాలి - తహశీల్దార్ బండి ఆత్మకూరు మండలంలోని ప్రజలందరూ జనగణన 2027 విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని తహశీల్దార్ పద్మావతమ్మ కోరారు. ఆమె మాట్లాడుతూ.. జనగణన 2027 – స్వీయ లెక్కింపు సౌకర్యం కార్యక్రమం 16 ఏప్రిల్ 2026 నుండి 30 ఏప్రిల్ 2026 వరకు భారత ప్రభుత్వం నిర్వహించనున్న జనగణన 2027లో భాగంగా, ప్రజల సౌకర్యార్థం స్వీయ లెక్కింపు అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానంలో గృహాలు స్వచ్ఛందంగా ఆన్లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. కావున గృహాలకు ఎన్యూమరేటర్ రావడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సులభంగా మరియు వేగంగా వివరాలు సమర్పించవచ్చు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (HLO Phase–1) సమయంలో, పౌరులు తమ మొబైల్ నంబర్ ద్వారా నమోదు చేసుకొని, కుటుంబ సభ్యులు, నివాస పరిస్థితులు, మౌలిక వసతులు తదితర వివరాలను నమోదు చేయవచ్చు. సమర్పించిన సమాచారం సెన్సస్ చట్టం ప్రకారం గోప్యంగా ఉంచబడుతుంది. ప్రజలందరూ ఈ డిజిటల్ సౌకర్యాన్ని వినియోగించుకొని, సమయానికి మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరడమైనది. అయితే, స్వీయ లెక్కింపు చేయని గృహాలను కవర్ చేయడానికి ఎన్యూమరేటర్లు సందర్శిస్తారని తెలిపారు
జనగణన 2027 విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పూర్తి సహకారం అందించాలి - తహశీల్దార్ బండి ఆత్మకూరు మండలంలోని ప్రజలందరూ జనగణన 2027 విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని తహశీల్దార్ పద్మావతమ్మ కోరారు. ఆమె మాట్లాడుతూ.. జనగణన 2027 – స్వీయ లెక్కింపు సౌకర్యం కార్యక్రమం 16 ఏప్రిల్ 2026 నుండి 30 ఏప్రిల్ 2026 వరకు భారత ప్రభుత్వం నిర్వహించనున్న జనగణన 2027లో భాగంగా, ప్రజల సౌకర్యార్థం స్వీయ లెక్కింపు అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానంలో గృహాలు స్వచ్ఛందంగా ఆన్లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. కావున గృహాలకు ఎన్యూమరేటర్ రావడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సులభంగా మరియు వేగంగా వివరాలు సమర్పించవచ్చు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (HLO Phase–1) సమయంలో, పౌరులు తమ మొబైల్ నంబర్ ద్వారా నమోదు చేసుకొని, కుటుంబ సభ్యులు, నివాస పరిస్థితులు, మౌలిక వసతులు తదితర వివరాలను నమోదు చేయవచ్చు. సమర్పించిన సమాచారం సెన్సస్ చట్టం ప్రకారం గోప్యంగా ఉంచబడుతుంది. ప్రజలందరూ ఈ డిజిటల్ సౌకర్యాన్ని వినియోగించుకొని, సమయానికి మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరడమైనది. అయితే, స్వీయ లెక్కింపు చేయని గృహాలను కవర్ చేయడానికి ఎన్యూమరేటర్లు సందర్శిస్తారని తెలిపారు
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..1
- ఉపాధి హామీ కూలీల హాజరు నమోదులో మల్దకల్ గ్రామ పంచాయతీ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొత్తగా వచ్చిన ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, 620 మంది కూలీల డేటాను నమోదు చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 9 మంది వర్కింగ్ మెట్ల కృషితో తెల్లవారుజామునే లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. కార్యదర్శి చొరవను జిల్లా అధికారులు అభినందించారు. సాంకేతిక వినియోగంలో మల్దకల్ ఆదర్శనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు పొందింది.1
- వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది1
- బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ1
- రైతు రాజన్నాడం తప్పు రైతుకు గిట్ట పట్టేలార కావాలి అంటూ ఆహ్వానిస్తున్నారు1
- వైయస్ఆర్సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ.....1
- బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు3