సర్వీస్ ఈనాం భూములపై నిషేధం ఎత్తివేయాలి : అమరావతి కి ఇచ్చిన మినహాయింపులు మాకు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ ఇనాం భూములపై నిషేధం ఎత్తి వేసే వరకు ఆందోళన ఉదృతం చేస్తామని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని సర్వీస్ ఈనామ్ భూ బాధితుల సంఘం హెచ్చరించింది.గురువారం పట్టణంలోని జేఆర్సి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు రంగాపురం నరసింహారావు మాట్లాడుతూ 1956 లో రైత్వారి పట్టాలిచ్చి సర్వీస్ ఇనాం దారులకు సర్వహక్కులు కల్పించిన ప్రభుత్వం, వాటిని వివిధ కారణాలతోటి అమ్ముకుంటే చెల్లదనడం దుర్మార్గమని అన్నారు.2013లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల కోట్లాదిమంది ఈ రోజున రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో చట్ట సవరణ చేసి ఇనాం భూములపై నిషేధం ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోవడం బాధాకరమని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో దళారులు రంగ ప్రవేశం చేసి తక్కువ రేటుకు భూముల కొనుగోలు చేసి లబ్ధి పొందాలని చూశారని, కూటమి ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకొని భూ బాధితులంతా కూటమికి ఓటు వేశారని అలాంటి వారిని విస్మరించటం తగదన్నారు . రెండేళ్లలో కనీసం సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం జరగలేదని ఆయన ఆయన వాపోయారు. కూటమి ప్రభుత్వం పై తమకు నమ్మకం ఉందని, సమస్య పరిష్కారానికి అధికారుల మార్గదర్శనం కరువైందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో కదలిక వచ్చి భూములపై నిషేధం ఎత్తివేసే వరకు ఆందోళన చేస్తామని, ఒక్క జగ్గయ్యపేట లోనే పదివేల మంది బాధితులు ఉన్నారని చెప్పారు. సంఘం నేత గద్దె సుధీర్ మాట్లాడుతూ ఈనాం భూములు దేవాదాయ శాఖ పరిధిలోనికి రావని దేవాలయాల్లో సేవలు చేసిన పరిచారకులకు సంస్థానాధీశులు, జమీందారులు, రాజులు బహుమతిగా ఇచ్చినవేనేనని చెప్పాడు. అధికారులు ఇవి దేవాలయ భూములుగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సిహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ 50 ఏళ్ల పాటు పట్టాలుగా చలామణి భూములు నేడు పనికిరావు అని చెప్పటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎన్నో వేల కుటుంబాలు ఆ భూములను నమ్ముకొని, ఆధారం చేసుకుని జీవిస్తున్నాయని, పదేళ్లుగా వాళ్ళు అవస్థలను ప్రభుత్వాలు గుర్తించకపోవడం, ఈరోజు న రోడ్డున పడటానికి కారణమని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో వేమూరులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు స్వయంగా ఈనాం సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని, కోరుకొండ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హామీ ఇచ్చిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. *మాజీ ఏఎంసి చైర్మన్ గింజుపల్లి రమేష్* మాట్లాడుతూ భూ బాధితుల సమస్య పరిష్కారానికి అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని, దశలవారీగా ఆందోళన రాష్ట్రవ్యాప్తం చేస్తామని చెప్పారు. *రాష్ట్ర ఇనాం భూబాధితుల సంఘం ప్రతినిధులు కళ్యాణం మురళి, అచ్యుతరామయ్య* లు మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిధిలో ఇనాం భూములను రాత్రికి రాత్రి నిషేధం ఎత్తివేసి, భూముల యజమానులకు ప్లాట్లు కేటాయించిన ప్రభుత్వం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు.
సర్వీస్ ఈనాం భూములపై నిషేధం ఎత్తివేయాలి : అమరావతి కి ఇచ్చిన మినహాయింపులు మాకు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ ఇనాం భూములపై నిషేధం ఎత్తి వేసే వరకు ఆందోళన ఉదృతం చేస్తామని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని సర్వీస్ ఈనామ్ భూ బాధితుల సంఘం హెచ్చరించింది.గురువారం పట్టణంలోని జేఆర్సి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు రంగాపురం నరసింహారావు మాట్లాడుతూ 1956 లో రైత్వారి పట్టాలిచ్చి సర్వీస్ ఇనాం దారులకు సర్వహక్కులు కల్పించిన ప్రభుత్వం, వాటిని వివిధ కారణాలతోటి అమ్ముకుంటే చెల్లదనడం దుర్మార్గమని అన్నారు.2013లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల కోట్లాదిమంది ఈ రోజున రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో చట్ట సవరణ చేసి ఇనాం భూములపై నిషేధం ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోవడం బాధాకరమని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో దళారులు రంగ ప్రవేశం చేసి తక్కువ రేటుకు భూముల కొనుగోలు చేసి లబ్ధి పొందాలని చూశారని, కూటమి ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకొని భూ బాధితులంతా కూటమికి ఓటు వేశారని అలాంటి వారిని విస్మరించటం తగదన్నారు . రెండేళ్లలో కనీసం సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం జరగలేదని ఆయన ఆయన వాపోయారు. కూటమి ప్రభుత్వం పై తమకు నమ్మకం ఉందని, సమస్య పరిష్కారానికి అధికారుల మార్గదర్శనం కరువైందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో కదలిక వచ్చి భూములపై నిషేధం ఎత్తివేసే వరకు ఆందోళన చేస్తామని, ఒక్క జగ్గయ్యపేట లోనే పదివేల మంది బాధితులు ఉన్నారని చెప్పారు. సంఘం నేత గద్దె సుధీర్ మాట్లాడుతూ ఈనాం భూములు దేవాదాయ శాఖ పరిధిలోనికి రావని దేవాలయాల్లో సేవలు చేసిన పరిచారకులకు సంస్థానాధీశులు, జమీందారులు, రాజులు బహుమతిగా ఇచ్చినవేనేనని చెప్పాడు. అధికారులు ఇవి దేవాలయ భూములుగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సిహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ 50 ఏళ్ల పాటు పట్టాలుగా చలామణి భూములు నేడు పనికిరావు అని చెప్పటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎన్నో వేల కుటుంబాలు ఆ భూములను నమ్ముకొని, ఆధారం చేసుకుని జీవిస్తున్నాయని, పదేళ్లుగా వాళ్ళు అవస్థలను ప్రభుత్వాలు గుర్తించకపోవడం, ఈరోజు న రోడ్డున పడటానికి కారణమని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో వేమూరులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు స్వయంగా ఈనాం సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని, కోరుకొండ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హామీ ఇచ్చిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. *మాజీ ఏఎంసి చైర్మన్ గింజుపల్లి రమేష్* మాట్లాడుతూ భూ బాధితుల సమస్య పరిష్కారానికి అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని, దశలవారీగా ఆందోళన రాష్ట్రవ్యాప్తం చేస్తామని చెప్పారు. *రాష్ట్ర ఇనాం భూబాధితుల సంఘం ప్రతినిధులు కళ్యాణం మురళి, అచ్యుతరామయ్య* లు మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిధిలో ఇనాం భూములను రాత్రికి రాత్రి నిషేధం ఎత్తివేసి, భూముల యజమానులకు ప్లాట్లు కేటాయించిన ప్రభుత్వం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు.
- పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో ప్రమాద భరితంగా మారిన విద్యుత్ స్తంభం పెడన పట్నంలోని ప్రధాన రహదారిలో విద్యుత్ స్తంభం ప్రమాద భరితంగా మారింది. పెడన మెయిన్ రోడ్ లోని సంత మార్కెట్ సమీపం డాక్టర్ అశోక్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు డివైడర్ పై ఉన్న విద్యుత్ లైట్ స్తంభం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. లారీ రివర్స్ చేస్తా ఉండగా స్తంభానికి తాకడం వల్ల స్తంభం పాక్షికంగా దెబ్బతిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ రహదారిలో ప్రతిక్షణం వందలాది వాహనాలు వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రమాదవశాత్తు ఈ విద్యుత్ స్తంభం కూలితే ఘోర ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ మరియు పెడన పోలీస్ శాఖ అధికారులుస్పందించి యుద్ధ ప్రాతిపదికన కోలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభంకు మరమ్మతులు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే మంచిది . ఏబీఎన్ రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా.కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది.మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది.ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...1
- కుష్టు రోగులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన కాకినాడ ఎంపీజే ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ప్రతిపదిహేను రోజులకు ఒకసారి జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ( sharp) RTC బస్టాండ్ దగ్గర వున్న హిందూస్మశానవాటిక దగ్గర వున్న లెప్రసీ కాలనీ నందు 55 మంది లెప్రసీ రోగులకు డ్రెస్సింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు MPJ సానుభూతి పరురాలైన శ్రీమతి బీబి గారు వారి భర్త గారైనా స్వర్గీయ అలీ గారి జ్ఞాపకార్ధం ₹2500/- ఆర్ధిక సహాయం చేస్తున్నారు. డ్రెస్సింగ్ తో పాటు 39 మంది స్త్రీలకు చీరలు, 17 మంది పురుషులకు లుంగీలు, టవల్ లు, చికెన్ బిర్యాని తోపాటు పరిశుభ్రతకు అవసరమయ్యే వస్తువుల (surf ప్యాకెట్ లు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, కొబ్బరి నూనె, షాంపూ ప్యాకెట్, soap) కిట్ కూడా లెప్రసి రోగులకు ప్రదానము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు Md హలీం గారు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమం లో జనరల్ సెక్రటరీ Md ఉస్మాన్ షబ్బీర్ గారు, షాకీర్ గారు, దౌలానా బాషా గారు, Md ఇబ్రహీం గారు, కలీం గారు, Md రహ్మతుల్లా గారు పాల్గొన్నారు.1
- వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.1
- అక్రమ ఇసుక తవ్వకాలు పట్టా పట్టించుకొని రెవెన్యూ మరియు పోలీసు శాఖ అక్రమ ఇసుక తవ్వకాలు.. అధికారుల మౌనం ఎందుకు? మోటుపల్లి సర్వే నంబర్లు 114, 115లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చిన్నగంజాం మండలం: మోటుపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 114, 115లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇసుకను భారీ స్థాయిలో తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతులు ఎవరి పేరుతో ఉన్నాయి? ఎంత మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యపై సమగ్రంగా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించి, అక్రమాలు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వే నంబర్లు 114, 115లో జరిగిన తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.3
- డయేరియా బాధితులను పరామర్శించిన ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని డయేరియా బాధితులను పరామర్శించారు.ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.స్థానిక కాపుల రామాలయం సెంటర్లో సుమారు పదిమందికి పైగా బాధితులను కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసిన నాని. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉయ్యూరు టౌన్ టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్ తుంగల పెద్ద రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.1
- RIP రామకృష్ణ....😔🙏 కొన్ని కారణాలు వలన ఫైర్ ఆక్సిడెంట్ చేత బాధపడుతున్న రామకృష్ణ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం మాకు తోచిన సహాయాన్ని అందించాము. ఆ వీడియోని చూసి అతనికి సహాయం చేయడం కోసం ముందుకు వచ్చిన ఇద్దరు సోదరులు. రవి గారు 5000 నరేంద్ర గారు 2000 అందజేశారు. మేము హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ రోజున ఉదయం 11 గంటలకు బాడీలో పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడం వలన తుది శ్వాసను విడిచారు.. మీ ఆత్మకు శాంతి కలగాలని టీం క్యాపో తరపున కోరుకుంటున్నాము..1