logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.

3 hrs ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.* :చిలకలూరిపేట::16-04-2026.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*
    1
    *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.*
:చిలకలూరిపేట::16-04-2026.*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Ippili tulasi
    1
    Post by Ippili tulasi
    user_Ippili tulasi
    Ippili tulasi
    రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు.
ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    54 min ago
  • Post by JADI RAJU
    1
    Post by JADI RAJU
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    3
    విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి
నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    6 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మౌలిక వసతుల విస్తరణపై చర్చించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మౌలిక వసతుల విస్తరణపై చర్చించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    6 hrs ago
  • రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం ​పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్ విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు. జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. ​జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    రాయవరంలో ఘనంగా 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవం
​పిఠాపురం: రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సిద్ధమైన పద్ధతులు పాటించినప్పుడే భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి (జెడి) ఎన్. విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పిఠాపురం మండలం రాయవరం గ్రామంలో నిర్వహించిన 'మంచి వ్యవసాయ పద్ధతులు' మరియు 'ఇండిగ్యాప్ పొలంబడి' క్షేత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడి  ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పంట కోతలకు ముందే పొలంలో నవధాన్యాలు లేదా పి.ఎం.డి.ఎస్  విత్తనాలు చల్లడం వల్ల భూమికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని తెలిపారు. రాయవరంలో ఇప్పటికే 100 ఎకరాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, హార్వెస్టర్ల ద్వారా కోత కోసే సమయంలో బ్లోయర్ వాడటం వల్ల ధాన్యంలో తేమ తగ్గి రైతులకు మంచి ధర లభిస్తుందని సూచించారు. 14 వారాల పొలంబడి శిక్షణలో నేర్చుకున్న అనుభవాలను రైతులు ఈ సందర్భంగా వివరించారు. సహజ కషాయాల వాడకంతో ఎకరానికి రూ.10,000 పెట్టుబడి తగ్గిందని రైతు కర్నీడి జగ్గారావు తెలిపారు.
జీవామృతం,పి.ఎం.డి.ఎస్ పద్ధతుల వల్ల పంట బలంగా ఉండి తుపానులకు కూడా పడిపోలేదని రైతు పెదపూడి విష్ణు చక్రం వివరించారు. ​జిల్లేడు కషాయం,మట్టి ద్రావణం వంటి పద్ధతులతో దెబ్బతిన్న పంటను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చి మంచి దిగుబడి సాధించానని కౌలు రైతు మాదేపల్లి సీతారాములు గర్వంగా చెప్పారు. సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ స్వాతి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి రాయవరం గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి ఏవో గంగాధర్ 14 వారాల పొలంబడి ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.