logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మన్ననూరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్.. రికార్డుల నిర్వహణపై సీరియస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మన్ననూరు పీహెచ్‌సీని సందర్శించిన ఆయన లేబర్ రూమ్, ల్యాబ్, మెడికల్ స్టోర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీ సంఖ్యను పెంచి, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_MALLIKARJUN T
MALLIKARJUN T
Insurance Agent Nagarkurnool, Telangana•
2 hrs ago

మన్ననూరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్.. రికార్డుల నిర్వహణపై సీరియస్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మన్ననూరు పీహెచ్‌సీని సందర్శించిన ఆయన లేబర్ రూమ్, ల్యాబ్, మెడికల్ స్టోర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీ సంఖ్యను పెంచి, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

More news from Hyderabad and nearby areas
  • ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations5191
    1
    ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇
id:cryancreations5191
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Secunderabad, Hyderabad•
    12 hrs ago
  • నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
    1
    నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని మహానంది ఎస్ ఐ ఎన్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి మహానంది మండలం గాజులపల్లె పరిధిలోని నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారి మెట్ట యందు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సరైన ధ్రువపత్రాలు లేని పలువురికి జరిమానాలు విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని మహానంది ఎస్ ఐ ఎన్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి మహానంది మండలం గాజులపల్లె పరిధిలోని నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారి మెట్ట యందు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సరైన ధ్రువపత్రాలు లేని పలువురికి జరిమానాలు విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ..  మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మెడికల్ డివైసెస్ ఉత్పాదనకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో తనను కలిసిన నెదర్లాండ్స్ మెడిటెక్ పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీల పరిశోధకులతో ఆయన మాట్లాడారు. వెద్య సంబంధ పరిశోధనలు, కృత్రిమ మేథ అభివృద్ధి, పరికరాల ఉత్పత్తికి తెలంగాణా అత్యంత అనుకూలమని ఆయన వివరించారు. ఔషధాల ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీలో తమ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఇక్కడి బయోటెక్ కంపెనీలు 120 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఆధునిక వైద్య పరికరాల ఉత్పత్తిలో తెలంగాణాను కేంద్ర స్థానం (హబ్)గా తీర్చిదిద్దేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు. విద్యుత్తు, నీరు, భూమి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్య రంగంలో కృత్రిమ మేథ వినియోగించే విషయంలో చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. ఇమేజింగ్ టెక్నాలజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొరత లేదని, ప్రపంచంలోని అతి పెద్ద ఔషద, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ఇక్కడి యూనివర్సిటీలతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నెదర్లాండ్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిలర్ జాన్ రెయింట్ స్మిట్ (Jan Reint Smit) ఆధ్వర్యంలో వివిధ రంగాల నిపుణుల బృందం సమావేశంలో పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటి సలహాదారు ఐ.సాయికృష్ణ టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ రఘురామ శర్మ, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.
    1
    మెడికల్ డివైసెస్ ఉత్పాదనకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణాలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెడికల్ డివైసెస్ పార్క్, జీనోమ్ వ్యాలీలో తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని వెల్లడించారు. మంగళవారం నాడు సచివాలయంలో తనను కలిసిన నెదర్లాండ్స్ మెడిటెక్ పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీల పరిశోధకులతో ఆయన మాట్లాడారు. వెద్య సంబంధ పరిశోధనలు, కృత్రిమ మేథ అభివృద్ధి, పరికరాల ఉత్పత్తికి తెలంగాణా అత్యంత అనుకూలమని ఆయన వివరించారు. ఔషధాల ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలు, వ్యాక్సిన్ల తయారీలో తమ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో ఇక్కడి బయోటెక్ కంపెనీలు 120 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఆధునిక వైద్య పరికరాల ఉత్పత్తిలో తెలంగాణాను కేంద్ర స్థానం (హబ్)గా తీర్చిదిద్దేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోందని తెలిపారు. విద్యుత్తు, నీరు, భూమి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. వైద్య రంగంలో కృత్రిమ మేథ వినియోగించే విషయంలో చక్కని అవకాశాలున్నాయని చెప్పారు. ఇమేజింగ్ టెక్నాలజీ, క్లినికల్ వ్యాలిడేషన్, డిజిటల్ ప్రొఫైల్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమని శ్రీధర్ బాబు వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొరత లేదని, ప్రపంచంలోని అతి పెద్ద ఔషద, బయోటెక్ కంపెనీలు రాష్ట్రాన్ని తమ ఉత్పాదన కేంద్రంగా మార్చుకోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ఇక్కడి యూనివర్సిటీలతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నెదర్లాండ్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిలర్ జాన్ రెయింట్ స్మిట్ (Jan Reint Smit) ఆధ్వర్యంలో వివిధ రంగాల నిపుణుల బృందం సమావేశంలో పాల్గొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటి సలహాదారు ఐ.సాయికృష్ణ టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ రఘురామ శర్మ, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఇఓ సర్వేశ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ వేణు తదితరులు పాల్గొన్నారు.
    user_LOKESH DUVVURU
    LOKESH DUVVURU
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • దేవరకొండ లో లక్కీ భాస్కర్ సినిమా రేంజ్‌లో ఎస్‌బీఐలో రూ.2.65 కోట్ల స్కామ్ బట్టబయలు.!_ బ్యాంక్‌లో పనిచేస్తూనే ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన లెండల చక్రపాణి మాస్టర్ ప్లాన్... సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి స్కెచ్... కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కేటుగాళ్ల సహకారంతో కోట్ల రూపాయల మోసం... నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ మార్చి ఖాతాలు ఖాళీ చేసిన ముఠా... యోనో యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి నగదుగా మార్చిన కేటుగాళ్లు... దేవరకొండ పోలీసుల దర్యాప్తుతో నలుగురు అరెస్ట్.. లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు, కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కటకటాల వెనుకకు... రూ.2.42 కోట్ల నగదు, 6 మొబైళ్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం... ఖాతాదారుడికి ఈమెయిల్ అలర్ట్‌తో బయటపడిన భారీ స్కామ్! ఎస్‌పీ *శరద్ చంద్ర పవార్* ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం... దేవరకొండ DSP *ఎం.వి. శ్రీనివాసరావు* పర్యవేక్షణలో ఆపరేషన్ సక్సెస్... ఇన్‌స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో కేసు ను చొక్కా చౌక్యంగా వ్యవహరించి చేదించిన ఎస్‌ఐ బి. రాజు, పీసీలు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా కీలక పాత్ర... హెచ్‌జీలు సింహాద్రి, సోమ్లా సహకారంతో ముఠా పట్టివేత... కేసు చేతన చేసిన సిబ్బందిని అభినందించిన *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..* ఎస్పీ హెచ్చరిక: ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ కూడా లింకు చేసి ఉంచండి...
    1
    దేవరకొండ లో లక్కీ భాస్కర్ సినిమా రేంజ్‌లో ఎస్‌బీఐలో రూ.2.65 కోట్ల స్కామ్ బట్టబయలు.!_
బ్యాంక్‌లో పనిచేస్తూనే ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన లెండల చక్రపాణి మాస్టర్ ప్లాన్...
సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి స్కెచ్...
కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కేటుగాళ్ల సహకారంతో కోట్ల రూపాయల మోసం...
నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ మార్చి ఖాతాలు ఖాళీ చేసిన ముఠా...
యోనో యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి నగదుగా మార్చిన  కేటుగాళ్లు...
దేవరకొండ పోలీసుల దర్యాప్తుతో నలుగురు అరెస్ట్..
లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు, కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కటకటాల వెనుకకు...
రూ.2.42 కోట్ల నగదు, 6 మొబైళ్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం...
ఖాతాదారుడికి ఈమెయిల్ అలర్ట్‌తో బయటపడిన భారీ స్కామ్!
ఎస్‌పీ *శరద్ చంద్ర పవార్* ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం...
దేవరకొండ DSP *ఎం.వి. శ్రీనివాసరావు* పర్యవేక్షణలో ఆపరేషన్ సక్సెస్...
ఇన్‌స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో కేసు ను చొక్కా చౌక్యంగా వ్యవహరించి చేదించిన ఎస్‌ఐ బి. రాజు, పీసీలు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా కీలక పాత్ర...
హెచ్‌జీలు సింహాద్రి, సోమ్లా సహకారంతో ముఠా పట్టివేత...
కేసు చేతన చేసిన సిబ్బందిని అభినందించిన *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..*
ఎస్పీ హెచ్చరిక: ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ కూడా లింకు చేసి ఉంచండి...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.
    1
    స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు  రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • బడి పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
    1
    బడి పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • మీ సమస్యలపై కమిటీ వేసాము సమ్మె ఆలోచన విరమించుకోండి ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం మీ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉంది, 4 వారాల కాల పరిమితితో ఒక కమిటీ వేసాము మీ సమస్యలు ఆ కమిటీకి చెప్తే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని కార్మికులను కోరుతున్నాను – మంత్రి పొన్నం ప్రభాకర్
    1
    మీ సమస్యలపై కమిటీ వేసాము సమ్మె ఆలోచన విరమించుకోండి 
ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ 
ప్రభుత్వం మీ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉంది, 4 వారాల కాల పరిమితితో ఒక కమిటీ వేసాము 
మీ సమస్యలు ఆ కమిటీకి చెప్తే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము
ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని కార్మికులను కోరుతున్నాను – మంత్రి పొన్నం ప్రభాకర్
    user_LOKESH DUVVURU
    LOKESH DUVVURU
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.
    1
    చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే  పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను  శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో  వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.