పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది* *పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కో కన్వినర్ గారు పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు గుమ్మడి నాసారయ్య గారు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా నెల్లటూరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు* **గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల , ఐ.ఏ.ఎస్.,** **జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,** *పల్నాడు జిల్లా* **విషయం:**పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో చెత్త నిర్వహణ (SLWM) మరియు కంపోస్ట్ యూనిట్ల నిర్వీర్యం పై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి. *అమ్మ ,* భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న **జనతా వారధి** కార్యక్రమం ద్వారా జిల్లా గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాము. ఈ పర్యటనల సందర్భంగా పారిశుధ్యం విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో **Solid & Liquid Waste Management (SLWM)** కింద నిర్మించిన కంపోస్ట్ పిట్స్, సెగ్రిగేషన్ షెడ్లు నిర్వీర్యంగా ఉన్నాయి. కొన్ని చోట్ల నామమాత్రంగా మాత్రమే నిర్వహణ జరుగుతోంది. **స్వచ్ఛ భారత్ మిషన్** కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి నిర్మించిన ఈ యూనిట్లు ప్రస్తుతం చెత్త నిల్వ కేంద్రాలుగా మారుతున్నాయి. తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం, కంపోస్ట్ తయారీ, రీసైక్లింగ్ వ్యవస్థ సరిగా అమలు కావడం లేదు. పారిశుధ్య కార్మికుల కొరత మరియు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీని వల్ల **“చెత్త నుంచి సంపద”** లక్ష్యం సాధ్యం కావడం లేదు. గ్రామాల్లో అస్వచ్ఛత పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతోంది. ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. **రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు** ప్రతిష్టాత్మకంగా **స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర** కార్యక్రమాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తోంది. **కావున మనవి:** 1. జిల్లా వ్యాప్తంగా అన్ని SLWM యూనిట్లపై **ప్రత్యేక సమగ్ర ఆడిట్** నిర్వహించాలి. 2. పనిచేయని కంపోస్ట్ పిట్స్ / షెడ్లను **తక్షణం పునరుద్ధరించాలి**. 3. తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం **కఠినంగా అమలు** చేయాలి. 4. ప్రతి గ్రామానికి తగినంత **పారిశుధ్య కార్మికులను** నియమించాలి. 5. గ్రామ/వార్డు స్థాయిలో **పర్యవేక్షణ కమిటీలు** ఏర్పాటు చేసి బాధ్యతలు స్పష్టంగా నిర్ణయించాలి. 6. కంపోస్ట్ ఉత్పత్తికి **సరైన మార్కెట్ లింకేజీ** కల్పించాలి. 7. ప్రజలకు **అవగాహన కార్యక్రమాలు** విస్తృతంగా నిర్వహించాలి. గ్రామాల్లో పారిశుధ్యం కేవలం నిర్మాణాలతో కాకుండా, **సమర్థవంతమైన నిర్వహణ** ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పై అంశాలపై **తక్షణ చర్యలు** తీసుకొని “చెత్త నుంచి సంపద” లక్ష్యాన్ని వాస్తవ రూపంలో అమలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. **జనతా వారధి – పల్నాడు జిల్లా టీమ్** * *ఇట్లు** *ఏలూరి శశి కుమార్* *జిల్లా అధ్యక్షులు* *భారతీయ జనతా పార్టీ* *పల్నాడు జిల్లా*
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది *పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది* *పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వినర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారది కో కన్వినర్ గారు పల్నాడు జిల్లా సీనియర్ నాయకులు గుమ్మడి నాసారయ్య గారు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా నెల్లటూరి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు* **గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల , ఐ.ఏ.ఎస్.,** **జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,** *పల్నాడు జిల్లా* **విషయం:**పల్నాడు జిల్లాలోని గ్రామాల్లో చెత్త నిర్వహణ (SLWM) మరియు కంపోస్ట్ యూనిట్ల నిర్వీర్యం పై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి. *అమ్మ ,* భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న **జనతా వారధి** కార్యక్రమం ద్వారా జిల్లా గ్రామాల్లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాము. ఈ పర్యటనల సందర్భంగా పారిశుధ్యం విషయంలో అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాల్లో **Solid & Liquid Waste Management (SLWM)** కింద నిర్మించిన కంపోస్ట్ పిట్స్, సెగ్రిగేషన్ షెడ్లు నిర్వీర్యంగా ఉన్నాయి. కొన్ని చోట్ల నామమాత్రంగా మాత్రమే నిర్వహణ జరుగుతోంది. **స్వచ్ఛ భారత్ మిషన్** కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి నిర్మించిన ఈ యూనిట్లు ప్రస్తుతం చెత్త నిల్వ కేంద్రాలుగా మారుతున్నాయి. తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం, కంపోస్ట్ తయారీ, రీసైక్లింగ్ వ్యవస్థ సరిగా అమలు కావడం లేదు. పారిశుధ్య కార్మికుల కొరత మరియు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీని వల్ల **“చెత్త నుంచి సంపద”** లక్ష్యం సాధ్యం కావడం లేదు. గ్రామాల్లో అస్వచ్ఛత పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలుగుతోంది. ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. **రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు** ప్రతిష్టాత్మకంగా **స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర** కార్యక్రమాన్ని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తోంది. **కావున మనవి:** 1. జిల్లా వ్యాప్తంగా అన్ని SLWM యూనిట్లపై **ప్రత్యేక సమగ్ర ఆడిట్** నిర్వహించాలి. 2. పనిచేయని కంపోస్ట్ పిట్స్ / షెడ్లను **తక్షణం పునరుద్ధరించాలి**. 3. తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం **కఠినంగా అమలు** చేయాలి. 4. ప్రతి గ్రామానికి తగినంత **పారిశుధ్య కార్మికులను** నియమించాలి. 5. గ్రామ/వార్డు స్థాయిలో **పర్యవేక్షణ కమిటీలు** ఏర్పాటు చేసి బాధ్యతలు స్పష్టంగా నిర్ణయించాలి. 6. కంపోస్ట్ ఉత్పత్తికి **సరైన మార్కెట్ లింకేజీ** కల్పించాలి. 7. ప్రజలకు **అవగాహన కార్యక్రమాలు** విస్తృతంగా నిర్వహించాలి. గ్రామాల్లో పారిశుధ్యం కేవలం నిర్మాణాలతో కాకుండా, **సమర్థవంతమైన నిర్వహణ** ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పై అంశాలపై **తక్షణ చర్యలు** తీసుకొని “చెత్త నుంచి సంపద” లక్ష్యాన్ని వాస్తవ రూపంలో అమలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. **జనతా వారధి – పల్నాడు జిల్లా టీమ్** * *ఇట్లు** *ఏలూరి శశి కుమార్* *జిల్లా అధ్యక్షులు* *భారతీయ జనతా పార్టీ* *పల్నాడు జిల్లా*
- చంద్రబాబు76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల విరాళం.. అమరావతి: అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. చంద్రబాబు జన్మదినం సందర్భంగా భువనేశ్వరి అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. అలాగే ప్రజలు కూడా తమకు తోచిన విధంగా అన్నదాన క్యాంటీన్లకు విరాళాలు అందజేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- Post by Ramprasad islavath1
- Post by కొప్పుల విజయ బాబు10
- ఆకాశంలో ఫైటింగ్ రైల్వే స్టేషన్లో రచ్చ.. కరెంట్ తీగలు ఎక్కి మరీ ఫైట్! "గురూజీ.. మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొడతా" అని ఓ మూవీలో డైలాగ్ చెప్పినట్టు ఛాలెంజ్ చేసుకున్నారేమో.. దారా చూసుకుందాం అంటూ కొందరు ఆకతాయిలు గొడవను నెక్స్ లెవల్కు తీసుకెళ్లారు. మహారాష్ట్రలోని మన్మాడ్ రైల్వే స్టేషన్లో కొందరు హై-టెన్షన్ తీగలు ఎక్కి కొట్టుకున్నారు. కిందకి దిగమని పోలీసులు హెచ్చరిస్తున్నా వినలేదు. దీంతో కాసేపు స్టేషన్లో హైడ్రామా నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎవరికీ ప్రాణహాని జరగలేదు.1
- నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- SIR ట్రైనింగ్ ప్రోగ్రామ్ అమరావతి: ఎలక్షన్ కమిషన్ తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో పేర్లు లేకుండా ఉండిపోతే తిరిగి పేర్లు ఓటర్ లిస్టులో రావటానికి ఏమి చేయాలో ఒక కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మంగళవారం మెడికల్ హాల్ లో జరుగుతుందని ప్రజాసంఘాల నాయకులు కేఎంఏ సుభాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాలు చూడగలరు. కార్యక్రమానికి వచ్చేవారు పేరు నమోదు చేసుకోగలరు.1