Shuru
Apke Nagar Ki App…
నూతన మండల అధ్యక్షుడి అభినందన సభకు హాజరైన మంత్రి సీతక్క.. ఘనంగా కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు బానోత్ రూప్సింగ్, మాజీ అధ్యక్షుడు వజ్జ సారయ్యల అభినందన సభ విజయవంతం కావడంపై కాంగ్రెస్ నాయకులు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రోత్సాహం అందించినందుకు ధన్యవాదాలు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
M D Azizuddin
నూతన మండల అధ్యక్షుడి అభినందన సభకు హాజరైన మంత్రి సీతక్క.. ఘనంగా కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు బానోత్ రూప్సింగ్, మాజీ అధ్యక్షుడు వజ్జ సారయ్యల అభినందన సభ విజయవంతం కావడంపై కాంగ్రెస్ నాయకులు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రోత్సాహం అందించినందుకు ధన్యవాదాలు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం నా దగ్గరికి వచ్చి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే, న్యాయవాదులకు చెప్పి పరిష్కరించమని కోరాను విద్యాశాఖలో జరిగిన అవినీతిపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లాడు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన మరుసటి రోజే, ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది అని– BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.1
- మహబూబాబాద్ లో గౌడభవనం కోసం స్థలం కేటాయింపు జరిగేలా సహకరించండి.. జిల్లా ఐక్య గౌడసంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కి వినతి... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గౌడభవన నిర్మాణం కోసం పట్టణ పరిధిలో 2 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కు ఐక్యగౌడసంఘాల ఆధ్వర్యంలో గౌడ కులప్రముఖులు వినతి పత్రం సమర్పించారు. *వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అత్యంత సానుకూలంగా స్పందించారు.* ప్రభుత్వం దృష్టికి తీసుకవెల్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు. *తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్నగౌడ్, టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ లు ముత్యం వెంకన్నగౌడ్, గాడిపెళ్లి చరణ్ గౌడ్, గోపా రాష్ట్రనాయకులు బిక్కి వెంకటేశ్వర్లుగౌడ్, మోకుదెబ్బ జిల్లాఅధ్యక్షులు ముంజాల రాజేందర్ గౌడ్, గౌడసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్, గౌడసంఘం జిల్లాబాద్యులు పెద్ది వెంకన్న గౌడ్, గోపా జిల్లా ప్రధానకార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్, జై గౌడ్ జిల్లా అధ్యక్షుడు గుదె వీరన్నగౌడ్, జర్నలిస్ట్ సంఘాల బాధ్యులు ఉమ్మగాని మధుగౌడ్, బాలగాని నవీన్ గౌడ్, చిర్రగోని ఉదయ్ గౌడ్, గౌడ యువజనసంఘం జిల్లా గౌరవఅధ్యక్షులు నలమాస సాయిగౌడ్, ఉపాధ్యక్షులు గుదే యుగంధర్ గౌడ్, జై గౌడ్ జిల్లా యూత్ అధ్యక్షులు కాంచాని శంకర్ గౌడ్. నెల్లికుదరు మండలం అధ్యక్షులు తండ నర్సయ్య గౌడ్, జై గౌడ్ జిల్లా నాయకులు మూల సురేష్ గౌడ్, గాడిపల్లి అనిల్ గౌడ్, గండి రాజేష్ గౌడ్, గౌడ సంఘాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు*1
- ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*2
- నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన రోడ్డు రోడ్డు పనులను తక్షణమే పూర్తిచేయాలని బీఆర్ఎస్ డిమాండ్ బెజ్జంకి మండల ప్రజల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా బెజ్జంకి – బేగంపేట – గూడెం – చీమలకుంటపల్లి – కొండపూర్ మార్గంలో నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని మరియు స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేయడానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు. బెజ్జంకి మండలం నుంచి తల్లారావనిపల్లి, బేగంపేట, వడ్లూరు, గూడెం, చీమలకుంటపల్లి, కొండపూర్ తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సుమారు రూ.8 కోట్ల నిధులతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఆర్&బి శాఖ ద్వారా ఈ రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ పనుల్లో గుగ్గిల్ల బ్రిడ్జి పూర్తయిందని, అలాగే బెజ్జంకి నుంచి బేగంపేట వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర డాంబర్ రోడ్డు పూర్తయిందని తెలిపారు. సింగిల్ రోడ్డుగా మంజూరైన ఈ పనిని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీ-ఎస్టిమేట్ చేసి డబుల్ రోడ్డుగా మార్చడం వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు. అయినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఎర్త్వర్క్, కంకర పనులు, మధ్యంతర పనులు పూర్తయ్యాయని, చివరి దశలో ఉన్న సుమారు 10 శాతం బీటీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని వివరించారు. 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా ఆ పని ఎక్కడ ఆగిందో అక్కడే ఉందని, ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని మండల అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి, ఆర్&బి శాఖకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, బేగంపేట అంబేద్కర్ చౌరస్తా నుంచి బెజ్జంకి వరకు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఇటీవల బెజ్జంకి మండలానికి చెందిన ఒక విలేకరి ఈ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారని, అలాగే బేగంపేటకు చెందిన పత్తి వ్యాపారి మహేందర్ రెడ్డి, నారెడ్డి రాజిరెడ్డి తదితరులు కూడా ప్రమాదాల్లో గాయపడ్డారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు పదుల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందువల్ల ఇప్పటికే మంజూరైన నిధులను వెంటనే విడుదల చేసి, కాంట్రాక్టర్కు చెల్లింపులు జరిపి, మిగిలిన రోడ్డు పనులను పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నామని పాకాల మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి పది రోజులలోపు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి పాదయాత్రలు, ధర్నాలు, నిరసనలు మరియు వివిధ ప్రజా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రోడ్డు పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని పాకాల మహిపాల్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి లింగాల లక్ష్మణ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మానకొండూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ ఎల శేఖర్ బాబు, రామ్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.1
- భారతదేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డిని మనం ముఖ్యమంత్రి చేసుకోవడమే బిగ్గెస్ట్ క్రిమినల్ వేస్ట్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ _*దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న*_ _*రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే బిగ్గెస్ట్ క్రిమినల్ వేస్ట్!*_ *- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్*1
- నంది మేడారం పంప్ హౌజ్ వద్ద సీఎం మంత్రుల చిత్రపటాలకు కాంగ్రెస్ పాలాభిషేకం. ప్రాజెక్టులపై బిఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొడుతు పెద్దపల్లి జిల్లా నందిమేడారం పంప్ హౌస్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి తోపాటు రాష్ట్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రాజెక్టులపై నీటి ఎత్తిపోతలపై మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు తీవ్రంగా స్పందించిన ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా నంది పంప్ హౌస్ వద్దకు చేరుకొని ఇవి కాళేశ్వరం నీళ్లు కాదు, గోదావరి జలాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎల్లంపల్లి నీళ్ళనే మిడ్ మానేర్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాస్తవాలను విస్మరించి, ఎల్లంపల్లి నీటిని కాళేశ్వరం నీరుగా చూపిస్తూ బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని కాళేశ్వరం జలాలుగా ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి తమ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచిస్తూ, వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.1
- హైదరాబాదులోని ఇందిరాపార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నా హైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నా 7,437 పోస్టులతో కాకుండా 19 వేల పోలీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలి పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలంటూ డిమాండ్ నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పోలీస్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ దరఖాస్తు రుసుమును వెంటనే తగ్గించాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగుల హెచ్చరిక1