జిల్లాలో సంచలనం రేపిన కోట్ల స్కామ్కు దేవరకొండ పోలీసుల ఫుల్ స్టాప్ దేవరకొండ లో లక్కీ భాస్కర్ సినిమా రేంజ్లో ఎస్బీఐలో రూ.2.65 కోట్ల స్కామ్ బట్టబయలు.!_ బ్యాంక్లో పనిచేస్తూనే ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన లెండల చక్రపాణి మాస్టర్ ప్లాన్... సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి స్కెచ్... కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కేటుగాళ్ల సహకారంతో కోట్ల రూపాయల మోసం... నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ మార్చి ఖాతాలు ఖాళీ చేసిన ముఠా... యోనో యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి నగదుగా మార్చిన కేటుగాళ్లు... దేవరకొండ పోలీసుల దర్యాప్తుతో నలుగురు అరెస్ట్.. లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు, కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కటకటాల వెనుకకు... రూ.2.42 కోట్ల నగదు, 6 మొబైళ్లు, ల్యాప్టాప్ స్వాధీనం... ఖాతాదారుడికి ఈమెయిల్ అలర్ట్తో బయటపడిన భారీ స్కామ్! ఎస్పీ *శరద్ చంద్ర పవార్* ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం... దేవరకొండ DSP *ఎం.వి. శ్రీనివాసరావు* పర్యవేక్షణలో ఆపరేషన్ సక్సెస్... ఇన్స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో కేసు ను చొక్కా చౌక్యంగా వ్యవహరించి చేదించిన ఎస్ఐ బి. రాజు, పీసీలు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా కీలక పాత్ర... హెచ్జీలు సింహాద్రి, సోమ్లా సహకారంతో ముఠా పట్టివేత... కేసు చేతన చేసిన సిబ్బందిని అభినందించిన *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..* ఎస్పీ హెచ్చరిక: ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ కూడా లింకు చేసి ఉంచండి...
జిల్లాలో సంచలనం రేపిన కోట్ల స్కామ్కు దేవరకొండ పోలీసుల ఫుల్ స్టాప్ దేవరకొండ లో లక్కీ భాస్కర్ సినిమా రేంజ్లో ఎస్బీఐలో రూ.2.65 కోట్ల స్కామ్ బట్టబయలు.!_ బ్యాంక్లో పనిచేస్తూనే ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన లెండల చక్రపాణి మాస్టర్ ప్లాన్... సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి స్కెచ్... కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కేటుగాళ్ల సహకారంతో కోట్ల రూపాయల మోసం... నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ మార్చి ఖాతాలు ఖాళీ చేసిన ముఠా... యోనో యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి నగదుగా మార్చిన కేటుగాళ్లు... దేవరకొండ పోలీసుల దర్యాప్తుతో నలుగురు అరెస్ట్.. లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు, కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కటకటాల వెనుకకు... రూ.2.42 కోట్ల నగదు, 6 మొబైళ్లు, ల్యాప్టాప్ స్వాధీనం... ఖాతాదారుడికి ఈమెయిల్ అలర్ట్తో బయటపడిన భారీ స్కామ్! ఎస్పీ *శరద్ చంద్ర పవార్* ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం... దేవరకొండ DSP *ఎం.వి. శ్రీనివాసరావు* పర్యవేక్షణలో ఆపరేషన్ సక్సెస్... ఇన్స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో కేసు ను చొక్కా చౌక్యంగా వ్యవహరించి చేదించిన ఎస్ఐ బి. రాజు, పీసీలు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా కీలక పాత్ర... హెచ్జీలు సింహాద్రి, సోమ్లా సహకారంతో ముఠా పట్టివేత... కేసు చేతన చేసిన సిబ్బందిని అభినందించిన *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..* ఎస్పీ హెచ్చరిక: ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ కూడా లింకు చేసి ఉంచండి...
- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1
- మీ సమస్యలపై కమిటీ వేసాము సమ్మె ఆలోచన విరమించుకోండి ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం మీ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉంది, 4 వారాల కాల పరిమితితో ఒక కమిటీ వేసాము మీ సమస్యలు ఆ కమిటీకి చెప్తే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని కార్మికులను కోరుతున్నాను – మంత్రి పొన్నం ప్రభాకర్1
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- Post by JADI RAJU1
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- ప్రజలు ప్రాణాల మీద పెట్టుకుని రాకపోకలు... ఉదయం నుంచి రాత్రి వరకు వాహనాల రద్దీ పెరిగినా సిగ్నల్స్ మాత్రం మూగబోయినట్టే పరిస్థితి... ఎవరికి దారి వారిదే అన్నట్టుగా వాహనాలు దూసుకెళ్తుండడంతో ప్రమాదాల భయం పెరుగుతోంది... పాదచారులు రోడ్డు దాటాలంటే గుండెల్లో గుబులు... చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు... ట్రాఫిక్ పోలీసులు లేకపోతే జంక్షన్ మొత్తం గందరగోళంగా మారుతున్న దృశ్యాలు... ఇప్పటికే ప్రమాదాల నిలయంగా పేరున్న ఈ ప్రాంతంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ప్రజల ఆగ్రహం... మున్సిపల్ అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారం... వెంటనే సిగ్నల్స్ మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్... మరెంతమంది ప్రాణాలు పోతే అధికార యంత్రాంగం మేల్కొంటుందో అంటూ ప్రజల ప్రశ్నలు...1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన నెల వేతనంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు తన వేతనంతో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గం నుంచి 450 మంది యువత శిక్షణకు ముందుకు వచ్చారని చెప్పారు. యువత చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కంప్యూటర్ వర్క్ ఉంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1
- రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రాదు ఎక్కడ ఖాళీ భూములు కనిపిస్తే అక్కడ కబ్జాలు పెట్టి గుంజుకుంటున్నారు ఫ్రీ బస్సు అని పెడితే మహిళలు కొట్టుకొని సస్తున్నారు.. ఫ్రీ బస్సు లేకముందే బాగుండేది - జగిత్యాల మహిళలు1