logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

లింగంపేట్ : ఉపాధి హామీ ద్వారా వలసలను నివారించవచ్చు.... లింగంపేట మండలం భవానిపేట్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పనులు చేయడం వలన వలసలు నివారించవచ్చు ఈ పనుల ద్వారా చెరు వు పూడిక, కంధకాలు, మొక్కలు నాటడం, వంటి పనుల ద్వారా, గ్రామం లోప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది ఈ పని.

7 hrs ago
user_Akula Mahender
Akula Mahender
లింగంపేట, కామారెడ్డి, తెలంగాణ•
7 hrs ago

లింగంపేట్ : ఉపాధి హామీ ద్వారా వలసలను నివారించవచ్చు.... లింగంపేట మండలం భవానిపేట్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పనులు చేయడం వలన వలసలు నివారించవచ్చు ఈ పనుల ద్వారా చెరు వు పూడిక, కంధకాలు, మొక్కలు నాటడం, వంటి పనుల ద్వారా, గ్రామం లోప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది ఈ పని.

More news from తెలంగాణ and nearby areas
  • లింగంపేట్ : ఉపాధి హామీ ద్వారా వలసలను నివారించవచ్చు.... లింగంపేట మండలం భవానిపేట్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పనులు చేయడం వలన వలసలు నివారించవచ్చు ఈ పనుల ద్వారా చెరు వు పూడిక, కంధకాలు, మొక్కలు నాటడం, వంటి పనుల ద్వారా, గ్రామం లోప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది ఈ పని.
    1
    లింగంపేట్ : ఉపాధి హామీ ద్వారా వలసలను నివారించవచ్చు....
లింగంపేట మండలం భవానిపేట్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పనులు చేయడం వలన వలసలు నివారించవచ్చు ఈ పనుల ద్వారా చెరు వు పూడిక, కంధకాలు, మొక్కలు నాటడం, వంటి పనుల ద్వారా, గ్రామం లోప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది ఈ పని.
    user_Akula Mahender
    Akula Mahender
    లింగంపేట, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • రైతులకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్‌ను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్లారెడ్డిలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రోడ్డుపైనే బైఠాయించి, గులాబీ కండువాలు ధరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ యాప్ వల్ల సామాన్య రైతులకు ఎరువుల కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సాంకేతిక సమస్యల వల్ల సకాలంలో యూరియా దొరకక పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జజాల సురేందర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఇటువంటి కఠినమైన యాప్‌లను ప్రవేశపెట్టడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, రైతులకు మునుపటిలాగే సులభంగా ఎరువులు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కారణంగా ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రత దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు.
    2
    రైతులకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్‌ను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్లారెడ్డిలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రోడ్డుపైనే బైఠాయించి, గులాబీ కండువాలు ధరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ యాప్ వల్ల సామాన్య రైతులకు ఎరువుల కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సాంకేతిక సమస్యల వల్ల సకాలంలో యూరియా దొరకక పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జజాల సురేందర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఇటువంటి కఠినమైన యాప్‌లను ప్రవేశపెట్టడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, రైతులకు మునుపటిలాగే సులభంగా ఎరువులు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నా కారణంగా ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రత దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు.
    user_ప్రేమ్ కుమార్
    ప్రేమ్ కుమార్
    Interior designer నాగిరెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పరమేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుండి బదిలీపై వచ్చిన ఆమె, విలేకరులతో మాట్లాడుతూ తన మొదటి ప్రాధాన్యతను వివరించారు. రేపటి నుండి పాఠశాల బస్సులను పునరుద్ధరించి విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని పరమేశ్వరి స్పష్టం చేశారు. రవాణా విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే తనను సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు.
    1
    మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పరమేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుండి బదిలీపై వచ్చిన ఆమె, విలేకరులతో మాట్లాడుతూ తన మొదటి ప్రాధాన్యతను వివరించారు. రేపటి నుండి పాఠశాల బస్సులను పునరుద్ధరించి విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని పరమేశ్వరి స్పష్టం చేశారు. రవాణా విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే తనను సంప్రదించాల్సిందిగా ఆమె కోరారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    11 hrs ago
  • కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులను పరిశీలించారు. CCTNS అప్‌డేట్‌లను సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రౌడీషీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని రాజేశ్ చంద్ర సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.
    1
    కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులను పరిశీలించారు. CCTNS అప్‌డేట్‌లను సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రౌడీషీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని రాజేశ్ చంద్ర సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గురువారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేటలో వన యోజన పార్కును ఘనంగా ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా వారు డీఎఫ్ఓ జోజి, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ రజినిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, అక్కన్నపేట పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు, రాష్ట్రంలోని మొత్తం 11 పార్కులకు రూ. 22 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. జూలైలో 765 డీజీ రోడ్డులో మొదటి దశ కింద 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ, భావితరాల కోసం జిల్లాకు కేటాయించిన 31 లక్షల మొక్కల నాటే లక్ష్యాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని, మైనింగ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో చెట్లను నాటాలని సూచించారు. అంతకుముందు, వారు అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
    1
    మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గురువారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేటలో వన యోజన పార్కును ఘనంగా ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా వారు డీఎఫ్ఓ జోజి, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ రజినిలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, అక్కన్నపేట పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు, రాష్ట్రంలోని మొత్తం 11 పార్కులకు రూ. 22 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. జూలైలో 765 డీజీ రోడ్డులో మొదటి దశ కింద 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ, భావితరాల కోసం జిల్లాకు కేటాయించిన 31 లక్షల మొక్కల నాటే లక్ష్యాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని, మైనింగ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో చెట్లను నాటాలని సూచించారు. అంతకుముందు, వారు అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
  • మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాబోయే తరాలకు ఆక్సిజన్ కొరత తలెత్తకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. మొక్కలు నాటడం ఒక్క రోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర అలవాటుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. వనమహోత్సవం సందర్భంగా మెదక్ నుంచి సిద్దిపేట వరకు నిర్మిస్తున్న నూతన 765 డిజి జాతీయ రహదారి మార్గంలో ఒకేరోజు సుమారు 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎంపీ తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.
    1
    మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాబోయే తరాలకు ఆక్సిజన్ కొరత తలెత్తకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. మొక్కలు నాటడం ఒక్క రోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర అలవాటుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.

వనమహోత్సవం సందర్భంగా మెదక్ నుంచి సిద్దిపేట వరకు నిర్మిస్తున్న నూతన 765 డిజి జాతీయ రహదారి మార్గంలో ఒకేరోజు సుమారు 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎంపీ తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • తీవ్ర వైకల్యంతో జీవిస్తున్న దివ్యాంగులు వైద్యం, ఫిజియోథెరపీ, సహాయక పరికరాలు, సంరక్షకుల ఖర్చుల పెరుగుదలతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని ఒక ఆత్మీయ సమావేశంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయి వైకల్యం కలిగిన వారికి ₹15,000 పెన్షన్ అందిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా హై సపోర్ట్ నీడ్స్ (HSN) మరియు తీవ్రమైన వైకల్యం గల దివ్యాంగులకు నెలకు ₹15,000 పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొల్లాపూర్‌లో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమావేశంలో ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు. దివ్యాంగుల గౌరవప్రదమైన జీవనానికి, ఆర్థిక భరోసాకు ₹15,000 పెన్షన్ అత్యవసరమని నొక్కి చెప్పారు. ఈ న్యాయమైన డిమాండ్‌కు మద్దతు తెలపాలని, ఈ సందేశాన్ని ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    తీవ్ర వైకల్యంతో జీవిస్తున్న దివ్యాంగులు వైద్యం, ఫిజియోథెరపీ, సహాయక పరికరాలు, సంరక్షకుల ఖర్చుల పెరుగుదలతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని ఒక ఆత్మీయ సమావేశంలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిస్థాయి వైకల్యం కలిగిన వారికి ₹15,000 పెన్షన్ అందిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా హై సపోర్ట్ నీడ్స్ (HSN) మరియు తీవ్రమైన వైకల్యం గల దివ్యాంగులకు నెలకు ₹15,000 పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కొల్లాపూర్‌లో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమావేశంలో ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు. దివ్యాంగుల గౌరవప్రదమైన జీవనానికి, ఆర్థిక భరోసాకు ₹15,000 పెన్షన్ అత్యవసరమని నొక్కి చెప్పారు. ఈ న్యాయమైన డిమాండ్‌కు మద్దతు తెలపాలని, ఈ సందేశాన్ని ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Bukka Ismail
    Bukka Ismail
    మనూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
  • కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖలో గురువారం సైబర్ నేరాలు మరియు ఓటీపీల మోసాలపై ఖాతాదారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీపక్ కుమార్ మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ అధికారులు గానీ, పోలీస్ అధికారులు గానీ ఫోన్ చేసి ఓటీపీలు అడగరని ప్రజలు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్సై దీపక్ కుమార్ సూచించారు. అంతేకాకుండా, ఇతర అత్యవసర సమయాల్లో 100 లేదా 112 నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
    1
    కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖలో గురువారం సైబర్ నేరాలు మరియు ఓటీపీల మోసాలపై ఖాతాదారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీపక్ కుమార్ మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ అధికారులు గానీ, పోలీస్ అధికారులు గానీ ఫోన్ చేసి ఓటీపీలు అడగరని ప్రజలు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు.

ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్సై దీపక్ కుమార్ సూచించారు. అంతేకాకుండా, ఇతర అత్యవసర సమయాల్లో 100 లేదా 112 నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.