Shuru
Apke Nagar Ki App…
రేగిడి ఆమదాలవలస సంకిలి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన
రమేష్ లావేటి
రేగిడి ఆమదాలవలస సంకిలి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రేగిడి ఆమదాలవలస సంకిలి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన1
- సంతకవిటి : అల్పపీడనం ప్రభావంతో నాగావళి నది కి భారీ గా వరద నీరు సంతకవిటి మండలం రంగరాయ పురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టు కు 10460 క్యూసిక్కుల నీరు ప్రవహిస్తుoదని ఆయకట్టు ఏ ఈ శివాజీ తెలిపారు. దీంతో దిగివకు నీరు విడిచిపెడుతున్నామని నదిలోకి ఎవరు దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.1
- రాజాంలో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోపాలపురానికి చెందిన శేఖర్ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు రాగా రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు, దుర్గాప్రసాద్, దిలీప్ కలిసి నగదు, బైక్ ఇవ్వాలని బెదిరించారు. భయపడిన అతడు వాటిని ఇచ్చేశారు. అనంతరం ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ అరెస్ట్: సీఐ1
- పెయ్య దూడలకు విశ్రాంతి విడిదిగా మారిన ట్రాఫిక్ సిగ్నల్స్ పోస్టు..! శ్రీకాకుళం నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వాహనాల రద్దీతో ఎప్పుడు కిటికీటలాడుతూ కనిపిస్తాది. అయినా ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుని గాని ట్రాఫిక్ సిగ్నల్స్ గాని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా తరచు ఈ జంక్షన్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, రోడ్డు దుర్ఘటనలు జరగడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్, సిగ్నలింగ్ వ్యవస్థ ఉండేవి. అయితే కాలక్రమంలో అవి కనుమరుగైపోయాయి. అప్పట్లో ఏర్పాటు చేసిన పోలీస్ పోస్ట్ ప్రస్తుతం పెయ్య దూడలకు విశ్రాంతి హబ్ గా తయారైంది! ఈ ఈ జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- విజయనగరం జిల్లా రాజాం :దివంగత మహా నేత వైస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ లో డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ గుమ్మడి జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాంకి చెందిన దూబ రాంబాబు.. డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ ఉమ్మడి జిల్లా మేనేజర్. దివంగత మహానేత వైయస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీలో జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాం కి చెందిన దూబ రాంబాబు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో వైద్య రంగంలో విశేష సేవలందించడంతో పాటు ట్రెబల్ ప్రాంతాల్లోకి ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడంలో ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాంబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్ లో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ అమోస్ చేతులుమీదుగా డాక్టరేట్ అందుకున్నారు. రాంబాబుకు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు అభినందనలు తెలిపారు.1
- నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు ఘనంగా రాఖీ పండగ నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ పిల్లలు ఘనంగా రాఖీ పౌర్ణమి పండగ శుక్రవారం జరిపారు. స్కూల్ పిల్లలు నేను నీకు రక్ష,నువ్వు నాకు రక్ష ,మనము దేశానికి రక్ష అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని ఆనందంగా గడిపారు. కందర్ప, గాంధీ నగర్ కాలనీలు తదితర ప్రాంతాలకి పిల్లలు వెళ్లి స్థానికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు1
- ₹4.43 కోట్ల నిధులతో 8 కి.మీ. మేర రహదారి నిర్మాణ పనులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు NH-26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్తవలస వరకు ఈ రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా రహదారి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న స్థానిక ప్రజల కల నేడు సాకారం కానుంది. రహదారి నిర్మాణం పూర్తయితే విశ్వనాథపురం, కొత్తవలసతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు రైతులకు రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు త్వరగా చేరుకునే అవకాశం కలగనుంది. రహదారి నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ప్రధాన రహదారులతో గ్రామాలను అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. రహదారి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, మెరుగైన రవాణా సౌకర్యాలతో ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటికి అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజల ప్రయాణ సమయం, రవాణా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. “అభివృద్ధికి రహదారులే కీలకం.. ప్రతి ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే మా లక్ష్యం” అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ రహదారి నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.4
- అనారోగ్యం తో మరణించిన నటుడు జీ వి నారాయణరావు మృతి కి ---నివాళి.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్1